kashmir: కశ్మీర్పై జర్మనీ వివాదాస్పద ప్రకటన ..!
కశ్మీర్పై జర్మనీ వివాదాస్పద ప్రకటన చేసింది. ఆ దేశ విదేశాంగ మంత్రి అన్నాలీనా రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం పాకిస్థాన్లో అడుగుపెట్టారు. దక్షిణాసియాలో ఇదే ఆమె తొలి పర్యటన.
ఇస్లామాబాద్ : కశ్మీర్పై జర్మనీ వివాదాస్పద ప్రకటన చేసింది. ఆ దేశ విదేశాంగ మంత్రి అన్నాలీనా రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం పాకిస్థాన్లో అడుగుపెట్టారు. దక్షిణాసియాలో ఇదే ఆమె తొలి పర్యటన. ఈ సందర్భంగా ఆమె పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీతో కలిసి కశ్మీర్పై వివాదాస్పద సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ‘‘కశ్మీర్లో మానవ హక్కులను కాపాడేందుకు ఐరాస కృషి చేయాలి. ఇరువైపుల నుంచి నిర్మాణాత్మక చర్యలు ఉంటేనే భారత్-పాక్ సంబంధాలు మెరుగుపడతాయి. జర్మనీ ఐరాస భద్రతా మండలిలో భాగస్వామి కాదు.. అందుకే ఐరాసలోని మిగిలిన విభాగాల్లో కశ్మీర్కు మద్దతు ఇస్తాం’’ అని పేర్కొన్నారు.
కొవిడ్ నిర్ధారణతో పర్యటన ముగింపు..!
జర్మనీ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అన్నాలీనా బేర్బాక్కు కోవిడ్ సోకడంతో పాక్ పర్యటన నుంచి అర్ధాంతరంగా వైదొలగారు. ఆమె పాక్ విదేశీవ్యవహారాల శాఖ మంత్రితో భేటీ అనంతరం కొవిడ్ పాజిటివ్గా తేలడంతో పర్యటన రద్దు చేసుకొని జర్మనీకి వెళ్లిపోయారు. భోజన సమయంలో వాసన, రుచి తెలియకపోవడాన్ని ఆమె గుర్తించారు. వెంటనే ఆమె సిబ్బంది యాంటీజెన్ పరీక్ష నిర్వహించగా కరోనా ఉన్నట్లు తేలింది. వాస్తవానికి ఆమె పాకిస్థాన్తో పాటు టర్కీ, గ్రీస్లో కూడా పర్యాటించాల్సి ఉంది. కానీ, ఇవన్నీ రద్దయినట్లు జర్మనీ విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?