Imran Khan: రహస్య పత్రాలను సేకరించిన మాట వాస్తవమే, కానీ: ఇమ్రాన్
అమెరికాలోని పాక్ రాయబార కార్యాలయం నుంచి రహస్య పత్రాలను సేకరించినట్లు పాక్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) అంగీకరించినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి.
ఇస్లామాబాద్: అమెరికాలోని (USA) పాక్ రాయబార కార్యాలయం నుంచి రహస్య పత్రాలను సేకరించినట్లు ఆ దేశ మాజీ ప్రధాని, పాక్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) పార్టీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ఒప్పుకున్నారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అయితే, వాటిని పోగొట్టుకున్నానని, ఎక్కడ మర్చిపోయాన్నది గుర్తుకు రావడంలేదని ఆయన చెప్పనట్లు సమాచారం. ఇమ్రాన్.. అమెరికాలోని పాక్ రాయబార కార్యాలయ రహస్య సమాచారాన్ని బహిర్గతం చేశారన్న అభియోగం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారిక రహస్యాల చట్టం కింద అతడిపై అదనపు కేసు నమోదైంది. తోషఖానా కేసులో ప్రస్తుతం అటక్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ను ఇవాళ ఫెడరల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ)కి చెందిన ముగ్గురు ఉన్నతాధికారులు విచారించారు.
విచారణకు ఇమ్రాన్ పూర్తిగా సహకరించినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. అయితే, బహిరంగ సభలో తాను ప్రదర్శించిన పత్రాలు అమెరికా దౌత్య కార్యాలయం నుంచి సేకరించినవి కాదని, అవి కేబినెట్ సమావేశానికి సంబంధించిన మినిట్స్ అని ఆయన అధికారులకు వివరించినట్లు తెలుస్తోంది.ప్రధానిగా కేబినెట్ మినిట్స్ను తనతోపాటు తీసుకెళ్లే అధికారం తనకుందని ఆయన చెప్పినట్లు సమాచారం. అయితే, ఆ పత్రాలను చూపిస్తూ రహస్య పత్రాలని ఎందుకు చెప్పారన్న ప్రశ్నకు మాత్రం ఆయన మౌనంగా ఉండిపోయినట్లు తెలుస్తోంది. ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ కేసు నమోదైంది. అభియోగం కోర్టులో రుజువైతే 2 నుంచి 14 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశముంది. కొన్ని కేసుల్లో మరణశిక్ష కూడా విధించే అవకాశం ఉంది.
మరోవైపు వివిధ కేసుల్లో ఇరుక్కుపోయిన ఇమ్రాన్.. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ శనివారం దాఖలు చేసిన పిటిషన్లను ఇస్లామాబాద్ హైకోర్టు ఇవాళ తిరస్కరించింది. దీంతో హైకోర్టు నిర్ణయాన్ని ఆయన సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. అంతకు ముందు మే 9న జరిగిన హింసాత్మక సంఘటనలు, న్యాయస్థానాల సమూహంపై దాడులు, నకిలీ ఖాతాలకు సంబంధించిన కేసుల్లోనూ బెయిల్ కోరుతూ అతడి తరఫు న్యాయవాది 9 పిటిషన్లు దాఖలు చేశారు. వీటిలో ఆరు పిటిషన్లను సెషన్స్ కోర్టు తిరస్కరించగా.. మరో మూడు పిటిషన్లను ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం కొట్టివేసింది.
తోషఖానా కేసులో అరెస్టయిన ఇమ్రాన్ ఇస్లామాబాద్ జిల్లా, సెషన్స్ కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం అటక్ జైలులో మూడేళ్ల శిక్ష అనుభవిస్తున్నారు. పాక్ ప్రముఖులు ఎవరైనా ఉన్నత పదవుల్లో ఉండి విదేశాల నుంచి బహుమతులు అందుకుంటే.. పదవి నుంచి వైదొలగిన తర్వాత వాటిని తోషాఖానాలో జమ చేయాల్సి ఉంటుంది. లేదంటే నిబంధనల ప్రకారం సగం ధర చెల్లించి వాటిని సొంతం చేసుకోవచ్చు. కానీ, ఇమ్రాన్ఖాన్ మాత్రం చాలా తక్కువ ధర చెల్లించి వాటిని తన వద్దే ఉంచుకున్నారని, మరికొన్నింటిని తోషఖానాకు తెలియకుండా విదేశాల్లోనే అమ్మేశారని ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగా దాదాపు 11.9 కోట్ల పాకిస్థాన్ రూపాయల విలువైన బహుమతులను చాలా తక్కువ మొత్తంలో చెల్లించి తీసుకున్నారన్నది అభియోగం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు..!
కరోనా వైరస్ (సార్స్కోవ్-2) జన్యు సీక్వెన్స్ను తొలిసారి ప్రచురించిన వైరాలజిస్ట్కు చైనా అధికారుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. -
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత
పాకిస్థాన్లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత్ అభివృద్ధి చెందుతున్న తీరును కొనియాడారు. -
గురుపత్వంత్పై హత్యాయత్నం వెనుక ‘రా’!
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూపై అమెరికాలో జరిగిన హత్యాయత్నంలో భారత్ గూఢచర్య సంస్థ ‘రా’ అధికారి ప్రమేయం ఉందని పేర్కొంటూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సోమవారం ఒక కథనం ప్రచురించింది. -
కెన్యాలో భారీ వర్షాలు.. డ్యాం కూలి 45 మంది దుర్మరణం
ఆఫ్రికా దేశమైన కెన్యాలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం నీటి ఉద్ధృతి ఎక్కువ కావడంతో పశ్చిమ కెన్యాలోని మై మహియు ప్రాంతంలోని పురాతన కిజాబె డ్యాం కూలిపోయింది. -
పారిస్కూ పాకిన విద్యార్థుల ఆందోళనలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న ఆందోళనలు ఫ్రాన్స్ రాజధాని పారిస్నూ కుదిపేస్తున్నాయి. సోమవారం సర్బాన్ యూనివర్సిటీలో విద్యార్ధులు పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు నిర్వహించారు. -
ఇజ్రాయెల్కు ఐసీసీ వారెంట్ల గుబులు!
కాల్పుల విరమణ చర్చలు కీలక దశకు చేరుకుంటున్న వేళ.. ఇజ్రాయెల్కు అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) గుబులు పట్టుకుంది. 2014 నాటి గాజా యుద్ధం కేసులో తమ సైనిక అధికారులు, నేతలపై ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయొచ్చన్న వార్తలపై ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. -
40 రోజుల కాల్పుల విరమణ!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా, ఈజిప్టు, ఖతార్ దేశాలు తెర వెనక జరుపుతున్న ప్రయత్నాలు కీలక దశకు చేరాయి. ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదనను ఈ దేశాలు హమాస్కు పంపాయి!.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ను కలిసిన సీఎం మాన్.. ఆయన ఏం చెప్పారంటే?
-
విప్రో కొత్త సీఈఓ వేతనం ఎంతో తెలుసా?
-
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు..!
-
‘ఇప్పటికి నిద్ర లేచారు..’: పతంజలి ఉత్పత్తుల లైసెన్సు రద్దుపై సుప్రీం
-
యువ రోహిత్ను చూశారా.. బర్త్డే గిఫ్ట్గా టీనేజ్ ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ
-
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్