Imran Khan: మా పార్టీపై నిషేధం విధిస్తే.. నా ప్లాన్ అదే!
ఒకవేళ పాకిస్థాన్లో తన పార్టీ ‘పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్’ (పీటీఐ)ను నిషేధిస్తే.. మరో కొత్త పార్టీని ఏర్పాటు చేస్తానని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. ఓ వార్తాసంస్థ ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.
ఇస్లామాబాద్: వందకుపైగా కేసులతో సతమతమవుతోన్న పాకిస్థాన్ (Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan).. నిత్యం ఏదో వివాదంతో వార్తల్లో నిలుస్తున్నారు. అటు ప్రభుత్వంపైనా తన విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. మరోవైపు.. ఆయన ఆధ్వర్యంలోని ‘పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్’ (PTI) పార్టీపై నిషేధం విధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ఒకవేళ ఇదే జరిగితే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను మళ్లీ ఒక కొత్త పార్టీని స్థాపించి, విజయం సాధిస్తానని పేర్కొన్నారు.
ఇటీవల ఇమ్రాన్ ఖాన్ అరెస్టు అనంతరం పాకిస్థాన్లో పెద్దఎత్తున ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. దేశంలోని ఘర్షణలకు ఇమ్రాన్ పార్టీ ‘పీటీఐ’నే కారణమన్న ఆరోపణలు వచ్చాయి. మరోవైపు.. లాహోర్లోని ఇమ్రాన్ ఇంటి నుంచి మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ఇటీవల ప్రకటించారు. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో.. ‘పీటీఐ’ని నిషేధిత సంస్థగా ప్రకటించే అంశాన్ని శహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పరిశీలిస్తోంది. అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రాణా సనావుల్లాతోపాటు పలువురు మంత్రులు ఆయా సందర్భాల్లో ఈ విషయాన్ని వెల్లడించారు.
మహాత్మా గాంధీ, మండేలాలే నాకు స్ఫూర్తి : పాక్ మాజీ ప్రధాని
ఇదే విషయమై ఇటీవల ఓ వార్తాసంస్థ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్.. ‘ఒకవేళ తమ పార్టీని తొలగిస్తే.. కొత్త పేరుతో మరో పార్టీని ఏర్పాటు చేస్తాం. ఎన్నికల్లో పోరాడి గెలుస్తాం. నాపై అనర్హత వేటు వేసినా, జైలుకు పంపించినా.. మా పార్టీ మాత్రం విజయం సాధిస్తుంది’ అని చెప్పారు. పాకిస్థాన్ రాజకీయాలు మారిపోయాయని.. తన అనుచరగణం మాత్రం చెక్కుచెదరలేదని ఇమ్రాన్ ఖాన్ ఆ ఇంటర్వ్యూలో తెలిపారని పాక్ వార్తాసంస్థ ‘డాన్’ వెల్లడించింది. ఇప్పటికీ బెదిరింపుల ద్వారా తమ పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆయన ఆరోపించినట్లు పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు..!
కరోనా వైరస్ (సార్స్కోవ్-2) జన్యు సీక్వెన్స్ను తొలిసారి ప్రచురించిన వైరాలజిస్ట్కు చైనా అధికారుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. -
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత
పాకిస్థాన్లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత్ అభివృద్ధి చెందుతున్న తీరును కొనియాడారు. -
గురుపత్వంత్పై హత్యాయత్నం వెనుక ‘రా’!
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూపై అమెరికాలో జరిగిన హత్యాయత్నంలో భారత్ గూఢచర్య సంస్థ ‘రా’ అధికారి ప్రమేయం ఉందని పేర్కొంటూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సోమవారం ఒక కథనం ప్రచురించింది. -
కెన్యాలో భారీ వర్షాలు.. డ్యాం కూలి 45 మంది దుర్మరణం
ఆఫ్రికా దేశమైన కెన్యాలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం నీటి ఉద్ధృతి ఎక్కువ కావడంతో పశ్చిమ కెన్యాలోని మై మహియు ప్రాంతంలోని పురాతన కిజాబె డ్యాం కూలిపోయింది. -
పారిస్కూ పాకిన విద్యార్థుల ఆందోళనలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న ఆందోళనలు ఫ్రాన్స్ రాజధాని పారిస్నూ కుదిపేస్తున్నాయి. సోమవారం సర్బాన్ యూనివర్సిటీలో విద్యార్ధులు పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు నిర్వహించారు. -
ఇజ్రాయెల్కు ఐసీసీ వారెంట్ల గుబులు!
కాల్పుల విరమణ చర్చలు కీలక దశకు చేరుకుంటున్న వేళ.. ఇజ్రాయెల్కు అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) గుబులు పట్టుకుంది. 2014 నాటి గాజా యుద్ధం కేసులో తమ సైనిక అధికారులు, నేతలపై ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయొచ్చన్న వార్తలపై ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. -
40 రోజుల కాల్పుల విరమణ!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా, ఈజిప్టు, ఖతార్ దేశాలు తెర వెనక జరుపుతున్న ప్రయత్నాలు కీలక దశకు చేరాయి. ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదనను ఈ దేశాలు హమాస్కు పంపాయి!.
తాజా వార్తలు (Latest News)
-
ధరలు పెరిగినా.. బంగారం గిరాకీ తగ్గలే!
-
కేజ్రీవాల్ను కలిసిన పంజాబ్ సీఎం.. ఆయన ఏం చెప్పారంటే?
-
విప్రో కొత్త సీఈఓ వేతనం ఎంతో తెలుసా?
-
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు..!
-
‘ఇప్పటికి నిద్ర లేచారు..’: పతంజలి ఉత్పత్తుల లైసెన్సు రద్దుపై సుప్రీం
-
యువ రోహిత్ను చూశారా.. బర్త్డే గిఫ్ట్గా టీనేజ్ ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ