Imran Khan: మహాత్మా గాంధీ, మండేలాలే నాకు స్ఫూర్తి : పాక్ మాజీ ప్రధాని
స్వేచ్ఛ కోసం పోరాటం చేసిన నెల్సన్ మండేలా, మహాత్మాగాంధీ (Mahatma Gandhi), జిన్నా లాంటి నిస్వార్థ సేవకులే తనకు స్ఫూర్తి అని పాకిస్థాన్ (Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) వ్యాఖ్యానించారు.
ఇస్లామాబాద్: ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్లో (Pakistan) కొంతకాలంగా రాజకీయ కల్లోలం కూడా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) అరెస్టు తర్వాత పీటీఐ పార్టీ నేతల అరెస్టులు, ఆందోళనలు, బెయిల్ కోసం న్యాయస్థానాల చుట్టు తిరగడం వంటివి నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి. ఇలా తనను అణచివేసేందుకు ఎన్ని అభియోగాలు మోపినా.. అరెస్టు చేసి జైల్లో పెట్టినా.. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు ఖాయమని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రపంచ చరిత్రలో నిలిచిపోయిన మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా వంటి దిగ్గజ నేతలతో తనను పోల్చుకున్నారు. అంతర్జాతీయ పత్రిక ది ఇండిపెండెంట్కు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని అంశాలను పరిశీలిస్తే..
నన్ను మళ్లీ జైల్లో పెడతారు..
‘వాళ్లు నన్ను మళ్లీ జైల్లో పెడతారని తెలుసు. దానికి సమయం ఏమీ పట్టదు. ఎందుకంటే.. నేను బయట ఉంటే నా పార్టీకి ఎంతో బలం ఉంటుందనే భయం వారిలో ఉంది. అందుకే మమ్మల్ని జైల్లో పెట్టి ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా అడ్డుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు వేల మంది పీటీఐ కార్యకర్తలను నిర్బంధించారు. మా పార్టీకి భయపడే నన్ను జైలుకు పంపించేందుకు యత్నిస్తున్నారు. తద్వారా నాపై అనర్హత వేటు వేయాలన్నది వారి వ్యూహం. అయినప్పటికీ నేను ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతూనే ఉన్నా. మమ్మల్ని ఎంత అణచివేసేందుకు ప్రయత్నిస్తే.. పార్టీకి (PTI) అంత మద్దతు లభిస్తుంది’ అని ఇమ్రాన్ పేర్కొన్నారు. తనకు వ్యక్తిగతంగా ఎటువంటి లక్ష్యాలు లేవని.. నెల్సన్ మండేలా, మహాత్మా గాంధీలతోపాటు మహమ్మద్ అలీ జిన్నా వంటి నేతల అడుగుజాడల్లోనే నడుస్తానన్నారు.
గాంధీ, మండేలా నిస్వార్థ సేవకులు..
‘రాజకీయాలే కెరీర్గా నేను ఇందులోకి రాలేదు. రాజకీయాలను వృత్తిగా భావించేందుకు నేను ఎవ్వరినీ ప్రోత్సహించను. నా కుమారులను కూడా రాజకీయాల్లోకి రావద్దనే చెబుతా. ఎందుకంటే అదో వరస్ట్ కెరీర్. రాజకీయాలంటే ఓ లక్ష్యంతో కూడుకున్నవి. నెల్సన్ మండేలా (Nelson Mandela), మహాత్మాగాంధీ (Mahatma Gandhi), జిన్నా (Muhammad Ali Jinnah) లాంటి వాళ్లు స్వేచ్ఛ కోసం పోరాటం చేశారు. వారు నిస్వార్థ సేవకులు. అందుకే వారు నాకు స్ఫూర్తి. వారెప్పుడూ అధికారం కోసం ప్రయత్నించలేదు. ఓ లక్ష్యం కోసం పోరాడారు’ అని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో తాము ఓ లక్ష్యంతో పనిచేస్తున్నామని.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పీటీఐదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
ప్రధాని పదవికి రాజీనామా చేసిన తర్వాత ఇమ్రాన్పై ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వం ఎన్నో కేసులు నమోదు చేసింది. అవినీతి, హత్యలు, దాడులు, దేశద్రోహం, ఉగ్రవాదం వంటి దాదాపు 170 కేసులు ఆయనపై నమోదయ్యాయి. అయితే, ఇవన్నీ రాజకీయ ప్రేరేపితమైనవని, కేవలం ఇమ్రాన్ మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు ఈ అభియోగాలు మోపుతున్నారని ఇమ్రాన్ పార్టీ ఆరోపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లోక్సభ ఎన్నికల వేళ.. దిల్లీ హైకోర్టుకు ‘డీప్ఫేక్’ వ్యవహారం
Deepfake videos: లోక్సభ ఎన్నికల సమయంలో డీప్ఫేక్ వీడియోల వ్యాప్తిని అరికట్టాలని కోరుతూ దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. -
తమిళనాడు క్వారీలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి
తమిళనాడులో బుధవారం ఉదయం భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు చనిపోగా.. మరికొందరు గాయపడినట్లు తెలుస్తోంది. -
దాదాపు 100 స్కూళ్లకు ఒకేసారి బాంబు బెదిరింపులు.. దిల్లీలో కలకలం
Bomb threats: దిల్లీ, నోయిడా ప్రాంతాల్లో దాదాపు 100 స్కూళ్లకు ఏకకాలంలో బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. -
తప్పుడు కేసులతో భర్తను వేధించడం క్రూరత్వమే
లేనిపోని ఆరోపణలతో భర్త, అతని బంధువులపై కేసులు నమోదు చేసి వేధించడాన్ని క్రూరత్వ చర్యగానే పరిగణించాల్సి ఉంటుందని బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్ ధర్మాసనం స్పష్టం చేసింది. -
పతంజలి బహిరంగ క్షమాపణలపై సుప్రీంకోర్టు సంతృప్తి
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల సామర్థ్యంపై ఇచ్చిన మోసపూరిత ప్రకటనలకు గాను యోగా గురు రాందేవ్, ఆచార్య బాలకృష్ణ, సంబంధిత సంస్థ సంయుక్తంగా.. వార్తా పత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు వెలువరించడంపై సుప్రీంకోర్టు మంగళవారం సంతృప్తి వ్యక్తం చేసింది. -
దక్షిణాసియాలో ఈసారి వానలే వానలు
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో దక్షిణాసియా అంతటా సాధారణాన్ని మించి వర్షాలు కురుస్తాయని సౌత్ ఆసియా క్లైమేట్ అవుట్లుక్ ఫోరం (ఎస్ఏఎస్సీవోఎఫ్) మంగళవారం వెల్లడించింది. -
ఓటు వేయాలని గుర్తుచేసే ‘బడ్డీ బ్యాండ్’
తొలిసారి ఓటు హక్కు పొందిన వారిని పోలింగ్ బూత్కు వచ్చేలా ప్రోత్సహించడానికి అస్సాంలోని కామరూప్ జిల్లా ఎన్నికల అధికారి కీర్తి జల్లి వినూత్న ఆలోచన చేశారు. రెండో సారి ఓటు వేయబోతున్నవారు కొత్త ఓటర్లను ప్రోత్సహించేలా ‘బడ్డీ ఓటర్’ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. -
కేజ్రీవాల్ను ఎన్నికల ముందే ఎందుకు అరెస్టు చేశారు?
దేశంలో సరిగ్గా సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ముందే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేయడానికి కారణమేంటి? అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ను సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నించింది. -
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
అత్తింటి వేధింపులు తట్టుకోలేక విడాకులు తీసుకున్న కుమార్తెను.. ఓ తండ్రి మేళతాళాలతో ఊరేగింపుగా పుట్టింటికి తీసుకువచ్చారు. -
జమ్మూలో భారీ వర్షాలు.. ముగ్గురి మృతి
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు కొండ చరియలు విరిగిపడటంతో జమ్మూలోని పలు ప్రాంతాలు అస్తవ్యస్తంగా మారాయి. -
మణిపుర్ ఘటనలో పోలీసుల ప్రేక్షకపాత్ర
దేశంలో కలకలం రేపిన మణిపుర్ దాడుల ఘటనలో పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడమే కాకుండా, సాయం కోరి వచ్చిన బాధితులను ఏమాత్రం పట్టించకోకుండా అల్లరిమూకలకు సహకరించేలా వ్యవహరించారని సీబీఐ ఛార్జిషీటులో వెల్లడించింది. -
శారదా మఠం అధ్యక్షురాలు ఆనందప్రాణ కన్నుమూత
శ్రీ శారదా మఠం, రామకృష్ణ శారదా మిషన్ అధ్యక్షురాలు ప్రవ్రాజిక ఆనందప్రాణ మాతాజీ మంగళవారమిక్కడ కన్నుమూశారు. -
నిర్బంధ శిబిరాల్లో విదేశీయులు ఎంతమంది ఉన్నారు?
అస్సాంలోని నిర్బంధ శిబిరాల్లో రెండేళ్లకు పైగా ఎంత మంది విదేశీయులు ఉన్నారో నివేదించాలని ఆ రాష్ట్ర న్యాయ సేవల సంస్థను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
పశ్చిమబెంగాల్లో 47.6 డిగ్రీలు
దేశంలో ఎన్నడూ లేనంతగా వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పశ్చిమబెంగాల్లోని కలాయ్కుందాలో మంగళవారం వేసవి తాపం 47.6 డిగ్రీల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. -
మణిపుర్లో ఆయుధాల తరలింపును అడ్డుకున్న మహిళలు
మణిపుర్లోని బిష్ణుపుర్ జిల్లాలో స్వాధీనం చేసుకొన్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సైనికదళాలు మంగళవారం తరలిస్తుండగా మహిళల సారథ్యంలోని ఆందోళనకారులు అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. -
ప్రజ్వల్పై నివేదికకు మహిళా కమిషన్ ఆదేశం
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఉదంతంపై అన్ని వివరాలతో మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆ రాష్ట్ర డీజీపీని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఆదేశించింది. -
1950లను దృష్టిలో ఉంచుకొని ప్రైవేటు ఆస్తిపై వ్యాఖ్యానం చేయకూడదు: సుప్రీం
‘‘ఏ ప్రైవేటు ఆస్తి సమాజ వనరు కాదు.. అన్ని ప్రైవేటు ఆస్తులూ సమాజ వనరులే .. ఈ రెండు పరస్పర భిన్నమైన విధానాలు. -
అమిత్ షా నకిలీ వీడియో కేసు.. గుజరాత్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేవానీ పీఏ అరెస్టు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నకిలీ వీడియోను ఫేస్బుక్లో షేర్ చేశారన్న ఆరోపణలపై ఓ కాంగ్రెస్ నేతను, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యకర్తను అరెస్టు చేసినట్లు గుజరాత్ పోలీసులు మంగళవారం వెల్లడించారు. -
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
Anand Mahindra: సామాజిక మాధ్యమాల వేదికగా ఎప్పుడూ తన అభిప్రాయాలను పంచుకొనే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా మరో వీడియో పోస్ట్ చేశారు. -
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేక విడాకులు తీసుకున్న కుమార్తెను.. ఆమె తండ్రి మేళతాళాలతో ఊరేగింపుగా పుట్టింటికి తీసుకువచ్చాడు.
తాజా వార్తలు (Latest News)
-
కెప్టెన్గా మార్ష్.. యంగ్ సెన్సేషన్కు నో ఛాన్స్.. ఆసీస్ జట్టు ఇదే!
-
‘రామాయణ’లో పాత్ర..రూమర్స్పై లారా దత్తా కామెంట్స్
-
లోక్సభ ఎన్నికల వేళ.. దిల్లీ హైకోర్టుకు ‘డీప్ఫేక్’ వ్యవహారం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
జీఎస్టీ చరిత్రలో రికార్డు వసూళ్లు.. ఒక్క నెలలో రూ.2.10 లక్షల కోట్లు!
-
చెన్నై ‘విన్నింగ్’ ట్రెండ్ను కొనసాగిస్తుందా.. ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుంటుందా?