Kosovo parliament: కొసావో పార్లమెంట్లో ఎంపీల ఘర్షణ..!
వీధి రౌడీల్లా పార్లమెంట్ సభ్యులు తన్నుకొన్న ఘటన కొసావో పార్లమెంట్లో చోటు చేసుకొంది.
ఇంటర్నెట్డెస్క్: బాధ్యతగల చట్టసభ సభ్యులే వీధి రౌడీల్లా బాహాబాహీకి తలపడ్డారు. అడ్డం వచ్చిన మహిళా సభ్యురాలినీ పక్కకు నెట్టేశారు. ఈ ఘటన కొసావో పార్లమెంట్లో చోటు చేసుకొంది. అధికార, ప్రతిపక్షాల మధ్య జరిగిన ఈ ఘర్షణ వీడియో వైరల్గా మారింది.
కొసావో పార్లమెంట్లో గురువారం ప్రధాని అల్బిన్ కుర్టి.. దేశంలోని సెర్బ్ జాతీయులతో ఘర్షణలను తగ్గించేందుకు తీసుకొంటున్న చర్యలను సభకు వివరిస్తున్నారు. ఈ సమయంలో ప్రతిపక్ష సభ్యుడు మెర్గిమ్ లేచి కుర్టి వైపు దూసుకెళ్లి నీళ్లు చల్లారు. ఈ చర్యతో పార్లమెంట్ ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. అధికార, ప్రతిపక్ష సభ్యులు పరస్పరం దాడికి దిగారు. దీంతో భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. ఓ లీకైన ఆడియోపై చర్చ సందర్భంగా ఈ గొడవ జరిగింది. దీంతో పార్లమెంట్ను రెండు గంటలపాటు వాయిదావేశారు.
కొన్నాళ్లుగా జాతులపరమైన ఘర్షణలతో ఉత్తర కొసావాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనిలో అంతర్జాతీయ శాంతి దళాలకు చెందిన పలువురు సైనికులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో మరికొంత మంది సైనికుల్ని నాటో అక్కడికి తరలించింది. కొసావో ప్రజల భద్రతకు అవసరమైన అన్ని చర్యల్ని తీసుకుంటామని చెప్పింది. స్థానిక ఎన్నికలతో కొసావోలో గొడవలు మొదలయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖర్కీవ్పై పట్టుబిగిస్తున్న రష్యా
ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించేందుకు రష్యా అక్కడి పట్టణాలు, గ్రామాలను లక్ష్యంగా చేసుకొని ఉద్ధృతంగా భూతల దాడులు జరుపుతోంది. -
పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఆందోళనలు
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) హింసతో దద్దరిల్లిపోతోంది. ఎలాంటి పన్నుల్లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని, గోధుమపిండిని రాయితీ ధరకు అందించాలని స్థానిక జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. -
శభాష్ ‘ఎవరెస్ట్ మ్యాన్’!
ఎవరెస్ట్ మ్యాన్గా పేరొందిన 54 ఏళ్ల నేపాలీ షెర్పా కమీ రీటా మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. 29వసారీ ఎవరెస్టును అధిరోహించి తన రికార్డును తానే తిరగరాసుకున్నాడు. -
ఇజ్రాయెల్కు అనూహ్య ప్రతిఘటన
ఈజిప్టు- దక్షిణ గాజా సరిహద్దుల్లోని రఫా నగరంపై దాడి చేస్తే హమాస్ అంతమవుతుందని భావిస్తున్న ఇజ్రాయెల్కు అనూహ్య పరిణామాలు ఎదురవుతున్నాయి. -
జన్యుమార్పిడి పంది కిడ్నీ అమర్చిన వ్యక్తి మృతి
జన్యుమార్పిడి పంది నుంచి సేకరించిన మూత్రపిండాన్ని పొందిన తొలివ్యక్తి రిచర్డ్ ‘రిక్’ స్లేమన్ (62) చనిపోయారు. కొత్త అవయవాన్ని పొందిన అనంతరం అతడు దాదాపు రెండు నెలలు జీవించాడు. -
ఓటు మేల్ తలపెట్టవోయ్
సార్వత్రిక సమరానికి సర్వం సన్నద్ధమైంది. ఓటరు స్వేచ్ఛగా తమ ఓటు వేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. పోలింగ్కు అవసరమైన సామగ్రి, ఈవీఎంలు, వీవీప్యాట్లు, సిబ్బందిని ఆదివారం రాత్రికే తరలించారు. -
భారత్ ఇచ్చిన ఎయిర్క్రాఫ్ట్లను నడిపే సామర్థ్యం మా పైలట్లకు లేదు: మాల్దీవుల మంత్రి
భారత్ విరాళంగా ఇచ్చిన రెండు హెలికాప్టర్లు, ఒక డోర్నియర్ విమానాన్ని నడిపై శక్తిసామర్థ్యాలు తమ దేశ పైలట్లకు లేవని ఆ దేశ రక్షణశాఖ మంత్రి పేర్కొన్నారు. -
తండ్రికి నెలకు రూ.1.2 లక్షల పింఛన్.. మృతదేహాన్ని ఏళ్లపాటు ఇంట్లోనే దాచిపెట్టి!
తండ్రికి వచ్చే పింఛన్ తీసుకొంటున్న ఓ మహిళ.. అతడి మృతదేహాన్ని ఇంట్లోనే ఏళ్లపాటు దాచిపెట్టినట్లు వెల్లడైంది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఇచ్చిన ఎయిర్క్రాఫ్ట్లను నడిపే సామర్థ్యం మా పైలట్లకు లేదు: మాల్దీవుల మంత్రి
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (13/05/24)
-
క్లీంకారకు ఉపాసన థ్యాంక్స్.. ఒకే ఫ్రేమ్లో అక్కినేని హీరోలు
-
నాకు తప్ప వారందరికీ వివాహమైంది: సోనాక్షి సిన్హా
-
తండ్రికి నెలకు రూ.1.2 లక్షల పింఛన్.. మృతదేహాన్ని ఏళ్లపాటు ఇంట్లోనే దాచిపెట్టి!
-
అవును.. వారి స్టైల్ కాపీ చేశా: నెటిజన్ ప్రశ్నపై జాన్వీ కపూర్