Modi: ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.. ఫ్రాన్స్ అత్యున్నత అవార్డుతో సత్కారం
Modi France Visit: ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోదీని అధ్యక్షుడు మేక్రాన్.. ఆ దేశ అత్యున్నత పౌర, సైనిక పురస్కారంతో సత్కరించారు. ఈ అవార్డు అందుకున్న తొలి భారత ప్రధాని మోదీనే కావడం విశేషం.
పారిస్: ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi France Visit)కి అరుదైన గౌరవం లభించింది. ఆతిథ్య దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ (Emmanuel Macron).. మోదీని ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ ఆనర్’ పురస్కారంతో సత్కరించారు. ఫ్రాన్స్ అత్యున్నత పౌర, సైనిక పురస్కారాన్ని అందుకున్న తొలి భారత ప్రధాని మోదీనే కావడం విశేషం.
గురువారం ఎలీసీ ప్యాలెస్లో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు మేక్రాన్.. మోదీకి ఈ పురస్కారం అందజేశారు. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా, బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్, జర్మనీ మాజీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ జనరల్ బుట్రోస్ బుట్రోస్ ఘలి వంటి వారు ఈ అవార్డును అందుకున్నారు. ఇప్పుడు వారి సరసన మోదీ చేరారు. ఈ సత్కారానికి గానూ భారత ప్రజల తరఫున మోదీ.. మేక్రాన్కు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు అధ్యక్ష భవనం ఎలీసీ ప్యాలెస్లో అధ్యక్షుడు మేక్రాన్ దంపతులు ప్రధాని మోదీకి ప్రత్యేక విందు ఇచ్చారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ (PM Modi) గురువారం పారిస్ చేరుకున్నారు. ఈ పర్యటనలో మోదీ పలు కీలక ప్రకటనలు చేశారు. ‘యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్’ (UPI)ని ఫ్రాన్స్లోనూ వినియోగించేందుకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరినట్లు చెప్పారు. భారతీయ విద్యార్థులు మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు ఐదేళ్ల వీసాలు మంజూరు చేయడానికి ఫ్రాన్స్ నిర్ణయించిందని వెల్లడించారు. మార్సెల్లీలో నూతనంగా భారత కాన్సులేట్ను ప్రారంభించినట్లు తెలిపారు. శుక్రవారం ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం- బాస్టీల్ డే వేడుకల్లో గౌరవ అతిథిగా మోదీ పాల్గొననున్నారు.
ఎంబాపె మీకంటే మాకే బాగా తెలుసు..
నిన్న రాత్రి ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్కు చెందిన సంచలన ఫుట్బాల్ ఆటగాడు కిలియన్ ఎంబాపె (Kylian Mbappe)పై మోదీ ప్రశంసలు కురిపించారు. భారత్లో అతడికి పాపులారిటీ పెరుగుతోందన్నారు. ‘‘భారత యువతలో ఎంబాపె సూపర్ హిట్ అయ్యాడు. అతడి గురించి ఫ్రాన్స్లో కంటే భారత్లోనే ఎక్కువ మందికి తెలుసనుకుంటా’’ అని మోదీ అన్నారు.
గతేడాది చివర్లో జరిగిన ఫిఫా ప్రపంచకప్ (FIFA Worldcup 2022) తుదిపోరులో హ్యాట్రిక్ గోల్స్తో ఎంబాపె అత్యుత్తమ ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. ఆ ఫైనల్ పోరులో ఫ్రాన్స్ ఓటమిపాలైనప్పటికీ.. విజయం కోసం గొప్పగా పోరాడిన ఎంబాపె అందరి హృదయాలను గెలిచాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
Elon Musk: గ్రహాంతర జీవులు ఉన్నారా అనే అంశంపై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ స్పందించారు. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
పదేళ్ల పాలనలో భాజపా ఎన్ని హామీలు అమలు చేసింది?: బండి సంజయ్కు మంత్రి పొన్నం కౌంటర్
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
-
భారత్ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!
-
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు