British Nurse: ‘అప్పుడే వినుంటే.. ఆ చిన్నారులు బతికేవారేమో’: రాకాసి నర్సును పట్టించిన భారత సంతతి వైద్యుడు
ఇంగ్లాండ్లోని ఓ ఆసుపత్రిలో నవజాత శిశువులను కంటికి రెప్పలా సంరక్షించాల్సిన నర్సు (Nurse) దారుణానికి పాల్పడింది. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఏడుగురు శిశువులను చంపేసింది. భారత సంతతి వైద్యుడు రవి జయరాం ఈ నర్సును పట్టించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
లండన్: వైద్య వృత్తికి, మానవత్వానికి మచ్చ తెచ్చేలా పసికందుల ఉసురు తీసిన యూకే (UK) నర్సు ఉదంతం ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దారుణానికి ఒడిగట్టిన నర్సును పట్టించిన భారత సంతతి వైద్యుడు.. ఈ ఘటన గురించి కీలక విషయాలను వెల్లడించారు. నర్సు గురించి తాను ముందే హెచ్చరించానని, అప్పుడే గుర్తించి ఉంటే కొంతమంది చిన్నారుల ప్రాణాలను కాపాడగలిగేవాళ్లమని విచారం వ్యక్తం చేశారు.
ఇంగ్లాండ్ (England)లోని చెస్టర్లో కౌంటెస్ ఆఫ్ చెస్టర్ ఆసుపత్రిలో 2015-16లో ఈ దారుణం చోటుచేసుకుంది. నవజాత శిశువుల వార్డులో పనిచేస్తున్న లూసీ లెబ్టీ(33) ఈ దుర్మార్గానికి పాల్పడినట్లు తేలడంతో ఆమెను దోషిగా నిర్ధారించారు. భారతీయ మూలాలున్న వైద్యుడు రవి జయరాం సహా ఇతర వైద్యులు చేసిన ఫిర్యాదుతో ఈ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఇదే ఆసుపత్రిలో జయరాం (Indian-origin Doctor Ravi Jayaram) పిల్లల వైద్యుడిగా సేవలందిస్తున్నారు.
ఆ నర్సు.. ఏడుగురు పసికందులను చంపిన ఓ నరరూప రాక్షసి
కోర్టు తీర్పు అనంతరం రవి జయరాం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘2015 జూన్లో ముగ్గురు పసికందులు ప్రాణాలు కోల్పోయారు. ఒకరోజు రాత్రి నేను నవజాత శిశువుల వార్డు ముందు నుంచి వెళ్తుండగా లూసీ ఇంక్యుబేటర్ పక్కన నిల్చుని కన్పించింది. ఎందుకో అక్కడి పరిస్థితులు సాధారణంగా లేవని నాకు అనిపించింది. అప్పుడే మాకు లూసీపై తొలిసారి అనుమానం వచ్చింది. ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్స్కు ఆమె గురించి చెప్పాం. అయితే, వారు మమ్మల్ని నమ్మలేదు సరికదా.. సహోద్యోగిపై అనవసర ఆరోపణలు చేయొద్దని అన్నారు. అంతేగాక, లూసీకి క్షమాపణ చెప్పాలని మాకు సూచించారు. ఉన్నతాధికారుల బలవంతంలో మేం ఆమెకు క్షమాపణ చెబుతూ నోట్ రాయాల్సి వచ్చింది. అప్పుడే మా ఆందోళనను సీరియస్గా తీసుకుని ఉంటే.. కనీసం నలుగురైదుగురు చిన్నారులు.. ఇప్పుడు స్కూళ్లకు వెళ్లి ఉండేవారని నేను నమ్మకంగా చెప్పగలను’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
2017 ఏప్రిల్ నాటికి గానీ లూసీ గురించి ఫిర్యాదు చేసేందుకు తమను నేషనల్ హెల్త్ సర్వీస్ ట్రస్ట్ అనుమతించలేదని రవి జయరాం తెలిపారు. ‘‘అప్పుడు మేం పోలీసుల వద్దకు వెళ్లి జరిగిన ఉదంతాన్ని వివరించాం. 10 నిమిషాల్లోనే వారికి పరిస్థితి అర్థమైంది. ఆ వెంటనే వారు దర్యాప్తు ప్రారంభించి లూసీని అరెస్టు చేశారు’’ అని రవి కేసు గురించి వివరించారు.
నవజాత శిశువుల వార్డులో విధులు నిర్వహించిన లూసీ.. ఇంజెక్షన్ ద్వారా శిశువుల రక్తంలోకి గాలిని పంపడం, నాసోగ్యాస్ట్రిక్ గొట్టాల ద్వారా వారి కడుపులోకి పాలు, నీటిని బలవంతంగా పంపడం వంటివి చేసింది. తద్వారా శ్వాసనాళాలకు అంతరాయం కలిగించడంతో ఏడుగురు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు చిన్నారులపై కూడా లూసీ ఇలాంటి దారుణాలకే పాల్పడగా.. వారు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. 2018 జులైలో లూసీని పోలీసులు అరెస్టు చేశారు. నవంబరు 2020న అభియోగాలు మోపగా.. తాజాగా ఆమెను దోషిగా తేల్చారు. సోమవారం ఆమెకు శిక్ష ఖరారు కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యూఏఈ నుంచి ఇక ‘బ్లూ రెసిడెన్సీ వీసా’.. ఎవరికంటే..?
UAE Blue Residenency Visa: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరో కొత్త వీసా పథకాన్ని ప్రకటించింది. 10 ఏళ్ల కాలానికి బ్లూ రెసిడెన్సీ వీసాను ఇవ్వనున్నట్లు తెలిపింది. మరి ఈ వీసా ఎవరికంటే..? -
ఆంక్షలు విధించిన అమెరికాలోనే.. రహస్యంగా ఉత్తర కొరియన్లు వర్క్ఫ్రమ్ హోం
ఉత్తర కొరియాలో ఉంటూ.. అమెరికాలోని కీలక టెక్ కంపెనీలకు వర్క్ఫ్రమ్ హోం విధానంలో ఉద్యోగాలు చేస్తున్నారు కొందరు. ఈ విషయం బయటపడి తమ టెక్నాలజీ ఎక్కడ దారి తప్పుతుందో అని అమెరికా హడలిపోతోంది. -
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
19 ఏళ్ల కుర్రాడిని కిడ్నాప్ చేసి.. అతడి ఇంటికి 100 మీటర్ల దూరంలోనే 26 ఏళ్లు బంధించారు. చివరికి ఓ సోషల్ మీడియా పోస్టులో లభించిన క్లూ ఆధారంగా అతడిని అధికారులు రక్షించారు. -
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?
One Chip Challenge: పాఖీ కంపెనీ విసిరిన వన్ చిప్ ఛాలెంజ్ తీవ్ర విమర్శలకు దారితీసింది. గత ఏడాది సంభవించిన హారిస్ వోలోబా మరణానికి ఇదే కారణమని పరోక్షంగా తేల్చింది. -
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
India-US: భారత్-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు. -
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
రంజాన్ నెలలో బాంబింగ్ ఆపాలని ఇజ్రాయెల్కు చెప్పాను: మోదీ
-
స్థిరాస్తి రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు: తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు
-
బౌలర్ల భవిష్యత్తు కాపాడండి.. అందుకు ఇలా చేయండి: అనిల్ కుంబ్లే
-
వరల్డ్ ‘సూపర్-రిచ్’లో 15 మంది.. జాబితాలో అదానీ
-
యూఏఈ నుంచి ఇక ‘బ్లూ రెసిడెన్సీ వీసా’.. ఎవరికంటే..?
-
టెండర్లలో 1.5 శాతం ఆయనకు ఇవ్వాల్సిందే: ఈడీ