Iran rial: డాలరుకు 6లక్షల రియాల్స్.. రికార్డు స్థాయిలో పతనం
ఇరాన్లో (Iran) హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతోన్న వేళ.. అక్కడి కరెన్సీ (Currency) కూడా రికార్డు స్థాయిలో పతనమవుతోంది. తాజాగా అమెరికా డాలరుకు (Dollar) 6లక్షల రియాళ్లకు పడిపోయినట్లు నివేదికలు వెల్లడించాయి.
దుబాయ్: హిజాబ్ వ్యతిరేక ఆందోళనలతో ఇరాన్ (Iran) ఐదారు నెలలుగా అట్టుడుకిపోతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరాన్ స్థానిక కరెన్సీ రికార్డు స్థాయిలో పతనమవుతోంది. అమెరికా డాలరుతో (US Dollar) పోలిస్తే 6లక్షల ఇరానియన్ రియాల్స్కు (Iranian Rial) పడిపోయింది. మూడు రోజుల క్రితం అది 5లక్షల రియాల్లుగా ఉండగా.. తాజాగా అది మరింత క్షీణించడం గమనార్హం. అయితే, డాలరుకు 6లక్షలకు పడిపోవడం మాత్రం ఇదే తొలిసారి.
కొన్ని దశాబ్దాలుగా అమెరికా డాలరుతో పోలిస్తే ఇరాన్ కరెన్సీ భారీగానే పతనమవుతోంది. 1979లో ఇస్లామిక్ విప్లవం సమయంలో డాలరుకు 100 రియాల్స్ వద్ద ట్రేడ్ అయిన ఇరానియన్ కరెన్సీ.. క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. 2015లో జరిగిన న్యూక్లియర్ ఒప్పందం తర్వాత ఇరాన్పై అంతర్జాతీయ ఆంక్షలు ఎత్తివేశారు. ఆ సమయంలో ఇరాన్ కరెన్సీ విలువ అమెరికా డాలరుకు 32,000 రియాల్స్గా ఉంది. తాజాగా అక్కడ హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు ఎక్కువ కావడంతో పాశ్చాత్య దేశాల ఆంక్షలు మొదలయ్యాయి. ఇలా గత ఆరు నెలల కాలంలో ఇరాన్ కరెన్సీ విలువ 60శాతం పతనమైంది. గత ఆగస్టులో 3లక్షల రియాల్స్గా ఉండగా.. ఈ ఏడాది ఫిబ్రవరి మూడో వారానికి 5లక్షల రియాల్స్కు చేరువైంది. తాజాగా మరింత దిగజారి 6లక్షల రియాల్స్తో అత్యంత కనిష్ఠానికి చేరుకుంది.
మరోవైపు ఇరాన్లో 2021 జనవరిలో 41.4గా ఉన్న ద్రవ్యోల్బణం రేటు ప్రస్తుతం 53.4శాతానికి చేరినట్లు అక్కడి అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఇరాన్ ప్రభుత్వం తమ కరెన్సీని భారీగా ఖర్చుచేయాల్సి వస్తోంది. అయితే, మనీలాండరింగ్తో ఇరాన్, సిరియా దేశాలకు అక్రమంగా నగదు తరలివెళ్లడం వల్లే ఇరాన్కు డాలర్ల బదిలీపై అమెరికా ఆంక్షలు విధిస్తోందని అక్కడి బ్యాంకు అధికారులు భావిస్తున్నారు. పరిస్థితులు మరికొంతకాలం ఇలాగే కొనసాగితే అక్కడి పౌరులు గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదనే భయాలు మొదలయ్యాయి. ఇలా భారీ స్థాయిలో కరెన్సీ విలువ పడిపోతోన్న నేపథ్యంలో అక్కడి పార్లమెంటు అత్యవసరంగా సమావేశమై చర్చించినట్లు సమాచారం.
ఇదిలాఉంటే, ఇరాన్ అధికారిక కరెన్సీ రియాల్. కానీ, అక్కడి ప్రజలు స్థానిక అవసరాల కోసం తోమాన్ను వినియోగిస్తారు. ఒక తోమాన్కు పది రియాళ్లు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం