Srilanka Crisis: గో.. గొటబాయ.. గో..గో.. 1000 కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మె
వ్యాపారాలు మూతపడ్డాయ్.. టీచర్లు స్కూళ్లకు హాజరు కాలేదు.. ప్రజా రవాణా కుంటుపడింది.. కొలంబో రోడ్లు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో మార్మోగాయి.. శ్రీలంకలో కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మెతో......
కొలంబో: వ్యాపారాలు మూతపడ్డాయ్.. టీచర్లు స్కూళ్లకు హాజరు కాలేదు.. ప్రజా రవాణా కుంటుపడింది.. కొలంబో రోడ్లు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో మార్మోగాయి.. శ్రీలంకలో కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మెతో గురువారం నెలకొన్న పరిస్థితి ఇది..! తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకీ మరింతగా క్షీణిస్తున్నాయి. దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడంలో శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఘోరంగా విఫలమయ్యారంటూ అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. ఆయన రాజీనామా చేయాలంటూ రోడ్డెక్కి నినాదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం దాదాపు 1000కి పైగా కార్మిక సంఘాలు గురువారం ఒక్కరోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెలో వైద్య రంగంతో పాటు పోర్టులు, విద్యుత్, విద్య, పోస్టల్ తదితర రంగాలకు చెందిన కార్మికులు భారీగా పాల్గొని రాజపక్స సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సంక్షోభానికి బాధ్యులైన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, ప్రధాని మహింద రాజక్సతో పాటు శ్రీలంక ప్రభుత్వం తక్షణమే అధికారం నుంచి దిగిపోవాలంటూ నినదించారు.
వారం రోజులే గడువు.. లేకపోతే!
విదేశీ మారకద్రవ్య లోటు కారణంగా శ్రీలంకలో ఆహార పదార్థాలు, ఇంధనం దిగుమతి చేసుకోలేని దుస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. అన్ని వస్తువుల ధరలు భారీగా పెరగడంతో కొనుక్కోలేక గత కొన్నాళ్లుగా ప్రజల ఆకలి మంటలతో, ఆర్తనాదాలతో శ్రీలంక రగులుతోంది. ద్రవ్యోల్బణం పెరగడం, ఆహార పదార్థాలను కొనుక్కోనే పరిస్థితి లేకపోవడంతో జనం రోడ్డెక్కి ప్రభుత్వ అసమర్థతకు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు. ‘ప్రజలకు తలవంచి.. ప్రభుత్వం ఇంటికి వెళ్లిపోవాలి’ అంటూ సమ్మెకు దిగి నినదిస్తున్నారు. దేశ ప్రజలు రోడ్లెక్కి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నా వినకుండా రాజపక్స ప్రభుత్వం అధికారం పట్టుకొని వేలాడుతోందని ఉపాధ్యాయ సంఘాల అధికార ప్రతినిధి జోసెఫ్ స్టాలిన్ మండిపడ్డారు. తాము గురువారం సమ్మె తర్వాత ప్రభుత్వానికి ఒక వారం రోజులు గడువు ఇస్తామనీ.. ఒకవేళ అప్పటికే రాజీనామా చేయకపోతే ఆ తర్వాత గొటబాయ సర్కార్ దిగేవరకు సమ్మె కొనసాగిస్తామని ఆరోగ్యరంగ కార్మిక సంఘం ప్రతినిధి రవి కుముదేశ్ హెచ్చరించారు. ఈరోజు జరిగిన సమ్మెలో దాదాపు 1000కి పైగా కార్మిక సంఘాలు పాల్గొన్నాయని చెప్పారు.
బోసిపోయిన వీధులు.. మార్కెట్లు!
మరోవైపు, శ్రీలంకలోని అన్ని బ్యాంకులూ మూతబడిపోయాయయనీ.. ప్రభుత్వ యాజమాన్యంలోని కొన్ని బస్సులు మాత్రమే నడవడంతో ప్రజారవాణా వ్యవస్థ కుంటుపడిందని బ్యాంకు ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. ఈ సమ్మెలో ప్లాంటేషన్ కార్మికులు వేలాదిగా పాల్గొన్నట్టు ప్రతిపక్ష నేత మనో గణేషణ్ తెలిపారు. ఈ సమ్మెకు మద్దతుగా భోజన విరామ సమయంలో నిరసన తెలుపుతున్నట్టు వైద్యులు, నర్సులు తెలిపారు. గురువారం కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మెతో శ్రీలంకలోని అనేక ప్రాంతాల్లో వీధులు, వాణిజ్య మార్కెట్లు బోసిపోయాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం