Trump: అమెరికాలో మళ్లీ తెల్లపొడి కలకలం.. ట్రంప్ కుమారుడికి పంపిన దుండగులు
Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడికి బెదిరింపు లేఖ వచ్చింది. అందులో తెల్లపొడి ఉండటంతో భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు.
మయామి: అగ్రరాజ్యం అమెరికా (USA)లో మరోసారి తెల్లపొడి (White Powder) కలకలం సృష్టించింది. అధ్యక్ష అభ్యర్థిత్వానికి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి పోటీ పడుతున్న వేళ.. పెద్ద కుమారుడు ట్రంప్ జూనియర్ (Donald Trump Jr)కు వైట్ పౌడర్తో ఉన్న ఓ లేఖ వచ్చింది. దీంతో ఎమర్జెన్సీ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.
ఫ్లోరిడాలోని ట్రంప్ జూనియర్ హోం ఆఫీసుకు సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు లేఖ పంపారు. దాన్ని తెరవగా తెల్లపొడి అంటుకుంది. దీంతో అత్యవసర సిబ్బందికి సమాచారమివ్వగా వారు ఆ పొడిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ పొడి ఏంటన్నది తెలియరానప్పటికీ.. అంత ప్రమాదకరం కాకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. సీక్రెట్ సర్వీస్ విభాగంతో కలిసి పామ్ బీచ్ షెరీఫ్ పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిస్తే ఉపాధ్యక్షుడెవరు?
కాగా.. ట్రంప్ జూనియర్కు ఇలా దుండగులు తెల్లపొడి పంపించడం ఇదే తొలిసారి కాదు. 2018లో ఓ సారి వైట్పౌడర్తో ఉన్న లేఖ రాగా.. దాన్ని ఆయన భార్య తెరవడంతో అనారోగ్యానికి గురయ్యారు. కొన్ని రోజులు ఆసుపత్రితో చికిత్స తీసుకున్నారు. అంతకుముందు 2016లో ట్రంప్ మరో కుమారుడు ఎరిక్కు కూడా ఇలాంటి లేఖనే పంపారు. ట్రంప్ టవర్కు రెండుసార్లు తెల్లపొడి కవర్స్ వచ్చాయి.
అమెరికాలో 2001లో తొలిసారి ఈ వైట్పౌడర్ తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. పలు మీడియా సంస్థలు, ఇద్దరు సెనెటర్ల కార్యాలయాలకు ప్రమాదకర ఆంత్రాక్స్తో కూడిన లెటర్లను దుండగులు పంపించారు. వాటి కారణంగా అప్పట్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విదేశీ వలసదారులంటే భారత్కు భయం
విదేశీ వలసదారులను తమ దేశంలోకి అనుమతించేందుకు భారత్ భయపడుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. చైనా, రష్యా, జపాన్లదీ అదే పరిస్థితి అని పేర్కొన్నారు. -
రణరంగంగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా
న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల ప్రదర్శనకారులను ఖాళీ చేయించిన పోలీసులు గురువారం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ఏంజెలిస్ (యూసీఎల్ఏ)లోకి ప్రవేశించారు. -
లావుగా ఉన్నాడని బలవంతంగా ట్రెడ్మిల్ వ్యాయామం.. అమెరికాలో ఆరేళ్ల బాలుడి మృతి
కుమారుడు లావుగా ఉన్నాడని భావించిన ఓ వ్యక్తి ట్రెడ్మిల్పై బలవంతంగా పరిగెత్తించి అతడి మరణానికి కారణమయ్యాడు. -
యూఏఈలో మళ్లీ భారీవర్షాలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ను మళ్లీ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో ఇప్పటికే పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. -
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు
భారత్కు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ అమెరికాలోని కాలిఫోర్నియాలో హత్యకు గురయ్యాడన్న ప్రచారాన్ని అక్కడి పోలీసులు ఖండించారు. -
ఒడెస్సాపై మళ్లీ క్షిపణి దాడి.. 14 మందికి గాయాలు
దక్షిణ ఉక్రెయిన్లోని ఒడెస్సా ఓడ రేవు పట్టణంపై మళ్లీ రష్యా క్షిపణులు ప్రయోగించింది. వారంలో ఈ నగరంపై ఇది మూడో దాడి. -
కిమ్ ఆనందానికి ఏటా 25 మంది కన్యలు
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. -
22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి లేజర్ సందేశం
అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా నిర్వహించిన ఒక ప్రయోగంలో భాగంగా.. సుదూర విశ్వం నుంచి ఒక లేజర్ సంకేతం భూమికి చేరింది. అది సుమారు 22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చింది. -
చైనా రోడ్డు ప్రమాదంలో 48కి చేరిన మృతులు
దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో రహదారి కోతకు గురై 24 వాహనాలు లోయలో పడిన ఘటనలో మరణించిన వారి సంఖ్య గురువారం 48కి చేరుకుంది. -
విశ్వం అంచుల్లో గురుత్వాకర్షణ శక్తి బలహీనం ఇందుకే..
విస్తరిస్తున్న విశ్వం అంచుల్లోని ‘కాస్మిక్ గ్లిచ్’ గుట్టు విప్పే సరికొత్త నమూనాను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ ఘనత సాధించారు. -
శక్స్గావ్ లోయలో చైనా నిర్మాణాలు.. తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన భారత్
పాక్ ఆక్రమిత కశ్మీర్లో(పీఓకే)ని శక్స్గావ్ లోయలో చైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. -
బోయింగ్ విమానాల ప్రజావేగు మృతి.. 2 నెలల వ్యవధిలో రెండో ఘటన
ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్కు చెందిన 737 మ్యాక్స్ విమానాల్లో లోపాలు ఉన్నాయని బయటపెట్టిన విజిల్ బ్లోయర్ (ప్రజావేగు) జాషువా డీన్(45) మరణించారు. -
కాంగోలో కొత్తరకం ఎంపాక్స్
దేశ చరిత్రలోనే అత్యంత భారీ ఎంపాక్స్ విజృంభణను కట్టడి చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్న కాంగో నెత్తిన మరో పిడుగు పడింది. -
యుద్ధాన్ని పూర్తిగా ఆపితేనే సంతకం
గాజా కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా, ఇతర మధ్యవర్తుల తాజా ప్రతిపాదనను హమాస్ తీవ్రంగా పరిశీలిస్తోంది. -
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ను సంతోష పెట్టడానికి ఏటా 25 మంది యువతులతో కూడిన బృందం పని చేస్తుందని తాజా కథనం వెల్లడించింది.