Mahatma Gandhi: మహాత్ముడు మళ్లీ వచ్చే.. ఐరాసలో జాతిపిత ప్రసంగం
ఐక్యరాజ్యసమితిలో నిర్వహించిన ఓ చర్చావేదికలో భారత జాతిపిత మహాత్మా గాంధీ హోలోగ్రామ్ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో విద్యపై ఆయన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
యునైటెడ్ నేషన్స్: భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితిలో అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో గాంధీజీ ప్రత్యేక అతిథిగా కన్పించారు. కన్పించడమే కాదు.. విద్యపై ఆయన తన అభిప్రాయాన్ని చెప్పారు. అదేంటీ.. ఐరాసకు జాతిపిత రావడం ఎలా సాధ్యమని అనుకుంటున్నారా? అదంతా టెక్నాలజీ మాయ మరి..!
యునెస్కో మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ పీస్ అండ్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ (ఎంజీఐఈపీ) 10వ వార్షికోత్సవాలను శుక్రవారం ఐరాసలో ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్టోబరు 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అహింసా లెక్చర్ సిరీస్ సందర్భంగా ఐరాసకు భారత ప్రతినిధి బృందం.. గాంధీజీ హోలోగ్రామ్ను ప్రదర్శించింది.
ఆ హోలోగ్రామ్ను చూడగానే అచ్చం జాతిపితే సమావేశాలకు వచ్చారా అన్న భావన కలిగింది. ఈ హోలోగ్రామ్కు ఉన్న వాయిస్ ఓవర్.. విద్యపై మహాత్ముడి అంచనాలను పంచుకుంది. దీంతో గాంధీజీ స్వయంగా మాట్లాడుతున్నట్లు కన్పించింది. ‘‘అక్షరాస్యత అనేది విద్యకు ముగింపు లేదా ప్రారంభం కాదు. విద్యావిధానం ద్వారానే ఓ పిల్లాడు/వ్యక్తిలోని ఉత్తమమైన లక్షణాలు బయటకు తీసుకురావొచ్చు. ఆధ్యాత్మిక శిక్షణ కూడా విద్యా విధానానికి కేంద్ర బిందువుగా ఉంటుంది’’ అంటూ గాంధీ మాట్లాడారు.
ఈ ప్యానెల్ చర్చలో ఐరాసకు భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్, ది కింగ్ సెంటర్ సీఈవో అట్లాంటా బెర్నిస్ కింగ్, డిజిటల్ విద్యపై యువ ప్రతినిధి, ఇండోనేషియా రాకుమారి హయు పాల్గొన్నారు. అంతకుముందు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రసంగించారు. శాంతియుత, సహనంతో కూడిన సమాజానికి గాంధీజీ జీవితం ఓ మార్గం చూపిస్తుందని ఆయన కొనియాడారు. ఈ మార్గాన్ని మనమంతా కలిసి అనుసరించాలని, వసుధైక కుటుంబంలా ముందుకు సాగాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు.
ఈ హోలోగ్రమ్ను హైదరాబాద్లోని మహాత్మాగాంధీ డిజిటల్ మ్యూజియం రూపొందించింది. ఇది గాంధీజీ హోలోగ్రామ్లో రెండో ఎడిషన్ అని ఈ మ్యూజియం డైరెక్టర్ బిరాడ్ యాజ్నిక్ తెలిపారు. డిజిటల్ గ్రాఫిక్ ఫైల్స్ను సంగ్రహించి వాటిని మోషన్ గ్రాఫిక్స్తో కలిపామని, దీంతో హోలోగ్రామ్ స్క్రిప్ట్ను చదివేలా చేశామన్నారు. భవిష్యత్తులో హోలోగ్రామ్లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను జోడించి.. అప్పుడు నేరుగా వ్యక్తులతో మాట్లాడేలా రూపొందించేందుకు పరిశోధనలు జరుగుతున్నాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య
చైనా యుద్ధ విమానాలు మరోసారి ఆస్ట్రేలియాను బెదిరించే ప్రయత్నం చేశాయి. దీంతో ఇరుదేశాల మధ్య దౌత్య వివాదం ముదిరింది. -
రష్యా అధినేతగా ఐదోసారి.. ఘనంగా పుతిన్ ప్రమాణస్వీకారం
క్రెమ్లిన్లో నిర్వహించిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో రష్యా అధ్యక్షుడిగా పుతిన్ మరోసారి బాధ్యతలు స్వీకరించారు. -
చైనా ఆసుపత్రిలో దారుణం.. కత్తి దాడిలో పలువురి మృతి
చైనాలోని ఓ ఆసుపత్రిలో దుండగుడు కత్తులతో జరిపిన దాడిలో పలువురు చనిపోయారు. 20 మందికిపైగా తీవ్ర గాయాలపాలయ్యారు. -
ఇజ్రాయెల్ ఆధీనంలో రఫా క్రాసింగ్
Rafah crossing: రఫాపై దాడి కొనసాగిస్తున్న ఇజ్రాయెల్.. ఇక్కడి సరిహద్దు క్రాసింగ్ను తన ఆధీనంలోకి తీసుకుంది. -
‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు
India-Maldives: భారత్, మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. దీంతో ఆ దేశాన్ని సందర్శించే భారత పర్యటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. -
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసులో అమెరికా వేగానికి చెక్ రిపబ్లిక్ కోర్టు బ్రేకులు వేసింది. -
నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసి యాత్ర
Sunita Williams: సునీతా విలియమ్స్ చేపట్టాల్సిన మూడో రోదసి యాత్ర వాయిదా పడింది. రాకెట్లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల మిషన్ను నిలిపివేస్తున్నట్లు నాసా ప్రకటించింది. -
నేడు రోదసిలోకి సునీతా విలియమ్స్
భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడోసారి రోదసి యాత్రకు సిద్ధమయ్యారు. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్లైనర్ వ్యోమనౌకలో అంతరిక్షయానం చేయనున్నారు. -
అణ్వాయుధ విన్యాసాలకు సిద్ధమైన రష్యా
ఉక్రెయిన్ సమీపంలో అణ్వాయుధాల విన్యాసాలు మొదలుపెట్టాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సైన్యాన్ని ఆదేశించారు. -
కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం
ఇజ్రాయెల్ ఒత్తిడి పనిచేసింది. శాశ్వత కాల్పుల విరమణకు తప్ప మరో ప్రతిపాదనకు అంగీకరించబోమంటూ ఆదివారం చర్చల నుంచి వైదొలగిన హమాస్.. రఫాపై దాడి ఖాయమని టెల్ అవీవ్ హెచ్చరించిన కొన్ని గంటలకే దిగొచ్చింది. -
ట్రంప్నకు వెయ్యి డాలర్ల జరిమానా
హష్ మనీ కేసులో అనవసర వ్యాఖ్యలు చేయకుండా జారీ చేసిన గ్యాగ్ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకుగాను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కోర్టు మరోసారి కొరడా ఝుళిపించింది. -
రష్యా నుంచి రాయబారిని వెనక్కు పిలిచిన జర్మనీ
రష్యాలోని తమ రాయబారి అలెగ్జాండర్ లాంబ్సడార్ఫ్ను వారం రోజలు పాటు వెనక్కు పిలిపించినట్లు జర్మనీ సోమవారం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు
-
ఒక్క రోజులో రూ.800 కోట్ల నష్టం.. ఝున్ఝున్వాలా కుటుంబానికి టైటాన్ షాక్..!
-
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఇద్దరి మృతి
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య