అణ్వాయుధ విన్యాసాలకు సిద్ధమైన రష్యా
ఉక్రెయిన్ సమీపంలో అణ్వాయుధాల విన్యాసాలు మొదలుపెట్టాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సైన్యాన్ని ఆదేశించారు.
మాస్కో: ఉక్రెయిన్ సమీపంలో అణ్వాయుధాల విన్యాసాలు మొదలుపెట్టాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సైన్యాన్ని ఆదేశించారు. ఈ క్రమంలో ‘విన్యాసాల్లో భాగంగా.. సన్నద్ధత కోసం పలు చర్యలు తీసుకుంటాం. వ్యూహాత్మక అణ్వాయుధాలను వినియోగిస్తాం’ అని రష్యా రక్షణశాఖ వెల్లడించింది. మరికొన్ని రోజుల్లోనే వీటి కసరత్తు మొదలవుతుందని తెలిపింది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధంలో తాము మరింత జోక్యం చేసుకునే అవకాశం ఉందంటూ పాశ్చాత్య దేశాల సీనియర్ అధికారులు చేస్తున్న రెచ్చగొట్టే ప్రకటనలు, బెదిరింపుల నేపథ్యంలో తమ ప్రాంతీయ సమగ్రతను కాపాడేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. వ్యూహాత్మక అణ్వాయుధాల విన్యాసాలు సాధారణమే అయినప్పటికీ యుద్ధం వేళ వీటి కసరత్తుపై రష్యా బహిరంగ ప్రకటన చేయడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్ మిత్ర దేశాలు చేస్తున్న రెచ్చగొట్టే ప్రకటనలకు దీటుగా పుతిన్ నుంచి ఈ హెచ్చరిక వచ్చినట్లు తెలుస్తోంది.
బ్రిటన్ సైనిక స్థావరాలపై దాడులు చేస్తాం
బ్రిటన్ అందించే ఆయుధాలతో రష్యా భూభాగాలపై ఉక్రెయిన్ దాడులకు దిగితే.. ఆ పరిస్థితి ఉక్రెయిన్లోని లేదా మరెక్కడైనా బ్రిటన్ సైనిక స్థావరాలు, ఆయుధాగారాలపై తాము దాడులకు దిగేలా ప్రేరేపిస్తుందని క్రెమ్లిన్ హెచ్చరించింది. ఈ మేరకు బ్రిటిష్ రాయబారితో రష్యా విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆకాశంలో రాకాసి ఉల్క.. రాత్రిని పగలుగా మార్చేంత వెలుగు..!
స్పెయిన్, పోర్చుగల్ గగనతలంలో ఓ భారీ ఉల్క కనువిందు చేసింది. ఇది నేలరాలే సమయంలో వచ్చిన వెలుగుకు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. -
ట్రంప్నకు జాతీయ రైఫిల్ అసోసియేషన్ మద్దతు..!
అమెరికా అధ్యక్ష ఎన్నికలో బరిలో ఉన్న ట్రంప్నకు జాతీయ రైఫిల్ అసోసియేషన్ మద్దతు ప్రకటించింది. -
రణరంగంగా తైవాన్ పార్లమెంటు
ఓ బిల్లుపై చర్చ సందర్భంగా తైవాన్ పార్లమెంటులో అధికార, విపక్ష ఎంపీలు పరస్పర దాడులకు దిగారు. ఒకరినొకరు ఎత్తిపడేసి.. చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. -
సింగపూర్లో మళ్లీ కొవిడ్ అలజడి
కొవిడ్-19 మహమ్మారి సింగపూర్లో మరోసారి కలకలం రేకెత్తిస్తోంది. ఈ నెల 5 నుంచి 11 మధ్య 25,900కుపైగా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఆంగ్ యె కుంగ్ తెలిపారు. -
సంక్షిప్త వార్తలు (4)
పాకిస్థాన్లో ఘోర ప్రమాదం సంభవించింది. రోడ్డుపై వెళుతున్న మినీ ట్రక్కు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఓ ఉమ్మడి కుటుంబానికి చెందిన ఐదుగురు చిన్నారులు సహా 14 మంది మృతి చెందారు. -
కిర్గిజ్స్థాన్లో విదేశీ విద్యార్థులపై మూకదాడులు
కిర్గిజ్స్థాన్లోని భారత విద్యార్థులను కేంద్రం అప్రమత్తం చేసింది. రాజధాని బిష్కెక్లో విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని మూక హింస చెలరేగడంతో.. ఎవరూ బయటకు రావొద్దని సూచించింది.
తాజా వార్తలు (Latest News)
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఒకప్పుడు న్యాయం కోసం వీధుల్లోకి వచ్చాం.. ఇప్పుడు?.. ఆప్ నిరసనపై మాలీవాల్
-
కర్నూలులో చెరువు వద్ద ముగ్గురు ట్రాన్స్జెండర్ల అనుమానాస్పద మృతి