ట్రంప్‌నకు వెయ్యి డాలర్ల జరిమానా

హష్‌ మనీ కేసులో అనవసర వ్యాఖ్యలు చేయకుండా జారీ చేసిన గ్యాగ్‌ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకుగాను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై కోర్టు మరోసారి కొరడా ఝుళిపించింది.

Published : 07 May 2024 04:06 IST

న్యూయార్క్‌: హష్‌ మనీ కేసులో అనవసర వ్యాఖ్యలు చేయకుండా జారీ చేసిన గ్యాగ్‌ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకుగాను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై కోర్టు మరోసారి కొరడా ఝుళిపించింది. ఆయనకు సోమవారం వెయ్యి డాలర్ల జరిమానా విధించింది. ఈ కేసులో గ్యాగ్‌ ఉత్తర్వులను 9 సార్లు ఉల్లంఘించారంటూ ట్రంప్‌నకు కోర్టు గతవారం 9 వేల డాలర్ల జరిమానా విధించిన సంగతి గమనార్హం. మరోసారి ఇదే తరహా ఉల్లంఘనకు పాల్పడితే జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయని జడ్జి జువాన్‌ ఎం మెర్చన్‌ తాజాగా ఆయన్ను హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని