EVMs: ఈవీఎంలకు బై బై చెప్పిన పాకిస్థాన్..!
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్నికల సంస్కరణలకు చరమగీతం పాడుతోన్న నూతన ప్రభుత్వం.. ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను వినియోగించకూడదని నిర్ణయించింది.
ఇస్లామాబాద్: ఎన్నికల సంస్కరణల్లో భాగంగా పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పులకు ప్రస్తుత ప్రభుత్వం చరమగీతం పాడుతోంది. ఇందులో భాగంగా ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను వినియోగించకూడదని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా విదేశాల్లో ఉండేవారు ఐ-ఓటింగ్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునే వీలును కూడా రద్దుచేసింది.
నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల సంస్కరణలపై రూపొందించిన బిల్లును పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ముర్తాజా జావేద్ అబ్బాసీ దిగువ సభలో ప్రవేశపెట్టారు. దీనికి గ్రాండ్ డెమొక్రాటిక్ అలయన్స్(GDA) మినహా మిగతా వారి మద్దతు లభించడంతో ఈ బిల్లుకు దిగువసభ ఆమోదం తెలిపింది. అనంతరం సమీక్షకోసం ఏ కమిటీకి పంపించే అవసరం లేకుండా నేరుగా బిల్లు ఆమోదం కోసం సెనేట్కు పంపించబడుతుందని అబ్బాసీ స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా.. అంతకుముందు ఇమ్రాన్ఖాన్ నేతృత్వంలోని పీటీఐ ప్రభుత్వం 2017లో ఎన్నికల సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఓవర్సీస్ ఓటింగ్తో పాటు ఈవీఎంల వినియోగించాలని నిర్ణయించింది. అయితే, ఇటీవల పాకిస్థాన్ రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కోవడం.. అక్కడ ప్రభుత్వం మారడం వంటివి చకచకా జరిగిపోయాయి. దీంతో త్వరలోనే ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో తాము ఐ-ఓటింగ్, ఈవీఎం సహాయంతో వీటిని నిర్వహించలేమంటూ పాకిస్థాన్ ఎలక్షన్ కమిషన్ నిస్సహాయత వ్యక్తం చేసింది. సాంకేతికతకు వ్యతిరేకం కానప్పటికీ కొన్ని సవాళ్ల దృష్ట్యా వాటికి దూరంగా ఉండడమే మంచిదని అభిప్రాయపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చైనా ఆసుపత్రిలో దారుణం.. కత్తి దాడిలో పలువురి మృతి
చైనాలోని ఓ ఆసుపత్రిలో దుండగుడు కత్తులతో జరిపిన దాడిలో పలువురు చనిపోయారు. 20 మందికిపైగా తీవ్ర గాయాలపాలయ్యారు. -
ఇజ్రాయెల్ ఆధీనంలో రఫా క్రాసింగ్
Rafah crossing: రఫాపై దాడి కొనసాగిస్తున్న ఇజ్రాయెల్.. ఇక్కడి సరిహద్దు క్రాసింగ్ను తన ఆధీనంలోకి తీసుకుంది. -
‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు
India-Maldives: భారత్, మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. దీంతో ఆ దేశాన్ని సందర్శించే భారత పర్యటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. -
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసులో అమెరికా వేగానికి చెక్ రిపబ్లిక్ కోర్టు బ్రేకులు వేసింది. -
నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసి యాత్ర
Sunita Williams: సునీతా విలియమ్స్ చేపట్టాల్సిన మూడో రోదసి యాత్ర వాయిదా పడింది. రాకెట్లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల మిషన్ను నిలిపివేస్తున్నట్లు నాసా ప్రకటించింది. -
నేడు రోదసిలోకి సునీతా విలియమ్స్
భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడోసారి రోదసి యాత్రకు సిద్ధమయ్యారు. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్లైనర్ వ్యోమనౌకలో అంతరిక్షయానం చేయనున్నారు. -
అణ్వాయుధ విన్యాసాలకు సిద్ధమైన రష్యా
ఉక్రెయిన్ సమీపంలో అణ్వాయుధాల విన్యాసాలు మొదలుపెట్టాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సైన్యాన్ని ఆదేశించారు. -
కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం
ఇజ్రాయెల్ ఒత్తిడి పనిచేసింది. శాశ్వత కాల్పుల విరమణకు తప్ప మరో ప్రతిపాదనకు అంగీకరించబోమంటూ ఆదివారం చర్చల నుంచి వైదొలగిన హమాస్.. రఫాపై దాడి ఖాయమని టెల్ అవీవ్ హెచ్చరించిన కొన్ని గంటలకే దిగొచ్చింది. -
ట్రంప్నకు వెయ్యి డాలర్ల జరిమానా
హష్ మనీ కేసులో అనవసర వ్యాఖ్యలు చేయకుండా జారీ చేసిన గ్యాగ్ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకుగాను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కోర్టు మరోసారి కొరడా ఝుళిపించింది. -
రష్యా నుంచి రాయబారిని వెనక్కు పిలిచిన జర్మనీ
రష్యాలోని తమ రాయబారి అలెగ్జాండర్ లాంబ్సడార్ఫ్ను వారం రోజలు పాటు వెనక్కు పిలిపించినట్లు జర్మనీ సోమవారం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్కు సుప్రీం సూచన
-
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
-
చైనా ఆసుపత్రిలో దారుణం.. కత్తి దాడిలో పలువురి మృతి
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్