Putin: త్వరలోనే యుద్ధాన్ని మెరుగ్గా ముగిస్తాం..: పుతిన్ ప్రకటన
ఉక్రెయిన్పై యుద్ధం ముగింపు విషయంలో పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మెరుగైన ఫలితాలతోనే ఈ సంక్షోభాన్ని ముగిస్తామని చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్పై యుద్ధాన్ని వేగంగా ముగించాలనుకుంటున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. మాస్కోలో విలేకర్లతో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ సంక్షోభాన్ని ముగించడమే మా లక్ష్యం. మేము ఇందుకోసం కష్టపడుతున్నాం. యుద్ధం ముగింపు దశకు వచ్చిందని నిర్ధారించుకోవడానికి యత్నిస్తున్నాం. దీనిని త్వరలోనే మెరుగ్గా ముగిస్తాం. ప్రతి సంక్షోభం ఏదో రకంగానో, చర్చలతోనే ముగుస్తుంది. ఈ విషయాన్ని కీవ్లోని మా శత్రువులు అర్థం చేసుకోవాలి. అదే వారికి మంచిదవుతుంది’’ అని పరోక్షంగా ఉక్రెయిన్ను హెచ్చరించారు.
ఉక్రెయిన్కు పేట్రియాట్ వ్యవస్థలను అమెరికా సమకూర్చడం, జెలెన్స్కీ పర్యటనపై పుతిన్ స్పందిస్తూ..‘‘మాతో తలపడుతున్న వారికి చెబుతున్నాను. అదో రక్షణాత్మక ఆయుధం. దానికి విరుగుడు ఉంటుంది. ఇది సంక్షోభాన్ని మొత్తానికి మరింత సాగదీస్తుంది’’ అని పుతిన్ పేర్కొన్నారు.
రష్యా ఆర్మీచీప్ వాలేరి గెరిస్మోవ్ మాట్లాడుతూ దొనెట్స్క్కు పూర్తిగా స్వేచ్ఛ కల్పించడంపై దృష్టిపెట్టామన్నారు. ఈ ప్రాంతంలో విద్యుత్తు, రవాణా వంటి మౌలిక సదుపాయాలు ఇక్కడ దెబ్బతింటున్నాయని అన్నారు.
విదేశీ పర్యటనలో భాగంగా తొలిసారి అమెరికా వెళ్లిన జెలెన్స్కీకి అక్కడ అపూర్వ స్వాగతం లభించింది. ఆయన అమెరికాకు వెళ్లడానికి కొన్ని గంటల ముందే దాదాపు 1.8 బిలియన్ డాలర్ల విలువైన సైనిక ఉత్పత్తులను ఉక్రెయిన్కు అందించేందుకు అగ్రరాజ్యం ముందుకొచ్చింది. అంతేకాకుండా క్షిపణి దాడులను సైతం తట్టుకునేందుకు వీలుగా పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థలు అందిస్తామని స్పష్టం చేసింది. ఉక్రెయిన్కు అన్ని విధాలా అండగా ఉంటామని అమెరికా భరోసా ఇచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విదేశీ వలసదారులంటే భారత్కు భయం
విదేశీ వలసదారులను తమ దేశంలోకి అనుమతించేందుకు భారత్ భయపడుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. చైనా, రష్యా, జపాన్లదీ అదే పరిస్థితి అని పేర్కొన్నారు. -
రణరంగంగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా
న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల ప్రదర్శనకారులను ఖాళీ చేయించిన పోలీసులు గురువారం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ఏంజెలిస్ (యూసీఎల్ఏ)లోకి ప్రవేశించారు. -
లావుగా ఉన్నాడని బలవంతంగా ట్రెడ్మిల్ వ్యాయామం.. అమెరికాలో ఆరేళ్ల బాలుడి మృతి
కుమారుడు లావుగా ఉన్నాడని భావించిన ఓ వ్యక్తి ట్రెడ్మిల్పై బలవంతంగా పరిగెత్తించి అతడి మరణానికి కారణమయ్యాడు. -
యూఏఈలో మళ్లీ భారీవర్షాలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ను మళ్లీ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో ఇప్పటికే పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. -
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు
భారత్కు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ అమెరికాలోని కాలిఫోర్నియాలో హత్యకు గురయ్యాడన్న ప్రచారాన్ని అక్కడి పోలీసులు ఖండించారు. -
ఒడెస్సాపై మళ్లీ క్షిపణి దాడి.. 14 మందికి గాయాలు
దక్షిణ ఉక్రెయిన్లోని ఒడెస్సా ఓడ రేవు పట్టణంపై మళ్లీ రష్యా క్షిపణులు ప్రయోగించింది. వారంలో ఈ నగరంపై ఇది మూడో దాడి. -
కిమ్ ఆనందానికి ఏటా 25 మంది కన్యలు
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. -
22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి లేజర్ సందేశం
అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా నిర్వహించిన ఒక ప్రయోగంలో భాగంగా.. సుదూర విశ్వం నుంచి ఒక లేజర్ సంకేతం భూమికి చేరింది. అది సుమారు 22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చింది. -
చైనా రోడ్డు ప్రమాదంలో 48కి చేరిన మృతులు
దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో రహదారి కోతకు గురై 24 వాహనాలు లోయలో పడిన ఘటనలో మరణించిన వారి సంఖ్య గురువారం 48కి చేరుకుంది. -
విశ్వం అంచుల్లో గురుత్వాకర్షణ శక్తి బలహీనం ఇందుకే..
విస్తరిస్తున్న విశ్వం అంచుల్లోని ‘కాస్మిక్ గ్లిచ్’ గుట్టు విప్పే సరికొత్త నమూనాను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ ఘనత సాధించారు. -
శక్స్గావ్ లోయలో చైనా నిర్మాణాలు.. తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన భారత్
పాక్ ఆక్రమిత కశ్మీర్లో(పీఓకే)ని శక్స్గావ్ లోయలో చైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. -
బోయింగ్ విమానాల ప్రజావేగు మృతి.. 2 నెలల వ్యవధిలో రెండో ఘటన
ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్కు చెందిన 737 మ్యాక్స్ విమానాల్లో లోపాలు ఉన్నాయని బయటపెట్టిన విజిల్ బ్లోయర్ (ప్రజావేగు) జాషువా డీన్(45) మరణించారు. -
కాంగోలో కొత్తరకం ఎంపాక్స్
దేశ చరిత్రలోనే అత్యంత భారీ ఎంపాక్స్ విజృంభణను కట్టడి చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్న కాంగో నెత్తిన మరో పిడుగు పడింది. -
యుద్ధాన్ని పూర్తిగా ఆపితేనే సంతకం
గాజా కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా, ఇతర మధ్యవర్తుల తాజా ప్రతిపాదనను హమాస్ తీవ్రంగా పరిశీలిస్తోంది. -
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ను సంతోష పెట్టడానికి ఏటా 25 మంది యువతులతో కూడిన బృందం పని చేస్తుందని తాజా కథనం వెల్లడించింది.