Rishi Sunak: రిషి సునాక్ ఇంటిపై నల్లటి వస్త్రం.. పర్యావరణ ఆందోళనకారుల నిరసన
బ్రిటన్ ప్రధాని నిర్ణయాలపై పర్యావరణ వేత్తలు గుర్రుగా ఉన్నారు. ఉత్తర ఇంగ్లాండ్లోని ఆయన ఇంటి వద్ద నిరసన వ్యక్తం చేశారు.
(source: Greenpeace UK)
ఇంటర్నెట్డెస్క్: బ్రిటన్ ప్రధాన మంత్రి రిషిసునాక్ ప్రైవేటు గృహం వద్ద పర్యావరణకారులు ఆందోళన చేపట్టారు. ఆయన ఇంటిపై ఓ నల్లటి వస్త్రాన్ని కప్పి నిరసన వ్యక్తం చేశారు. చమురు బావుల తవ్వకాలపై ఆయన ప్రభుత్వ విధానాలను తప్పుపట్టారు. ఈ మేరకు గ్రీన్పీస్ యూకే సంఘం ఆందోళన చిత్రాలను ట్విటర్లో (ఎక్స్)లో పోస్టు చేసింది. ఈ చిత్రంలో ఉత్తర ఇంగ్లాండ్లోని యార్క్షైర్లోని రిషి సునాక్ ఇంటిపైకి కొందరు ఎక్కి నల్లటి వస్త్రాన్ని కప్పేసినట్లుంది. మరో ఇద్దరు ఆందోళనకారులు ‘‘రిషి సునాక్- చమురు లాభాలా.. మా భవిష్యత్తా..?’’ అన్ని నినాదాలు రాసిన బ్యానర్ను పట్టుకొన్నారు. ‘‘మా ప్రధాని పర్యావరణ పరిరక్షణలో ముందుండాల్సిన అవసరం ఉంది.. పర్యావరణ విధ్వంసంలో కాదు’’ అని గ్రీన్పీస్ యూకే పేర్కొంది.
ఈ ఘటనపై ప్రధాని రిషి సునాక్ కార్యాలయం స్పందించింది. పోలీసులు అక్కడే ఉన్నారని తెలిపింది. ‘‘దేశ ఇంధన భద్రత, వనరుల సద్వినియోగం కోసం తీసుకొన్న సరైన నిర్ణయంపై ఎటువంటి పశ్చాత్తాపం లేదు. మనం పుతిన్ వంటి ఆక్రమణదారులపై ఇంధనం కోసం ఆధారపడలేము’’ అని పేర్కొంది. బుధవారం తాను సెలవులో ఉన్నట్లు సునాక్ వెల్లడించారు.
USA: అమెరికా క్యాపిటల్ సెనేట్ భవనాల్లో కలకలం.. అగంతకుడి కోసం పోలీసులు తీవ్ర గాలింపు
2019లో థెరిస్సామే ప్రధానిగా ఉన్న సమయంలో బ్రిటన్ 2050 నాటికి కర్బన ఉద్గారాలను పూర్తిగా నిర్మూలించే విధానాన్ని చేపట్టింది. అదే సమయంలో వేగంగా పునరుత్పాదక ఇంధన వనరులను పెంచుకొంటామని పేర్కొంది. కానీ, ఈ విధానానికి భిన్నంగా సునాక్ ప్రభుత్వం పనిచేస్తోందని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. రికార్డు స్థాయిలో ఉత్తర సముద్రంలో చమురు, గ్యాస్ వెలికితీతకు ఇబ్బడి ముబ్బడిగా అనుమతులిచ్చారని చెబుతున్నారు. దాదాపు కొన్ని దశాబ్దాల తర్వాత తొలిసారి డిసెంబర్లో ఓ భారీ బొగ్గుగనికి సునాక్ ప్రభుత్వం అనుమతించిందనే విమర్శలున్నాయి.
మరో వైపు సునాక్ మాత్రం ప్రభుత్వ వైఖరిని సమర్థించుకొన్నారు. తమ ప్రభుత్వం ఇతర దేశాలతో పోలిస్తే పర్యావరణ పరిరక్షణకు మెరుగ్గా పనిచేసిందని చెప్పుకొన్నారు. బుధవారం వెలువడిన ఓ సర్వేలో సునాక్ ప్రభుత్వం పర్యావరణ అంశాల్లో అధ్వానంగా ఉందని 67శాతం మంది పేర్కొన్నారు. 2019 తర్వాత ప్రభుత్వానికి వచ్చిన అత్యంత చెత్తరేటింగ్ ఇదే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత
పాకిస్థాన్లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత్ అభివృద్ధి చెందుతున్న తీరును కొనియాడారు. -
గురుపత్వంత్పై హత్యాయత్నం వెనుక ‘రా’!
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూపై అమెరికాలో జరిగిన హత్యాయత్నంలో భారత్ గూఢచర్య సంస్థ ‘రా’ అధికారి ప్రమేయం ఉందని పేర్కొంటూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సోమవారం ఒక కథనం ప్రచురించింది. -
కెన్యాలో భారీ వర్షాలు.. డ్యాం కూలి 45 మంది దుర్మరణం
ఆఫ్రికా దేశమైన కెన్యాలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం నీటి ఉద్ధృతి ఎక్కువ కావడంతో పశ్చిమ కెన్యాలోని మై మహియు ప్రాంతంలోని పురాతన కిజాబె డ్యాం కూలిపోయింది. -
పారిస్కూ పాకిన విద్యార్థుల ఆందోళనలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న ఆందోళనలు ఫ్రాన్స్ రాజధాని పారిస్నూ కుదిపేస్తున్నాయి. సోమవారం సర్బాన్ యూనివర్సిటీలో విద్యార్ధులు పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు నిర్వహించారు. -
ఇజ్రాయెల్కు ఐసీసీ వారెంట్ల గుబులు!
కాల్పుల విరమణ చర్చలు కీలక దశకు చేరుకుంటున్న వేళ.. ఇజ్రాయెల్కు అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) గుబులు పట్టుకుంది. 2014 నాటి గాజా యుద్ధం కేసులో తమ సైనిక అధికారులు, నేతలపై ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయొచ్చన్న వార్తలపై ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. -
40 రోజుల కాల్పుల విరమణ!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా, ఈజిప్టు, ఖతార్ దేశాలు తెర వెనక జరుపుతున్న ప్రయత్నాలు కీలక దశకు చేరాయి. ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదనను ఈ దేశాలు హమాస్కు పంపాయి!.
తాజా వార్తలు (Latest News)
-
యువ రోహిత్ను చూశారా.. బర్త్డే గిఫ్ట్గా టీనేజ్ ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ
-
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అభ్యంతరకర వీడియోల ఘటన.. ఎంపీ ప్రజ్వల్పై సస్పెన్షన్ వేటు
-
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
-
విజయవాడలో విషాదం.. ప్రముఖ వైద్యుడు సహా ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి