UK: సోషల్ మీడియాలో.. టీనేజ్ పిల్లలకు బ్రిటన్ ‘నిషేధం’ విధించనుందా?
సోషల్ మీడియాను.. 16ఏళ్ల లోపు వారు వినియోగించకుండా ‘నిషేధం’ విధించడాన్ని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak) ఒక ఆప్షన్గా పరిగణిస్తున్నట్లు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: చిన్నారులు, యుక్తవయసు పిల్లలపై సామాజిక మాధ్యమాల (Social Media) ప్రతికూల ప్రభావం చూపుతున్నాయనే వార్తలు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై మరిన్ని నియంత్రణలు తెచ్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా 16ఏళ్ల లోపు వారు వీటిని వినియోగించకుండా ‘నిషేధం’ విధించడాన్ని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak) ఒక ఆప్షన్గా పరిగణిస్తున్నట్లు సమాచారం. దీనిపై యూకే ప్రభుత్వం (Britain) మరింత అధ్యయనం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
ఫేస్బుక్లో ఎన్క్రిప్టెడ్ మెసేజ్ను తీసుకువస్తున్నట్లు మెటా ఇటీవల పేర్కొనడంపై బ్రిటన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని మెటాకు సూచించింది. ఇలా ఆన్లైన్ భద్రతపై ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో పిల్లలను ఫేస్బుక్లో అనుమతించడంపైనా నేషనల్ క్రైం ఏజెన్సీ తల్లిదండ్రులను హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలోనే సామాజిక మాధ్యమాల వినియోగం వల్ల యువతకు నెలకొన్న ముప్పునకు సంబంధించిన ఆధారాలపై వచ్చే జనవరి నుంచి సంప్రదింపులు మొదలు పెట్టేందుకు బ్రిటన్ ప్రభుత్వం సిద్ధమయ్యింది. ఇందులో భాగంగా 16ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధం, తల్లిదండ్రుల నియంత్రణను మరింత పెంచడం వంటి అంశాలను చర్చించనున్నట్లు కథనాలు వెలువడ్డాయి.
ప్రిన్స్ హ్యారీ ఫోన్ హ్యాకింగ్ నిజమే..‘మిర్రర్’కు జరిమానా
ఈ పరిణామాలపై ప్రభుత్వ అధికార ప్రతినిధి కెమిల్లా మార్షల్ స్పందిస్తూ.. పూర్తి నిషేధం విధించడం ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. చిన్నారుల ఆన్లైన్ భద్రతపైనే తాము దృష్టి కేంద్రీకరించామని అన్నారు. నిషేధం కంటే తల్లిదండ్రులను మరింత అవగాహన కల్పించడమే ముఖ్యమన్నారు. అయితే, ఇప్పటివరకు ఉన్న పరిశోధనలు పూర్తిస్థాయిలో లేవని.. దానికోసం ఏ మేరకు మరింత అధ్యయనం అవసరమో చర్చించాల్సిన అవసరముందన్నారు. దీనిపై మంత్రులు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
ఇదిలాఉంటే, చిన్నారుల ఆన్లైన్ భద్రతకు సంబంధించి ‘ఆన్లైన్ సేఫ్టీ యాక్ట్’ను (Online Safety Ac) బ్రిటన్ ఇటీవల తీసుకువచ్చింది. అయినప్పటికీ ఇటీవల సామాజిక మాధ్యమ వేదికల్లో వస్తోన్న మార్పుల దృష్ట్యా పిల్లలు ఆన్లైన్లో హానికర కంటెంటు బారిన పడకుండా ఉండేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని బ్రిటన్ ప్రభుత్వం భావిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు..!
కరోనా వైరస్ (సార్స్కోవ్-2) జన్యు సీక్వెన్స్ను తొలిసారి ప్రచురించిన వైరాలజిస్ట్కు చైనా అధికారుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. -
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత
పాకిస్థాన్లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత్ అభివృద్ధి చెందుతున్న తీరును కొనియాడారు. -
గురుపత్వంత్పై హత్యాయత్నం వెనుక ‘రా’!
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూపై అమెరికాలో జరిగిన హత్యాయత్నంలో భారత్ గూఢచర్య సంస్థ ‘రా’ అధికారి ప్రమేయం ఉందని పేర్కొంటూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సోమవారం ఒక కథనం ప్రచురించింది. -
కెన్యాలో భారీ వర్షాలు.. డ్యాం కూలి 45 మంది దుర్మరణం
ఆఫ్రికా దేశమైన కెన్యాలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం నీటి ఉద్ధృతి ఎక్కువ కావడంతో పశ్చిమ కెన్యాలోని మై మహియు ప్రాంతంలోని పురాతన కిజాబె డ్యాం కూలిపోయింది. -
పారిస్కూ పాకిన విద్యార్థుల ఆందోళనలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న ఆందోళనలు ఫ్రాన్స్ రాజధాని పారిస్నూ కుదిపేస్తున్నాయి. సోమవారం సర్బాన్ యూనివర్సిటీలో విద్యార్ధులు పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు నిర్వహించారు. -
ఇజ్రాయెల్కు ఐసీసీ వారెంట్ల గుబులు!
కాల్పుల విరమణ చర్చలు కీలక దశకు చేరుకుంటున్న వేళ.. ఇజ్రాయెల్కు అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) గుబులు పట్టుకుంది. 2014 నాటి గాజా యుద్ధం కేసులో తమ సైనిక అధికారులు, నేతలపై ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయొచ్చన్న వార్తలపై ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. -
40 రోజుల కాల్పుల విరమణ!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా, ఈజిప్టు, ఖతార్ దేశాలు తెర వెనక జరుపుతున్న ప్రయత్నాలు కీలక దశకు చేరాయి. ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదనను ఈ దేశాలు హమాస్కు పంపాయి!.
తాజా వార్తలు (Latest News)
-
ధరలు పెరిగినా.. బంగారం గిరాకీ తగ్గలే!
-
కేజ్రీవాల్ను కలిసిన పంజాబ్ సీఎం.. ఆయన ఏం చెప్పారంటే?
-
విప్రో కొత్త సీఈఓ వేతనం ఎంతో తెలుసా?
-
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు..!
-
‘ఇప్పటికి నిద్ర లేచారు..’: పతంజలి ఉత్పత్తుల లైసెన్సు రద్దుపై సుప్రీం
-
యువ రోహిత్ను చూశారా.. బర్త్డే గిఫ్ట్గా టీనేజ్ ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ