Visakhapatnam: పెందుర్తిలో అర్ధరాత్రి రౌడీ మూకల దౌర్జన్యం!

విశాఖ జిల్లా పెందుర్తిలో రౌడీ మూకలు రెచ్చిపోయాయి. సుమారు 100 మంది రౌడీల సాయంతో మంగళవారం అర్ధరాత్రి స్థలం కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. పెందుర్తి మండల పరిధిలోని సర్వే నంబర్ 164/1 వేపగుంట షిప్ యార్డ్ లేఅవుట్‌లో మంగళవారం అర్ధరాత్రి దాటాక ఒంటిగంట ప్రాంతంలో కొంతమంది కిరాయి రౌడీ మూకలు  రేకుల షెడ్డును దౌర్జన్యంగా తొలగించారు. ఆ సమయంలో రేకుల షెడ్డులో మహిళా వాచ్‌మెన్‌ నిద్రిస్తోంది. తలుపు పగలగొట్టి దౌర్జన్యంగా మహిళా వాచ్‌మెన్‌ను బయటికి తీసుకువెళ్లారు. భయంతో ఆమె స్థల యజమానికి ఫోన్ చేయాలని ప్రయత్నించగా.. రౌడీ మూకలు ఫోన్ లాక్కున్నారు. యజమానికి ఫోన్ చేస్తే చంపేస్తామంటూ ఆమెను బెదిరించారు. దీంతో సమీపంలో ఉన్న మరో వ్యక్తి ద్వారా ఆమె డయల్‌ 100కి ఫోన్‌ చేశారు.

Published : 31 May 2023 15:48 IST

Visakhapatnam: పెందుర్తిలో అర్ధరాత్రి రౌడీ మూకల దౌర్జన్యం!

విశాఖ జిల్లా పెందుర్తిలో రౌడీ మూకలు రెచ్చిపోయాయి. సుమారు 100 మంది రౌడీల సాయంతో మంగళవారం అర్ధరాత్రి స్థలం కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. పెందుర్తి మండల పరిధిలోని సర్వే నంబర్ 164/1 వేపగుంట షిప్ యార్డ్ లేఅవుట్‌లో మంగళవారం అర్ధరాత్రి దాటాక ఒంటిగంట ప్రాంతంలో కొంతమంది కిరాయి రౌడీ మూకలు  రేకుల షెడ్డును దౌర్జన్యంగా తొలగించారు. ఆ సమయంలో రేకుల షెడ్డులో మహిళా వాచ్‌మెన్‌ నిద్రిస్తోంది. తలుపు పగలగొట్టి దౌర్జన్యంగా మహిళా వాచ్‌మెన్‌ను బయటికి తీసుకువెళ్లారు. భయంతో ఆమె స్థల యజమానికి ఫోన్ చేయాలని ప్రయత్నించగా.. రౌడీ మూకలు ఫోన్ లాక్కున్నారు. యజమానికి ఫోన్ చేస్తే చంపేస్తామంటూ ఆమెను బెదిరించారు. దీంతో సమీపంలో ఉన్న మరో వ్యక్తి ద్వారా ఆమె డయల్‌ 100కి ఫోన్‌ చేశారు.

Tags :

మరిన్ని