TS News: మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన

జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల మధ్య మానేరు నదిపై రూ.46 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వంతెన కుప్పకూలింది.      

Updated : 23 Apr 2024 13:38 IST

జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల మధ్య మానేరు నదిపై నిర్మిస్తున్న వంతెన కుప్పకూలింది. టేకుమట్ల మండలం గర్మళ్లపల్లి, ముత్తారం మండలం ఓడేడు గ్రామాల మధ్యలో 9 ఏళ్లుగా ఈ వంతెనను నిర్మిస్తున్నారు. దాదాపు రూ.46 కోట్ల వ్యయంతో 2016లో మంజూరైన నిర్మాణ పనులు అప్పటి నుంచి నత్తనడకన సాగుతున్నాయి. పిల్లర్లు, గట్టర్లకు మధ్య బ్యాలెన్సింగ్ కోసం పెట్టిన చెక్క ముక్కలకు చెదలు పట్టడంతో గట్టర్లు ఒకవైపు వంగాయని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం రాత్రి ఈదురుగాలులకు గట్టర్లు కూలినట్లు వారు భావిస్తున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక మార్గంలో స్థానికులు రాకపోకలు సాగిస్తున్నారు. 

Tags :

మరిన్ని