బ్రేకింగ్

breaking
02 May 2024 | 09:29 IST

‘నవ సందేహాల’ పేరుతో జగన్‌కు షర్మిల మరో లేఖ

అమరావతి: ‘నవ సందేహాల’ పేరుతో సీఎం జగన్‌కు ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మరో లేఖ రాశారు. ‘‘2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.. ఏమైంది? ఏటా జనవరి 1న జాబ్‌ క్యాలెండర్‌ అన్నారు.. ఎందుకు ఇవ్వలేదు? 25 ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారు.. ఏం చేశారు? గ్రూప్‌-2 కింద ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదెందుకు? 23 వేలతో మెగా డీఎస్సీ అని 6 వేలతో దగా డీఎస్సీ ఎందుకు వేశారు? యువత ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు వలసలు ఎందుకు పోతున్నారు?’’ అని షర్మిల లేఖలో ప్రశ్నించారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని