News In Pics: చిత్రం చెప్పే సంగతులు-2(03-04-2023)

Updated : 03 Apr 2023 22:28 IST
1/32
భీమవరంలోని ప్రకాశం చౌక్ వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్తు కాంతులు ఆకట్టుకుంటున్నాయి. ప్రకాశం చౌక్‌ నుంచి యనమదుర్రు వంతెన మీదుగా అంబేడ్కర్‌ కూడలి వరకు ఈ విద్యుత్తు కాంతులు మిరిమిట్లు గొలుపుతున్నాయి.. భీమవరంలోని ప్రకాశం చౌక్ వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్తు కాంతులు ఆకట్టుకుంటున్నాయి. ప్రకాశం చౌక్‌ నుంచి యనమదుర్రు వంతెన మీదుగా అంబేడ్కర్‌ కూడలి వరకు ఈ విద్యుత్తు కాంతులు మిరిమిట్లు గొలుపుతున్నాయి..
2/32
ప్రముఖ దర్శకుడు శంకర్‌ కుమార్తె, నటి అదితి శంకర్‌ తన తాజా ఫొటోలను ఇన్‌స్టాలో పంచుకున్నారు. కొత్త ట్రెండింగ్‌ దుస్తులతో ఆమె ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ఫొటోలకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్‌ కుమార్తె, నటి అదితి శంకర్‌ తన తాజా ఫొటోలను ఇన్‌స్టాలో పంచుకున్నారు. కొత్త ట్రెండింగ్‌ దుస్తులతో ఆమె ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ఫొటోలకు అభిమానులు ఫిదా అవుతున్నారు.
3/32
4/32
నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర రాప్తాడు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా రైతులు బహూకరించిన నాగలితో లోకేశ్‌ అభివాదం చేశారు. అంతకుముందు మహిళలు పసుపు రంగు గొడుగులతో పాదయాత్రలో పాల్గొన్నారు. నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర రాప్తాడు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా రైతులు బహూకరించిన నాగలితో లోకేశ్‌ అభివాదం చేశారు. అంతకుముందు మహిళలు పసుపు రంగు గొడుగులతో పాదయాత్రలో పాల్గొన్నారు.
5/32
శ్రీశైలం ఆలయానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. క్యూలైన్లలో వేచిచూసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఆవరణg భక్తులతో కిటకిటలాడింది. శ్రీశైలం ఆలయానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. క్యూలైన్లలో వేచిచూసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఆవరణg భక్తులతో కిటకిటలాడింది.
6/32
ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం ‘బేబీ’. ఈ సినిమా సెకండ్‌ సింగిల్ ‘దేవరాజా’ పాటను ఈరోజు సాయంత్రం విడుదల చేశారు. కార్యక్రమంలో సినీనటి వైష్ణవి చైతన్య ఇలా మెరిశారు. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం ‘బేబీ’. ఈ సినిమా సెకండ్‌ సింగిల్ ‘దేవరాజా’ పాటను ఈరోజు సాయంత్రం విడుదల చేశారు. కార్యక్రమంలో సినీనటి వైష్ణవి చైతన్య ఇలా మెరిశారు.
7/32
బంజారాహిల్స్‌లోని ఓ నగల దుకాణం ఆరో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నగరంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖ మహిళలు పాల్గొని సందడి చేశారు. బంజారాహిల్స్‌లోని ఓ నగల దుకాణం ఆరో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నగరంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖ మహిళలు పాల్గొని సందడి చేశారు.
8/32
‘సిటడెల్‌’ వెబ్‌సిరీస్‌ ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఓ న్యూస్‌ కాన్ఫరెన్స్‌లో సినీనటి ప్రియాంక చోప్రా, రిచర్డ్‌ మడెన్‌ పాల్గొని సందడి చేశారు. ప్రియాంక చోప్రా, రిచర్డ్‌ మడెన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘సిటడెల్‌’ ఏప్రిల్‌ 28న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.. ‘సిటడెల్‌’ వెబ్‌సిరీస్‌ ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఓ న్యూస్‌ కాన్ఫరెన్స్‌లో సినీనటి ప్రియాంక చోప్రా, రిచర్డ్‌ మడెన్‌ పాల్గొని సందడి చేశారు. ప్రియాంక చోప్రా, రిచర్డ్‌ మడెన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘సిటడెల్‌’ ఏప్రిల్‌ 28న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది..
9/32
మీడియా ప్రతినిధులను విష్‌ చేస్తున్న ప్రియాంక చోప్రా మీడియా ప్రతినిధులను విష్‌ చేస్తున్న ప్రియాంక చోప్రా
10/32
కిరణ్‌ అబ్బవరం, అతుల్య రవి జంటగా రమేశ్‌ కాదూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మీటర్‌’. ఏప్రిల్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా టైటిల్‌ సాంగ్‌ను ఏప్రిల్‌ 4న జనగామ జిల్లా డీసీపీ పి. సీతారామ్‌ చేతుల మీదుగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. కిరణ్‌ అబ్బవరం, అతుల్య రవి జంటగా రమేశ్‌ కాదూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మీటర్‌’. ఏప్రిల్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా టైటిల్‌ సాంగ్‌ను ఏప్రిల్‌ 4న జనగామ జిల్లా డీసీపీ పి. సీతారామ్‌ చేతుల మీదుగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
11/32
వేసవికాలం ఎండలు మండిపోతున్నాయి. ఏటా చల్లని నీటి కుండలను రాజస్థాన్‌ నుంచి విశాఖపట్నానికి తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. దీంతో ఈ కుండలను నగరంలోని ఓ జంతు ప్రదర్శనశాల వద్ద ఇలా అందంగా ఏర్పాటు చేశారు. వేసవికాలం ఎండలు మండిపోతున్నాయి. ఏటా చల్లని నీటి కుండలను రాజస్థాన్‌ నుంచి విశాఖపట్నానికి తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. దీంతో ఈ కుండలను నగరంలోని ఓ జంతు ప్రదర్శనశాల వద్ద ఇలా అందంగా ఏర్పాటు చేశారు.
12/32
ఐపీఎల్‌ 2023 లీగ్‌ మ్యాచ్‌లలో భాగంగా ఈరోజు చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో సీఎస్‌కే తలపడనుంది. ఈ సందర్భంగా రాబిన్‌ ఉతప్పతో కలిసి స్టేడియంలో దిగిన ఫొటోను సురేశ్‌  రైనా తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ‘ఈ స్టేడియం నాకు ఎప్పటికీ మరువలేనిది’ అని పోస్టు చేశారు.. ఐపీఎల్‌ 2023 లీగ్‌ మ్యాచ్‌లలో భాగంగా ఈరోజు చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో సీఎస్‌కే తలపడనుంది. ఈ సందర్భంగా రాబిన్‌ ఉతప్పతో కలిసి స్టేడియంలో దిగిన ఫొటోను సురేశ్‌ రైనా తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ‘ఈ స్టేడియం నాకు ఎప్పటికీ మరువలేనిది’ అని పోస్టు చేశారు..
13/32
రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు ఆటగాడు యజువేంద్ర చాహల్‌ ఇలా తన కండలతో పోజులిస్తూ ఫొటో తీసుకున్నారు. ఈ ఫొటోను ‘ఆర్‌ఆర్‌’ జట్టు తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది. ఈ ఫొటో కింద క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఫన్నీగా కామెంట్స్‌ పెడుతున్నారు. రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు ఆటగాడు యజువేంద్ర చాహల్‌ ఇలా తన కండలతో పోజులిస్తూ ఫొటో తీసుకున్నారు. ఈ ఫొటోను ‘ఆర్‌ఆర్‌’ జట్టు తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది. ఈ ఫొటో కింద క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఫన్నీగా కామెంట్స్‌ పెడుతున్నారు.
14/32
నగరంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. సికింద్రాబాద్‌ వారాసిగూడ వద్ద ఓ పాఠశాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు ఇలా గొడుగు కింద ఉపశమనం పొందుతూ కనిపించారు. నగరంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. సికింద్రాబాద్‌ వారాసిగూడ వద్ద ఓ పాఠశాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు ఇలా గొడుగు కింద ఉపశమనం పొందుతూ కనిపించారు.
15/32
తిరుమల శ్రీవారి ఆలయంలో వసంతోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారికి స్నపన తిరుమంజనం, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి వేడుకను వీక్షించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వసంతోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారికి స్నపన తిరుమంజనం, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి వేడుకను వీక్షించారు.
16/32
అల్లరి నరేష్‌ హీరోగా విజయ్‌ కనకమేడల తెరకెక్కించిన చిత్రం ‘ఉగ్రం’(Ugram). ‘నాంది’ హిట్‌ తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న సినిమా ఇది.  మిర్నా మేనన్‌ కథానాయిక. ఈ సినిమాను మే 5న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఇటీవల విడుదలైన మూవీ టీజర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. అల్లరి నరేష్‌ హీరోగా విజయ్‌ కనకమేడల తెరకెక్కించిన చిత్రం ‘ఉగ్రం’(Ugram). ‘నాంది’ హిట్‌ తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న సినిమా ఇది. మిర్నా మేనన్‌ కథానాయిక. ఈ సినిమాను మే 5న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఇటీవల విడుదలైన మూవీ టీజర్ విశేషంగా ఆకట్టుకుంటోంది.
17/32
‘దసరా’ చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతూ దర్శక ధీరడు రాజమౌళి ట్వీట్ చేశారు. శ్రీకాంత్‌ ఓదెల హృదయానికి హత్తుకునే లవ్‌స్టోరీ చూపించారు. నాని కెరీర్‌లోనే అత్యుత్తమ నటనను కనబరిచారు. వెన్నెల పాత్రలో కీర్తి సురేశ్ ఒదిగిపోయింది.’ అంటూ రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌పై దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల స్పందిస్తూ ‘ఏం మాట్లాడాలో నాకు అర్థం కావటం లేదు.. సర్‌ థాంక్యూ వెరీ మచ్‌’ అని రిప్లై ఇచ్చారు. ‘దసరా’ చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతూ దర్శక ధీరడు రాజమౌళి ట్వీట్ చేశారు. శ్రీకాంత్‌ ఓదెల హృదయానికి హత్తుకునే లవ్‌స్టోరీ చూపించారు. నాని కెరీర్‌లోనే అత్యుత్తమ నటనను కనబరిచారు. వెన్నెల పాత్రలో కీర్తి సురేశ్ ఒదిగిపోయింది.’ అంటూ రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌పై దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల స్పందిస్తూ ‘ఏం మాట్లాడాలో నాకు అర్థం కావటం లేదు.. సర్‌ థాంక్యూ వెరీ మచ్‌’ అని రిప్లై ఇచ్చారు.
18/32
నటి నభా నటేశ్‌ తన తాజా ఫొటోను ఇన్‌స్టాలో పంచుకున్నారు. అందమైన లుక్‌తో కనిపిస్తున్న ఈ ఫొటోకు ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు. నటి నభా నటేశ్‌ తన తాజా ఫొటోను ఇన్‌స్టాలో పంచుకున్నారు. అందమైన లుక్‌తో కనిపిస్తున్న ఈ ఫొటోకు ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు.
19/32
పరువు నష్టం కేసులో సూరత్‌ కోర్టు రాహుల్‌గాంధీకి రెండేళ్ల శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు సూరత్‌ వచ్చిన రాహుల్‌గాంధీకి కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు స్వాగతం పలికారు. పరువు నష్టం కేసులో సూరత్‌ కోర్టు రాహుల్‌గాంధీకి రెండేళ్ల శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు సూరత్‌ వచ్చిన రాహుల్‌గాంధీకి కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు స్వాగతం పలికారు.
20/32
అమెరికాలోని మోంటానా రాష్ట్రం క్లార్క్‌ఫోర్క్‌ నది తీరాన ఓ రైలు పట్టాలు తప్పింది. సుమారు 25 రైలు బోగీలు అదుపు తప్పి పక్కకు పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. అమెరికాలోని మోంటానా రాష్ట్రం క్లార్క్‌ఫోర్క్‌ నది తీరాన ఓ రైలు పట్టాలు తప్పింది. సుమారు 25 రైలు బోగీలు అదుపు తప్పి పక్కకు పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.
21/32
ప్రభాస్‌, అనుష్కశెట్టి జంటగా మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బిల్లా’ సినిమా 2009 ఏప్రిల్‌ 3న విడుదలై ఘన విజయం సాధించింది. నేటికి సినిమా విడుదలై 14ఏళ్లు పూర్తి కావడంతో సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను చిత్రబృందం, ఫ్యాన్స్‌ ట్విటర్‌ వేదికగా పంచుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్‌, అనుష్కశెట్టి జంటగా మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బిల్లా’ సినిమా 2009 ఏప్రిల్‌ 3న విడుదలై ఘన విజయం సాధించింది. నేటికి సినిమా విడుదలై 14ఏళ్లు పూర్తి కావడంతో సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను చిత్రబృందం, ఫ్యాన్స్‌ ట్విటర్‌ వేదికగా పంచుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
22/32
జర్మనీలోని నిడ్డెరౌలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఆ ప్రాంతమంతా వరద ముంపునకు గురైంది. రైలు రోడ్డు క్రాసింగ్ వద్ద లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జర్మనీలోని నిడ్డెరౌలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఆ ప్రాంతమంతా వరద ముంపునకు గురైంది. రైలు రోడ్డు క్రాసింగ్ వద్ద లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
23/32
ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం ‘బేబీ’. ఈ సినిమా సెకండ్‌ సింగిల్ ‘దేవరాజా’ పాటను ఈరోజు సాయంత్రం 6.03 గంటలకు విడుదల చేయనున్నారు. 12 మంది సంగీత దర్శకులు కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం ‘బేబీ’. ఈ సినిమా సెకండ్‌ సింగిల్ ‘దేవరాజా’ పాటను ఈరోజు సాయంత్రం 6.03 గంటలకు విడుదల చేయనున్నారు. 12 మంది సంగీత దర్శకులు కార్యక్రమానికి హాజరు కానున్నారు.
24/32
సినీనటి జాన్వీకపూర్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.  అంతకుముందు ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం జాన్వీకి తీర్థప్రసాదాలు అందజేశారు. సినీనటి జాన్వీకపూర్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం జాన్వీకి తీర్థప్రసాదాలు అందజేశారు.
25/32
తిరుమల ఆలయ ఆవరణలో జాన్వీకపూర్‌ తిరుమల ఆలయ ఆవరణలో జాన్వీకపూర్‌
26/32
నాని, కీర్తి సురేశ్‌ జంటగా నటించిన ‘దసరా’ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులోని ‘సెలబ్రేషన్ ఆఫ్‌ వెన్నెల’ డ్యాన్స్‌ వీడియోను ఈ రోజు సాయంత్రం 6.03 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. నాని, కీర్తి సురేశ్‌ జంటగా నటించిన ‘దసరా’ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులోని ‘సెలబ్రేషన్ ఆఫ్‌ వెన్నెల’ డ్యాన్స్‌ వీడియోను ఈ రోజు సాయంత్రం 6.03 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.
27/32
రోహిత్ బెహల్, అపర్ణ జనార్ధన్‌జంటగా తెరకెక్కిన సినిమా ‘లవ్‌యూ రామ్‌’. ఈ సినిమాలోని ‘తూ మేరా’ పాటను ఖమ్మంలో విడుదల చేశారు. కార్యక్రమంలో సినిమా నటీనటులు సందడి చేశారు. రోహిత్ బెహల్, అపర్ణ జనార్ధన్‌జంటగా తెరకెక్కిన సినిమా ‘లవ్‌యూ రామ్‌’. ఈ సినిమాలోని ‘తూ మేరా’ పాటను ఖమ్మంలో విడుదల చేశారు. కార్యక్రమంలో సినిమా నటీనటులు సందడి చేశారు.
28/32
ప్రియదర్శి (Priyadarshi), కావ్యా కల్యాణ్‌రామ్‌ (Kavya Kalyanram) జంటగా.. హాస్యనటుడు వేణు (Venu Yeldandi) తెరకెక్కించిన చిత్రం ‘బలగం’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం అందరి ప్రశంసలు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో వేణు రచ్చ రవి వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రియదర్శి (Priyadarshi), కావ్యా కల్యాణ్‌రామ్‌ (Kavya Kalyanram) జంటగా.. హాస్యనటుడు వేణు (Venu Yeldandi) తెరకెక్కించిన చిత్రం ‘బలగం’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం అందరి ప్రశంసలు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో వేణు రచ్చ రవి వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
29/32
తన సతీమణి నయనతార పిల్లలతో దిగిన ఫొటోను విఘ్నేశ్‌ శివన్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. తమ పిల్లలకు ఉయిర్‌, ఉలగ్‌ అనే పేర్లు పెట్టినట్లు తెలుపుతూ ఆయన పోస్టు పెట్టారు. తన సతీమణి నయనతార పిల్లలతో దిగిన ఫొటోను విఘ్నేశ్‌ శివన్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. తమ పిల్లలకు ఉయిర్‌, ఉలగ్‌ అనే పేర్లు పెట్టినట్లు తెలుపుతూ ఆయన పోస్టు పెట్టారు.
30/32
డ్రీమ్‌ వారియర్ పిక్చర్స్‌ తెలుగులో నిర్మించనున్న రెండో సినిమా ‘రెయిన్‌ బో’. లేడీ ఓరియంటెడ్‌ మూవీగా తెరకెక్కనుంది. ఈ చిత్రంతో శాంతరూబన్‌ (Shantharuban) అనే దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. రొమాంటిక్‌ ఫ్యాంటసీ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాలో రష్మికతో పాటు దేవ్‌ మోహన్‌ (Dev Mohan) నటించనున్నాడు. సోమవారం హైదరాబాద్‌లో ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. డ్రీమ్‌ వారియర్ పిక్చర్స్‌ తెలుగులో నిర్మించనున్న రెండో సినిమా ‘రెయిన్‌ బో’. లేడీ ఓరియంటెడ్‌ మూవీగా తెరకెక్కనుంది. ఈ చిత్రంతో శాంతరూబన్‌ (Shantharuban) అనే దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. రొమాంటిక్‌ ఫ్యాంటసీ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాలో రష్మికతో పాటు దేవ్‌ మోహన్‌ (Dev Mohan) నటించనున్నాడు. సోమవారం హైదరాబాద్‌లో ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి.
31/32
నాని, కీర్తి సురేశ్‌ జంటగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘దసరా’ సినిమా మార్చి 30న విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ సినిమా 4రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.87కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం తెలిపింది. నాని, కీర్తి సురేశ్‌ జంటగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘దసరా’ సినిమా మార్చి 30న విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ సినిమా 4రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.87కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం తెలిపింది.
32/32
ఐకానిక్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ కుమారుడి పుట్టిన రోజు సందర్భంగా సోమవారం బన్నీ ట్విటర్‌ వేదికగా ఓ పోస్టు పెట్టారు. తన కుమారుడితో దిగిన ఫొటోను పోస్టు చేస్తూ..‘ హ్యాపీ బర్త్‌డే టు ది లవ్‌ ఆఫ్ మై లైఫ్. మై స్వీటెస్ట్‌ చిన్ని బాబు’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఐకానిక్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ కుమారుడి పుట్టిన రోజు సందర్భంగా సోమవారం బన్నీ ట్విటర్‌ వేదికగా ఓ పోస్టు పెట్టారు. తన కుమారుడితో దిగిన ఫొటోను పోస్టు చేస్తూ..‘ హ్యాపీ బర్త్‌డే టు ది లవ్‌ ఆఫ్ మై లైఫ్. మై స్వీటెస్ట్‌ చిన్ని బాబు’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని