ఆనందం కాదా?
ఒక ధనవంతుడు జెన్ గురువు దగ్గరికి వెళ్లాడు. ‘స్వామీ! మా కుటుంబ కీర్తిప్రతిష్ఠలు ఇనుమడించేలా, మమ్మల్ని ఆశీర్వదిస్తూ
జెన్ కథ
ఒక ధనవంతుడు జెన్ గురువు దగ్గరికి వెళ్లాడు. ‘స్వామీ! మా కుటుంబ కీర్తిప్రతిష్ఠలు ఇనుమడించేలా, మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఏదన్నా రాసివ్వండి. దాన్ని చూసి మా ఇంటిల్లిపాదీ, తర్వాతి తరాలు ఆనందించాలి’ అన్నాడు. వెంటనే ఆ జెన్ గురువు ఒక కాగితం తీసుకుని ‘తండ్రి చనిపోతాడు. కొడుకు చనిపోతాడు. మనవడు చనిపోతాడు’ అని రాశాడు. దాన్ని చూసి ఆ ధనవంతుడికి కోపం తన్నుకొచ్చింది. ‘ఏంటి స్వామీ! నేను చెప్పిందేంటి? మీరు రాసిందేంటి? మా కుటుంబం ఆనందించేలా ఏదన్నా రాయమంటే అమంగళంలా చావుల గురించి రాస్తారా? మీకిది సబబా?’ అని అడిగాడు. జెన్ గురువు ప్రశాంతంగా నవ్వుతూ ‘నేను రాసిన దాంట్లో తప్పేముంది? ఒకవేళ నీ కొడుకు నీకన్నా ముందే చనిపోయాడనుకో! మీ కుటుంబంలో ఎంత క్షోభ నిండుతుంది. నీ మనవడు నీ కొడుకుకన్నా ముందే మరణించాడనుకో! అదెంత ఆవేదన. ఒక తరం తర్వాత మరో తరం అలా సాగిపోతూండటమే జీవితం. అదే ఏ కుటుంబానికైనా, వంశానికైనా నిజమైన ఆనందం. కాదంటావా?’ ప్రశ్నించాడు గురువు. ఆ ధనవంతుడి నోట మాట లేదు
- శాలిని గుడిపాటి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం