నోటిఫికేషన్స్‌

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ, ఇండియన్‌ ఆర్మీకి చెందిన ఉత్తర, దక్షిణ ఏఎస్‌సీ సెంటర్లు గ్రూప్‌ సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నాయి.

Published : 28 Jun 2022 01:09 IST

ఉద్యోగాలు


ఆర్మీ-ఏఎస్‌సీ సెంటర్లలో 458 పోస్టులు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ, ఇండియన్‌ ఆర్మీకి చెందిన ఉత్తర, దక్షిణ ఏఎస్‌సీ సెంటర్లు గ్రూప్‌ సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నాయి.

మొత్తం పోస్టులు: 458  సెంటర్ల వారీగా ఖాళీలు: ఏఎస్‌సీ సెంటర్‌ (దక్షిణ)-209, ఏఎస్‌సీ సెంటర్‌ (ఉత్తర)-249. కుక్‌, సివిలియన్‌ కేటరింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌, స్టేషన్‌ ఆఫీసర్లు, ఫైర్‌మెన్లు, ఫైర్‌ ఇంజిన్‌ డ్రైవర్లు తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత ట్రేడుల్లో అనుభవంతో పాటు నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.

వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌/ ఫిజికల్‌ టెస్ట్‌/ ప్రాక్టికల్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేదీ: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోపు.

వెబ్‌సైట్‌: https://indianarmy.nic.in/


యూపీఎస్సీ- 13 పోస్టులు

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ)...వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 13. ఏరోనాటికల్‌ ఆఫీసర్లు-06, ప్రొఫెసర్‌-01, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు-05, ఇంజినీర్‌-01.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 14.

వెబ్‌సైట్‌: www.upsc.gov.in/


డిజిటల్‌ ఇండియాలో యంగ్‌ ప్రొఫెషనల్స్‌

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన డిజిటల్‌ ఇండియా కార్పొరేషన్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* యంగ్‌ ప్రొఫెషనల్స్‌

మొత్తం పోస్టులు: 17 అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ మాస్టర్స్‌ డిగ్రీ/ మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల పీజీ డిప్లొమా/ ఎల్‌ఎల్‌బీ/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత, అనుభవం.

వయసు: 32 ఏళ్లు మించకుండా ఉండాలి. జీతభత్యాలు: నెలకు రూ.60000 చెల్లిస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేదీ: వెబ్‌సైట్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 15 రోజుల్లోపు.

వెబ్‌సైట్‌: https://dic.gov.in/


ప్రవేశాలు
ఏయూలో పీజీ, పీజీ డిప్లొమా కోర్సులు

విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ, బొల్లినేని మెడ్‌స్కిల్స్‌ సంయుక్తంగా 2022-2023 విద్యా సంవత్సరానికి కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నాయి.

కోర్సులు: మాస్టర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, పీజీ డిప్లొమా (క్రిటికల్‌ కేర్‌ టెక్నాలజీ), పీజీ డిప్లొమా (ఎమర్జెన్సీ మెడిసిన్‌ టెక్నాలజీ), పీజీ డిప్లొమా (గ్యాస్ట్రోఎంటరాలజీ టెక్నాలజీ).

అర్హత: ఏదైనా డిగ్రీ, ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఎస్సీ, బీఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్‌/ బీఏఎంఎస్‌/ బీహెచ్‌ఎంఎస్‌ ఉత్తీర్ణత.

వయోపరిమితి: 20-35 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు: డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ కార్యాలయం, ఆంధ్ర యూనివర్సిటీ, విజయనగర్‌ ప్యాలెస్‌, పెదవాల్తేర్‌, విశాఖపట్నం చిరునామాకు పంపాలి.

చివరి తేదీ: 2022, జులై 31.

వెబ్‌సైట్‌: http://audoa.in/


అప్రెంటిస్‌లు
ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో...

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌) వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ట్రేడ్‌ అప్రెంటిస్‌లు

మొత్తం ఖాళీలు: 600  ట్రేడులు: కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్లు, మెషినిస్టులు, పెయింటర్లు, వెల్డర్లు, పాసా.

అర్హత: పదో తరగతి, ఇంటర్మీడియట్‌, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.

వయసు: 26.07.2022 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: పదో తరగతిలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 26.

వెబ్‌సైట్‌: https://icf.indianrailways.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని