Eluru: ఎస్సై అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు వాయిదా

ఏలూరులో గురువారం జరగాల్సిన ఎస్సై అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు వాయిదా పడ్డాయి.

Published : 06 Sep 2023 22:01 IST

ఏలూరు: ఏలూరు రేంజ్‌ పరిధిలో గురువారం జరగాల్సిన ఎస్సై అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు వాయిదా పడ్డాయి. దేహదారుఢ్య పరీక్షలను ఈ నెల 14కి వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు. వర్షం కారణంగా వాయిదా వేసినట్లు ఏలూరు రేంజ్‌ డీఐజీ తెలిపారు. 7న జరగాల్సిన పరీక్షలు మాత్రమే వాయిదా వేశామని.. 8వ తేదీన జరగాల్సిన దేహదారుఢ్య పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తామని చెప్పారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని