Sanju Samson: సంజూ క్యాచ్ ఔట్ వివాదం.. కొత్త వీడియో వైరల్!
మ్యాచ్ ముగిసి రెండు రోజులు అవుతున్నా.. సంజూ శాంసన్ క్యాచ్ ఔట్పై మాత్రం చర్చ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్ - దిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో సంజూ శాంసన్ (Sanju Samson) క్యాచ్పై తీసుకున్న థర్డ్ అంపైర్ నిర్ణయం వివాదాస్పదమైంది. ఆర్ఆర్ కెప్టెన్ సంజూ (86) కొట్టిన బంతిని దిల్లీ ఫీల్డర్ షై హోప్ (Shai Hope) అద్భుతంగా ఒడిసిపట్టాడు. కానీ, బౌండరీ రోప్ను అతడి పాదం తాకినట్లు రిప్లేలో కనిపించిందని సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ఆ క్యాచ్తోనే తమ అభిమాన జట్టు ఓడిపోయిందని ఫ్యాన్స్ విమర్శలు చేశారు. రాజస్థాన్ ఫ్రాంచైజీ డైరెక్టర్ కుమార సంగక్కర కూడా మరికొన్ని కోణాల్లో చూసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తంచేశాడు. దిల్లీ జట్టు కూడా క్లియర్ క్యాచ్ అంటూ అప్పుడే పోస్టు పెట్టింది. అయినా, వివాదం మాత్రం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఐపీఎల్ అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఓ వీడియోను షేర్ చేసింది.
షై హోప్ క్యాచ్ పట్టినప్పుడు బౌండరీ రోప్ కదిలినట్లు అనిపించలేదని ఆసీస్ మాజీ క్రికెటర్ టామ్ మూడీ వివరించాడు. ‘‘ఇక్కడ బౌండరీ లైన్కు చాలా దగ్గరగా ఫీల్డర్ వచ్చినట్లు అనిపించింది. కానీ, వివిధ యాంగిల్స్లో చూడటం వల్ల రోప్ను తాకాడేమోనని కొందరి వాదన. కానీ, క్లియర్గా వీడియోను గమనిస్తే అతడు రోప్ను తాకలేదనే విషయం తెలుస్తుంది. థర్డ్ అంపైర్ సరైన నిర్ణయమే తీసుకున్నాడనడంలో సందేహం లేదు’’ అని మూడీ వెల్లడించాడు. కానీ, ఈ వీడియోను చూసినప్పటికీ.. కొందరు నెటిజన్లు మాత్రం థర్డ్ అంపైర్దే పొరపాటు అంటూ కామెంట్లు చేస్తూనే ఉన్నారు.
‘‘అంపైర్లు చేసిన పొరపాటును కప్పిపుచ్చుకోవడాన్ని ఇకనైనా ఆపండి. ఇంతటి క్లిష్టమైన నిర్ణయాన్ని వెల్లడించడానికి కేవలం 7 సెకన్లు మాత్రమే సమయం తీసుకోవడం ఆశ్చర్యంగా ఉంది’’
‘‘రోప్ వద్దకు పాదం దగ్గరగా వెళ్లినట్లు అనిపించినప్పుడు మీరు మరోసారి జూమ్ చేయలేదు. తాడుకు ఉన్న కుషన్స్ను పాదం తాకినట్లు ఉంది’’
‘‘క్లియర్గా నాటౌట్. సంజూ శాంసన్ను మోసం చేశారు. ప్లే చేస్తే మొత్తం వీడియోను పోస్టు చేయండి’’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీని మించిన స్ఫూర్తి ఎవరు.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
Anand Mahindra: ఐపీఎల్ ప్లేఆఫ్స్కు అర్హత సాధించిన బెంగళూరు జట్టు, కోహ్లీపై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. కింగ్ కంటే స్ఫూర్తినిచ్చేవారు ఎవరుంటారని ప్రశంసించారు. -
ఐపీఎల్ ప్లేఆఫ్స్.. ఏ జట్టు ఎలా వచ్చిందంటే?
ఐపీఎల్ 17వ సీజన్లో లీగ్ స్టేజ్ను దాటి ప్లేఆఫ్స్ పోరు మొదలుకానుంది. అనూహ్య ఫలితాలతో నాకౌట్కు చేరి ఆశ్చర్చపరిచిన జట్లూ ఉన్నాయి. -
భారత జట్టుతోపాటు.. మీ నలుగురికి ఆల్ ది బెస్ట్: నీతా అంబానీ
ఐపీఎల్ ముగిసిన తర్వాత.. దాదాపు వారం రోజుల్లో భారత ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్లో ఆడనున్నారు. ఇప్పటికే జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. -
సంబరాల్లో బెంగళూరు.. ధోనీతో కరచాలనం చేసేందుకూ సమయం లేదా?: మాజీలు
ఉత్కంఠ పరిస్థితుల్లో ప్లేఆఫ్స్కు చేరుకున్న బెంగళూరు ఆటగాళ్లు సంబరాలు ఆకాశాన్నంటాయి. ఈ క్రమంలో చెన్నై ప్లేయర్లతో కరచాలనం చేసేందుకు కాస్త సమయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. -
ఇప్పటి వరకు ధోనీ మాకేం చెప్పలేదు: రిటైర్మెంట్పై చెన్నై ఫ్రాంచైజీ!
డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై ప్లేఆఫ్స్కు చేరలేదు. దీంతో ధోనీ ఆటను చూసే అవకాశం కోల్పోయామనే బాధ అభిమానుల్లో ఉంది. అయితే, అతడి భవితవ్యంపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. -
కోహ్లీ రికార్డు బద్దలు.. నాకు మంచి రోజులు నడుస్తున్నాయ్: అభిషేక్ శర్మ
హైదరాబాద్ ప్లేఆఫ్స్కు చేరుకోవడంలో ఓపెనర్గా అభిషేక్ శర్మదీ కీలక పాత్రే. మరో ఆటగాడు ట్రావిస్ హెడ్తో కలిసి అదిరే ఆరంభాలను ఇచ్చాడు. -
ఒక్కోసారి ‘వన్ పర్సెంట్’ ఛాన్స్ ఉన్నా చాలు..: విరాట్ కోహ్లీ
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరు జట్టు అద్భుతం చేసింది. ఊహించని విధంగా నాకౌట్కు చేరుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. -
వామ్మో.. అతడికి బౌలింగ్ చేయాలని ఎప్పుడూ కోరుకోను: పాట్ కమిన్స్
హైదరాబాద్ అద్భుతం చేసింది. ఐపీఎల్ 2024 సీజన్ ప్లేఆఫ్స్కు రెండో స్థానంతో దూసుకెళ్లింది. సొంతమైదానం ఉప్పల్ వేదికగా జరిగిన చివరి లీగ్లో పంజాబ్పై విజయం సాధించింది. -
దంచికొట్టి..దర్జాగా
అదే దూకుడు.. అదే దంచుడు. లక్ష్యం ఏమో 215. అయినా తమ ముందు అది చిన్నదే అంటూ.. సన్రైజర్స్ మరోసారి రెచ్చిపోయింది. -
సీఎస్కేను ఆపగలనని నమ్మా
చెన్నై సూపర్ కింగ్స్ని చివరి ఓవర్లో 17 పరుగులు చేయకుండా ఆపగలనని నమ్మానని.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ యశ్ దయాళ్ తెలిపాడు. -
ఒక్క బంతీ పడకుండానే..
ఐపీఎల్-17లో లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ వర్షార్పణం అయింది. -
ఛాంప్స్ సాత్విక్-చిరాగ్
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి అదరగొట్టారు. -
లీగ్ దశ ముగిసె..
పరుగుల వరద పారిన మ్యాచ్లు.. ఉత్కంఠభరితంగా ముగిసిన సమరాలు.. రికార్డుల మీద రికార్డులు! దాదాపు రెండు నెలలుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్-17లో లీగ్ దశ ముగిసింది. -
ప్రసారదారుపై మండిపడ్డ రోహిత్
క్రికెటర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోందటూ ఐపీఎల్ ప్రసారదారుపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ మండిపడ్డాడు. -
ధోని ఆఖరి మ్యాచ్ ఆడాడని అనుకోవట్లేదు
దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్ ధోని తన కెరీర్లో చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడినట్లు తాను భావించట్లేదని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. -
‘లక్ష్య’ దీప్తి రికార్డు
ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి జీవాంజి దీప్తి (తెలంగాణ) సత్తాచాటింది. -
అర్జున్ గేమ్ డ్రా
షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ ఆటగాడు అర్జున్ ఇరిగేశి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. -
మను ఆధిపత్యం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్లో స్టార్ షూటర్ మను బాకర్ ఆధిపత్యం ప్రదర్శించింది. -
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు
స్టార్ స్పోర్ట్స్పై రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై మండిపడ్డాడు.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీని మించిన స్ఫూర్తి ఎవరు.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
-
ఏపీలో 33 చోట్ల హింసాత్మక ఘటనలు.. డీజీపీకి సిట్ నివేదిక అందజేత!
-
తెలంగాణ మంత్రివర్గం భేటీ ప్రారంభం.. వీటిపైనే చర్చ!
-
మారణాయుధాలతో హ్యారీ విన్స్టన్లోకి చొరబడి.. రూ.కోట్ల విలువైన ఆభరణాలు చోరీ
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్.. ఏ జట్టు ఎలా వచ్చిందంటే?
-
ఎన్నికల్లో హింస.. బదిలీ అయినవారి స్థానంలో కొత్త నియామకాలు