Viral Video: మాల్ మూసేస్తున్నారని, హడలెత్తి పారిపోయిన ప్రజలు..!
చైనా అనుసరిస్తోన్న కొవిడ్ జీరో విధానంతో ఆ దేశ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒక్క కేసు వచ్చినా.. వ్యాప్తిని కట్టడి చేసేందుకు డ్రాగన్ దేశం పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తోంది.
షాంఘై: చైనా అనుసరిస్తోన్న కొవిడ్ జీరో విధానంతో ఆ దేశ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒక్క కేసు వచ్చినా.. వ్యాప్తిని కట్టడి చేసేందుకు డ్రాగన్ దేశం పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తోంది. ఎక్కడికక్కడ కఠిన లాక్డౌన్ ఆంక్షలు విధిస్తోంది. ఇదే మాదిరిగా షాంఘైలోని గ్జుయిలోని ఐకియా స్టోర్ను అధికారులు లాక్ చేయడానికి ప్రయత్నించగా.. హడలెత్తిపోయిన ప్రజలు అక్కడి నుంచి పారిపోయారు. ఇంతకీ విషయం ఏంటంటే..?
కరోనా సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన వ్యక్తిని శనివారం ఈ ఐకియా స్టోర్ ప్రాంతంలో అధికారులు గుర్తించారు. దాంతో ఈ స్టోర్కు వచ్చిన ప్రజలందరిని క్వారంటైన్ చేయాలని వారు ప్రయత్నించారు. తలుపులు లాక్ చేయాలని చూడగా ఆందోళన చెందిన ప్రజలు.. అధికారులు, భద్రతా సిబ్బందిని తోసుకుంటూ అక్కడి నుంచి వేగంగా బయటకు పరిగెత్తారు. అదే వేగంతో ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. ‘శనివారం ఐకియా వద్ద కరోనా సోకిన వ్యక్తి క్లోజ్కాంటాక్ట్ను గుర్తించారు. దాంతో అధికారులు మాల్ను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఈ కారణం చెప్పి, తమను క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తారని ఆందోళన చెందిన ప్రజలు అక్కడి నుంచి బయటకు పరిగెత్తారు. కానీ వారిపై డిజిటిల్ నిఘా ఉంటుందిగా..!’ అంటూ ఓ నెటిజన్ ఈ వీడియో షేర్ చేశారు. ఈ ఏడాది ఇప్పటికే షాంఘై వాసులు రెండు నెలల కఠిన లాక్డౌన్ను అనుభవించారు. ఆ సమయంలో ఆహారం అందక, ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. ఇంటి కిటికీల వద్ద నిలబడి అసహనం వెళ్లగక్కిన వీడియోలు వైరల్ అయ్యాయి. కాగా, తాజా ఘటనపై ఐకియా నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్