కుళాయి కనెక్షన్లు మాకొద్దు
ప్రైవేటు నీటిశుద్ధి ప్లాంట్లలో నీళ్లకు అలవాటుపడిన ప్రజలు పట్టణ స్థానిక సంస్థలు అందించే తాగునీటి కుళాయి కనెక్షన్లంటే విముఖత చూపుతున్నారు. అమృత్-2 పథకం అమలు కోసం పట్టణాల్లో వార్డు సచివాలయాల సిబ్బంది ఇటీవల నిర్వహించిన సర్వేలో 3,78,790 కుటుంబాలు కుళాయి కనెక్షన్లు తీసుకోడానికి విముఖత చూపినట్లు వెల్లడైంది.
శుద్ధి ప్లాంట్లలోని నీటి వినియోగమే ఎక్కువ
అమృత్-2 అమలు కోసం నిర్వహించిన సర్వేలో వెల్లడి
ఈనాడు, అమరావతి: ప్రైవేటు నీటిశుద్ధి ప్లాంట్లలో నీళ్లకు అలవాటుపడిన ప్రజలు పట్టణ స్థానిక సంస్థలు అందించే తాగునీటి కుళాయి కనెక్షన్లంటే విముఖత చూపుతున్నారు. అమృత్-2 పథకం అమలు కోసం పట్టణాల్లో వార్డు సచివాలయాల సిబ్బంది ఇటీవల నిర్వహించిన సర్వేలో 3,78,790 కుటుంబాలు కుళాయి కనెక్షన్లు తీసుకోడానికి విముఖత చూపినట్లు వెల్లడైంది. ఇప్పటికీ కుళాయి కనెక్షన్లు తీసుకోని వారిలో 75% ప్రైవేటు ప్లాంట్లలో నీళ్లు కొని తాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. మిగిలిన 25% అపార్ట్మెంట్లు, వ్యక్తిగత ఇళ్లలో బోరు నీటిని శుద్ధిచేసే వ్యవస్థలను సొంతంగా ఏర్పరుచుకున్నారు. విశాఖ రీజియన్లో 1,45,526, రాజమహేంద్రవరంలో 83,292, గుంటూరులో 60,324, అనంతపురం రీజియన్లో 89,648 కుటుంబాలు కొత్త కుళాయి కనెక్షన్లపై అనాసక్తత ప్రదర్శించాయని సర్వేలో వెల్లడైంది. రాష్ట్రంలోని 124 పుర, నగరపాలక సంస్థల్లో, నగర పంచాయతీల్లో 43,37,614 నివాసాలు ఉన్నాయి. వీటిలో ఇప్పటివరకు 18,67,306 నివాసాలకు కుళాయి కనెక్షన్లు ఉన్నాయి.
దేశవ్యాప్తంగా పట్టణాల్లో ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ అందించాలన్న లక్ష్యంతో కేంద్రం అమృత్ పథకాన్ని ప్రారంభించింది. ఏపీ ప్రభుత్వంతో కలిసి అమృత్-1 కింద రాష్ట్రంలో రూ.3,700 కోట్లతో 32 పట్టణాల్లో చేపట్టిన ప్రాజెక్టుల పనులు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. అమృత్-2 కింద మరో రూ.10వేల కోట్ల ప్రతిపాదనలు అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్త కుళాయి కనెక్షన్లపై ప్రజల్లో ఆసక్తిని తెలుసుకునేందుకు సర్వే నిర్వహించినప్పుడు అత్యధికులు విముఖత చూపారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ గత రెండేళ్లలో ప్రైవేటు నీటిశుద్ధి ప్లాంట్ల నుంచి నీటిని తెప్పించుకునే కుటుంబాల సంఖ్య భారీగా పెరిగింది. ప్రకాశం, గుంటూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లోని కొన్ని పట్టణాల్లో నీటి సరఫరా తగినంత లేకపోవడంతోనూ.. ఎక్కువ మంది ప్రైవేటు ప్లాంట్లలో నీటికి అలవాటు పడ్డారు.
లెక్కల్లో లేని కనెక్షన్లు 57,963
పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో 57,963 అక్రమ కుళాయి కనెక్షన్లు ఉన్నాయన్న విషయమూ సర్వేలో వెల్లడైంది. పట్టణ స్థానిక సంస్థల్లో మొత్తం 18,67,306 కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 57,963 కుళాయిలకు రోజూ నీరు సరఫరా అవుతున్నా... అవి లెక్కల్లో లేవని నివేదించారు. పురపాలక మాజీ ఛైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్ల ఇళ్లు, ఇతర దుకాణాల్లో అక్రమ కనెక్షన్లు ఉన్నాయి. నివేదికలో ఈ వివరాల జోలికి వెళ్లలేదు. అనంతపురం రీజియన్లో అత్యధికంగా 37,157, రాజమహేంద్రవరంలో 7,711, గుంటూరులో 6,721, విశాఖపట్నం రీజియన్లో 6,373 అక్రమ కనెక్షన్లు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!
పల్లెపల్లె తిరిగినాదో అమ్మా భువనమ్మ- ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ జనం గుండెల్లో కొలువైనాది.. కష్టాలు కన్నీళ్లు తుడిపేసింది. -
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు
ఉత్తర కోస్తాలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!
అధికార పార్టీ నేతల ఫొటోలు, హోర్డింగులు తొలగించడంలో చర్యలు తీసుకోని అధికారులు.. నిరుపేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్కు మాత్రం నిబంధనలు వర్తిస్తాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. -
ప్రధాని సభలో ఆ ముగ్గురు ఎస్పీలు ఏమైనట్లు?
తెదేపా, జనసేన, భాజపా కూటమి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో తోపులాటలు చోటుచేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి అంతరాయం ఏర్పడిన ఘటనపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. -
రోజంతా ఆసుపత్రి గదిలో చిక్కుకుపోయిన 5 ఏళ్ల బాలుడు
మాటలు రాని, వినపడని ఓ అయిదేళ్ల చిన్నారి అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రి గదిలో ఒక రోజంతా బందీ అయిపోయిన ఘటన కర్నూలు జిల్లా సర్వజన ఆసుపత్రిలో జరిగింది. -
బోరు వేసుకుంటారా.. రూ. 10 వేలు కట్టండి
తిరుపతిలోని అధికార పార్టీ కార్పొరేటర్ల అసలు రంగును బయటపెడుతూ సోమవారం ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఐదేళ్లూ షాక్.. ఎన్నికలని బ్రేక్!
పాదయాత్ర పేరిట ఊరూవాడా తిరిగిన జగన్... విద్యుత్ ఛార్జీలపై అలవోకగా అబద్ధాలు వల్లెవేశారు. మాటల గారడీతో ప్రజలను బురిడీ కొట్టించారు. -
వైకాపా సైన్యం బరితెగింపు
ఎన్నికల సంఘం నిఘా పరిధిలో ఉన్నామన్న బెరుకు లేదు.. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తున్నామన్న అదురూ లేదు. -
వేతనాల చెల్లింపులపై నేడు ‘చివరి గ్రీవెన్స్ డే’
వేతనాల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా జిల్లా కేంద్రాలలో మంగళవారం నిర్వహించే చివరి ‘గ్రీవెన్స్ డే’(వినతుల స్వీకరణ)లో పరిష్కరించుకోవాలని ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ సూచించారు. -
జగన్పై పోస్టులో అభ్యంతరకర భాగాన్ని తొలగించండి
వైకాపా అధ్యక్షుడు జగన్పై తెదేపా ఎక్స్ ఖాతాలో ఉంచిన పోస్టులో అభ్యంతరకరమైన ఓ భాగాన్ని తొలగించాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి సోమవారం లేఖ రాసింది. -
కక్షిదారులకు వెంటనే న్యాయం అందించాలి
న్యాయస్థానాల్లో కక్షిదారులకు వేగంగా న్యాయం జరిగేలా న్యాయవాదులు చొరవ తీసుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. -
ఓఎంఆర్ షీట్లో గల్లంతైన విద్యార్థిని పేరు
విద్యాశాఖ అధికారుల తీరుతో పదో తరగతి విద్యార్థిని అరగంటపాటు తల్లడిల్లాల్సి వచ్చింది. తిరుపతి నగరంలోని సత్యనారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.వర్షిణి తనకు కేటాయించిన బైపాస్లోని రత్నం పరీక్షా కేంద్రం వద్దకు అరగంట ముందుగానే చేరుకుంది. -
కోడ్ కూసే ముందు.. అయినవారికే నిధులు
ఇప్పటికే పలు దఫాలు సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ పరిధిలో రహదారుల పనులు చేసిన గుత్తేదార్లకు మాత్రమే చెల్లింపులు చేశారంటూ ఇతర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. -
కాసులివ్వని కపట ప్రేమ!
పేరుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి డబ్బులు జమ చేస్తున్నట్లు ప్రకటిస్తారు.. రైతులకు మాత్రం సున్నా వడ్డీ లేదు. పెట్టుబడి సాయమూ లేదు. -
గ్రహణం వీడితేనే గట్టెక్కేది!
చుట్టూ నీళ్లలో నిరుపయోగంగా ఉన్న ఈ నిర్మాణాలు టిడ్కో ఇళ్లు. ఒంగోలు నగరం సమీపంలోని చింతల వద్ద తెదేపా హయాంలో నిర్మించారు. -
ఈఏపీసెట్ పరీక్ష తేదీల్లో మార్పు
ఎన్నికల నేపథ్యంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీసెట్ పరీక్ష షెడ్యూల్ మారనుంది. -
ఉత్తుత్తి సంక్షేమం
‘గడప గడపకు సంక్షేమం’ పేరుతో వైకాపా ప్రభుత్వం పేదలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోంది. -
కోడ్ ఉల్లంఘన విచారణలో జాప్యం: కలెక్టర్ ఆగ్రహం
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వాలంటీర్ల వివరాల సేకరణలో జాప్యం జరగడంతో గుంటూరు జిల్లా కలెక్టర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇదేం సామాజిక న్యాయం జగన్?
వైకాపా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో సామాజిక న్యాయం నేతి బీర చందంగా ఉంది. రాయలసీమ నాలుగు జిల్లాలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాను కలిపి వైకాపా టికెట్ల కేటాయింపు పరిశీలిస్తే.. జగన్ మార్క్ న్యాయం ఏమిటన్నది స్పష్టమవుతోంది. -
సీపీఎస్ ఉద్యోగుల డబ్బులు రూ.2,800 కోట్లు హాంఫట్
జగన్ సర్కార్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులపై కక్షకట్టినట్లు వ్యవహరిస్తోంది. -
ఆగని సలహాదారు నియామకాల జోరు
ప్రభుత్వశాఖలకు సలహాదారుల నియామకంపై హైకోర్టు అభ్యంతరం చెప్పినా జగన్ ప్రభుత్వ తీరు మారడంలేదు.