Andhra News: బండి తిప్పలేం.. బండ మోయలేం!
మొన్నటికి మొన్న.. వంట నూనెలు లీటరుకు రూ.70దాకా పెరిగాయి. పేద, మధ్య తరగతి జీవుల వంటింటి ఖర్చుకు మంట పెట్టాయి. ఈ భారం తట్టుకునేదెలా అని తల్లడిల్లుతుంటే...
ఇంటింటికీ తప్పని ఇంధన సెగ
రూ.50 పెరిగిన వంట గ్యాస్ ధర
రెండోరోజూ పెట్రో ధరల పెంపు
అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో రూ.వెయ్యి దాటిన సిలిండర్
కుప్పంలో లీటరు రూ.100 దాటుతున్న డీజిల్, రూ.114 పైన పెట్రోలు
ఈనాడు, అమరావతి: మొన్నటికి మొన్న.. వంట నూనెలు లీటరుకు రూ.70దాకా పెరిగాయి. పేద, మధ్య తరగతి జీవుల వంటింటి ఖర్చుకు మంట పెట్టాయి. ఈ భారం తట్టుకునేదెలా అని తల్లడిల్లుతుంటే... ఇంధన ధరల పిడుగు పడనే పడింది. మంగళవారం నుంచి లీటరు పెట్రోలు ధర 88 పైసలు, డీజిల్ 83 పైసలు చొప్పున పెరిగాయి. అంతలోనే వంట గ్యాస్ గంట కొట్టేసింది. నేనేం తక్కువ తిన్నానా అంటూ... సిలిండర్కు రూ.50 చొప్పున భగ్గుమంది. ఆస్తి, చెత్త పన్నుల బాదుడుతో ప్రభుత్వం కష్టజీవుల్ని పిండేస్తుండగా... ఇప్పుడేమో ఇంటింటికీ ఇంధన సెగ ఎక్కువవుతోంది. మార్చి ముగిసేలోగా ఇంకెన్ని బాదుడులు ఉంటాయో? ఇంటి ఖర్చు ఇంకెంత పెరుగుతుందో? అని పేద కుటుంబాలతో పాటు మధ్య తరగతివారు... చిరు వ్యాపారులు వాపోతున్నారు. తమకొచ్చే కొద్దిపాటి ఆదాయం ఈ ఖర్చులకే సరిపోతుందనే ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది. పెరిగిన ధరల నేపథ్యంలో చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పలు చోట్ల గృహవినియోగ సిలిండర్ రూ.వెయ్యి దాటేసింది. చిత్తూరు జిల్లా కుప్పంలో డీజిల్ ధర రూ.100 పైగా చేరింది.
ధర పేలింది...
వంటగ్యాస్ సిలిండర్ (14.2 కిలోలు) ధర విజయవాడలో సోమవారం దాకా రూ.922 ఉంది. దీనిపై రూ.50 చొప్పున పెంచుతున్నట్లు ఇంధన సంస్థలు మంగళవారం పేర్కొన్నాయి. ఫలితంగా సిలిండర్ ధర రూ.972కి చేరింది.
* వంటగ్యాస్ సిలిండర్ ధర చివరిగా గతేడాది అక్టోబరులో పెరిగింది. మళ్లీ ఇప్పుడు రూ.50 చొప్పున పెంచారు.
* రాష్ట్రంలో 1.43 కోట్ల వంటగ్యాస్ కనెక్షన్లున్నాయి. ప్రతినెలా గ్యాస్ తీసుకునే కుటుంబాలు 1.15 కోట్లుంటాయని అంచనా. పెరిగిన ధరల ప్రకారం చూస్తే... నెలకు రూ.57.50 కోట్ల భారం వినియోగదారులపై పడుతుంది.
* గతేడాది మార్చిలో గృహ వినియోగ సిలిండర్ ధర రూ.841. అప్పటి ధరతో పోలిస్తే.. సిలిండర్కు రూ.131 చొప్పున పెరిగింది.
* వంటగ్యాస్ సిలిండర్పై ఇచ్చే రాయితీని ప్రభుత్వం క్రమంగా కుదించేసింది. 2020 మార్చిలో సిలిండర్ ధర రూ.833 ఉన్నప్పుడు.. రాయితీగా రూ.255 వినియోగదారుల ఖాతాల్లో జమ చేసింది. తర్వాత నుంచి క్రమంగా రాయితీకి కోత పెడుతూ వచ్చింది.
* ప్రస్తుతం సిలిండర్ ధర రూ.972 అయింది. రాయితీ రూపంలోఅందేది సగటునసిలిండర్కు రూ.15 మాత్రమే.
రూ.వెయ్యి దాటేసిన సిలిండర్
చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోని పలు మండలాల్లో వంటగ్యాస్ కొనాలంటే రూ.వెయ్యి పైన పెట్టాల్సిందే. ఇంధన సంస్థలు ఒక్కో సిలిండర్పై రూ.50 చొప్పున పెంచడంతో.. అక్కడ సిలిండర్ ధరలు రూ.1,019 వరకు చేరాయి. అనంతపురం జిల్లా ఉరవకొండలో రూ.1,019, ఎన్పీ కుంటలో రూ.1,016 ఉండగా.. చిత్తూరు జిల్లా గుర్రంకొండలో రూ.1,008 చొప్పున ధర ఉంది. దూరానికి అనుగుణంగా కొన్ని ప్రాంతాల్లో సిలిండర్ ధరల్లో పెరుగుదల చోటు చేసుకుంది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.2,165 అయింది.
దిల్లీలో రూ.949... వంటగ్యాస్ సిలిండర్కు రూ.50 చొప్పున పెరగడంతో... దిల్లీ, ముంబయిల్లో ధర వరుసగా రూ.949.50కు, కోల్కతాలో రూ.976కు చేరుకుంది. గత ఏడాది అక్టోబరు 6 తర్వాత దేశంలో వంటగ్యాస్ ధరలను సవరించడం ఇదే తొలిసారి. 2021 జులై, 2021 అక్టోబరు మధ్య ఒక్కో సిలిండర్ ధర రూ.100 మేర పెరిగింది. అప్పట్లో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో రేట్ల నెలవారీ సవరణ నిలిచిపోయింది. 2014 జనవరిలో సిలిండర్ ధర అత్యధికంగా రూ.1,241కి చేరుకుంది. అప్పట్లో కేంద్రం ప్రభుత్వం ఒక్కో గ్యాస్బండపై రూ.600 వరకు సబ్సిడీ అందించేది. 2020 మే నుంచి దాన్ని నిలిపివేసింది. రవాణా ఛార్జీల భారాన్ని తగ్గించేలా స్వల్ప మొత్తాన్ని వినియోగదారులకు అందిస్తోంది. తాజా పెంపుతో 19 కేజీల వాణిజ్య వినియోగ సిలిండర్ ధర రూ.2,003.50కు చేరుకుంది.
రాష్ట్రంలోనే పెట్రో ధరలు అధికం
దేశీయంగా 137 రోజుల విరామం తర్వాత పెట్రో ధరల్లో పెరుగుదల మొదలైంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. బ్యారెల్ 112 డాలర్లకు చేరింది. దీంతో దేశీయంగానూ ధరల పెరుగుదల ఉంటుందనే సంకేతాలొచ్చాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలొచ్చాక ఇంధన బాదుడు ఉంటుందనే ఊహాగానాలూ వెలువడ్డాయి. అందుకు అనుగుణంగానే మంగళవారం నుంచి ధరల పెరుగుదల మొదలైంది.
* మంగళవారం లీటరు పెట్రోలుపై 88 పైసలు, డీజిల్పై 83 పైసల చొప్పున పెరిగాయి. బుధవారం కూడా పెట్రోలుపై 87 పైసలు, డీజిల్పై 84 పైసల చొప్పున పెంచారు. దీంతో రెండు రోజుల్లోనే లీటరు పెట్రోలుపై రూ.1.75, డీజిల్పై 1.67 చొప్పున పెరుగుదల నమోదైంది.
* ధరల పెరుగుదలతో బుధవారం విజయవాడలో లీటరు పెట్రోలు రూ.111.65, డీజిల్ రూ.97.71 (ప్రాంతాల వారీ మారుతుంది) చేరనుంది. పెరుగుదల ఇంకా ఉండొచ్చని డీలర్లు అంచనా వేస్తున్నారు.
* రాష్ట్రంలోనే అత్యధికంగా చిత్తూరు జిల్లా కుప్పంలో లీటరు పెట్రోలు ధరలు రూ.114.53, డీజిల్ రూ.100.06కు చేరనున్నాయి.
* గతేడాది నవంబరులో లీటరు పెట్రోలు ధర రూ.116, డీజిల్ ధర రూ.108గా ఉన్నాయి. ఆ నెలలో కేంద్రం లీటరు పెట్రోలుపై రూ.5, డీజిల్పై రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకం తగ్గించింది. వీటిపై పన్నులూ తగ్గడంతో.. రాష్ట్రంలో పెట్రోలు ధర రూ.110, డీజిల్ రూ.96 అయ్యాయి. ఇప్పుడు మళ్లీ ఎగబాకుతున్నాయి.
* కేంద్రం బాటలోనే నడిచిన పలు రాష్ట్రాలు పన్నులను తగ్గించుకోవడంతో.. ఇంధన ధరలు దిగొచ్చాయి. రాష్ట్రంలో ఎలాంటి తగ్గింపునూ ప్రకటించలేదు. దీంతో దేశంలోని మిగిలిన రాష్ట్రాల కంటే పెట్రోలు, డీజిల్ ధరలు మన రాష్ట్రంలోనే అధికం. ముడిచమురు ధరలకు అనుగుణంగా పెరుగుదల ఉంటే.. వినియోగదారులకు ఇవి మరింత భారంగా పరిణమించనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
విద్యుత్ బకాయిల్ని వెంటనే చెల్లించకపోతే వారి ఫ్లాట్లకు కరెంట్ కట్ చేస్తామని రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తూ ఉచిత వసతి సదుపాయాన్ని వినియోగించుకుంటున్న ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. -
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
జగన్ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులపై 1,500కుపైగా కేసులు పెట్టారని, చివరికి ధర్నా చేశారంటూ 80ఏళ్ల వయసుపైబడిన పెన్షనర్లపైనా కేసులు నమోదు చేశారని అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏడాది పొడవునా బీఈడీ ప్రవేశాలా?ఉన్నత విద్యామండలిపై వెల్లువెత్తుతున్న విమర్శలు
బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) ప్రవేశాల కౌన్సెలింగ్ను ఉన్నత విద్యామండలి ఏడాది పొడవునా నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
బ్యాంకుల్లో నగదు జమకాని వారికి.. 4న ఇంటింటికీ పింఛన్ పంపిణీ
బ్యాంకు ఖాతాలు మనుగడలో లేని కారణంగా పింఛను నగదు జమకాని వారికి మే 4వ తేదీన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్కుమార్ వెల్లడించారు. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై సీఎం వెనక్కి తగ్గరు: మంత్రి పెద్దిరెడ్డి
ల్యాండ్ టైటిలింగ్ యాక్టును సీఎం జగన్ కచ్చితంగా అమలు చేసి తీరుతారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. -
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
అన్నం ముద్దపైనా అక్కసే!
అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టుగా.. విపక్షాలపైన తనకున్న ఉక్రోషాన్ని.. నిర్భాగ్యులమీద చూపారు జగన్... గత తెదేపా ప్రభుత్వం తెచ్చిన అన్న క్యాంటీన్లను వచ్చీరాగానే మూసేయించారు... రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఆ క్యాంటీన్లు.. రోజూ వేల మంది క్షుద్భాద తీర్చేవి. దీనిపై విమర్శలు పెరిగాక.. ‘ఆహా’ క్యాంటీన్లు తెచ్చినా... జగన్ పాలనలానే.. దిక్కూదివానం లేనట్లుంది వాటి పరిస్థితి. -
‘అన్నపూర్ణ’ అప్పుల కుప్ప
అద్భుత రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి... 70 శాతం పూర్తయిన పోలవరం... ఆశతో దూసుకొచ్చిన వందలాది ఐటీ పరిశ్రమలతో... ... కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన బిడ్డలా... ఐదేళ్ల కిందట జగన్ చేతికొచ్చింది ఆంధ్రావని! -
‘భీమ్లీ’ ఖల్ నాయక్!
‘‘నాయక్ నహీ.. ఖల్ నాయక్ మై హూ..!’’ అంటూ ఆయన చేసే హడావుడి అంతాఇంతా కాదు. ‘‘ఏం చేస్తున్నావ్? యూనిఫామ్ తీసేయ్..!’’ అంటూ పోలీసులపైనే రుసరుసలాడతారు. -
అంతా.. ఆ ఏడు చేపలకే!
వడ్డించే వాడు జగన్ అయితే... కేటాయింపులు ఇలాగే ఉంటాయి మరి. తన తండ్రి హయాంలోనే కంపెనీలతో రూ.లక్షల కోట్ల ‘క్విడ్ప్రోకో’ లావాదేవీలకు తెరతీసిన ఆయన... తాను గద్దెనెక్కాక ‘గంపగుత్త’ సూత్రాన్ని అనుసరించారు. -
వైకాపా హయాంలో ఎస్సీ కమిషన్ నిర్వీర్యం
వైకాపా హయాంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు ధ్వజమెత్తారు. సమతా సైనిక్దళ్ ఆధ్వర్యంలో గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
14 నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్
అత్యంత సమస్యాత్మకమైన 14 నియోజకవర్గాల పరిధిలో మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ పెడతామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
పథకాలకు గండికొట్టి.. గొంతెండబెట్టి!
ధ్వంసరచనే తప్ప దార్శనికత లేని జగన్ పాలనలో పట్టణాల్లో గుక్కెడు తాగునీళ్లూ కరవయ్యాయి. తెదేపా తెచ్చిందన్న ఏకైక కారణంతో రూ.వేల కోట్ల పథకాలను ఎండబెట్టిన ఈ నీరో చక్రవర్తి ఎండల్లో జనం గొంతెండి అలమటిస్తుంటే... తాడేపల్లి ప్యాలెస్లో ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నారు... కేవలం తన పంతం కోసం జనం సంక్షేమాన్ని వదిలేసిన ఈ ప్రభుత్వాధినేతను ఏమని పిలవాలి? -
పార్టీలకు కొమ్ముకాస్తున్న కొందరు ఐఏఎస్ అధికారులు
‘ప్రజలకు మేలు చేయాల్సిన కొందరు ఐఏఎస్లు... తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలకు కొమ్ముకాస్తున్నారు. అలాంటి వారిని రాజద్రోహులుగా ప్రకటించాలి’ అని ఆర్థిక నిపుణుడు, ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్ డిమాండ్ చేశారు. -
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887కు చేరింది. ఈ ఏడాది జనవరి 22న విడుదల చేసిన తుది జాబితాలో 4,08,07,356 మంది ఓటర్లు ఉన్నారు. -
ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
భగభగ మండే ఎండలతో రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కర్నూలు, కావలి, నంద్యాల, ఆరోగ్యవరం తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు పెరిగాయి. -
ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్పై వింత నాటకం
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేసే ఎన్నికల సంఘం.. ఉద్యోగులపై మాత్రం కక్షగట్టినట్లు వ్యవహరిస్తోంది. -
బకాయిలు చెల్లించకపోతే వైద్యం అందించలేం
బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 4 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) నగదు రహిత సేవలను నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆశా) ప్రకటించింది. -
కేజీబీవీ సిబ్బంది సేవల్లో ప్రభుత్వం కొత్త మెలిక
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల ఒప్పంద ఉపాధ్యాయినుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
-
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
-
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు
-
ఘోరం.. సెల్ఫోన్ టార్చ్లైట్ వెలుగులో ప్రసవం.. తల్లీబిడ్డ మృతి
-
ఉక్రెయిన్పై రష్యా ‘క్లోరోపిక్రిన్’ ప్రయోగం? ఏంటీ ఆయుధం?