Lakhimpur Kheri: మిగతా కేసుల్లోనూ నిందితులతో ఇలాగే వ్యవహరిస్తారా?
లఖింపుర్ ఖేరిలో గత ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనల్లో 8 మంది మరణానికి కారణమైన నిందితుల పట్ల ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ప్రభుత్వ వ్యవహారశైలి ఏమాత్రం సంతృప్తికరంగా లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు.
యూపీ సర్కారు నుంచి మాటలే తప్ప చర్యలు లేవు
‘సిట్’లో అందరూ స్థానిక అధికారులేనా!
అన్నింటికీ సీబీఐ విచారణే పరిష్కారం కాదు
లఖింపుర్ ఖేరి కేసులో సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ
ఈనాడు, దిల్లీ: లఖింపుర్ ఖేరిలో గత ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనల్లో 8 మంది మరణానికి కారణమైన నిందితుల పట్ల ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ప్రభుత్వ వ్యవహారశైలి ఏమాత్రం సంతృప్తికరంగా లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. ‘దయచేసి విచారణకు హాజరుకండి’ అంటూ నిందితుడికి సీఆర్పీసీ-160 కింద పోలీసులు నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. మిగతా కేసుల్లోని నిందితుల విషయంలోనూ ఇలాగే వ్యవహరిస్తారా? అని నిలదీశారు. ఘటనలపై దర్యాప్తునకు పూర్తిగా స్థానిక అధికారులతోనే సిట్ వేయడాన్ని ఆయన తప్పుబట్టారు. వారిని కొనసాగించే ప్రశ్నే లేదన్నారు. ఈ కేసులోని వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని దర్యాప్తును సీబీఐకి అప్పగించాలనుకోవడం లేదని, అన్నిటికీ సీబీఐ ఒక్కటే పరిష్కారం కాదని, మరే ఏజెన్సీతో విచారణ జరిపిస్తే బాగుంటుందో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది హరీశ్సాల్వేకి సూచించారు. లఖింపుర్ ఖేరి ఉదంతంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని అభ్యర్థిస్తూ ఇద్దరు న్యాయవాదులు లేఖ రాయడంతో- ఈ అంశంపై జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీల ధర్మాసనం విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే.
ఈ కేసులో శుక్రవారం హరీశ్సాల్వే వాదనలు వినిపించారు. ‘‘నిందితుడిపై (కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్మిశ్ర కుమారుడు ఆశిష్) ఆరోపణలొచ్చాయి. కేసు తీవ్రత దృష్ట్యా ఆయనకు 160 కింద నోటీసులిచ్చి, విచారణకు పిలిచాం. సమయం కోరడంతో శనివారం ఉదయం 11 గంటలకల్లా రమ్మన్నాం’’ అని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై జస్టిస్ ఎన్.వి.రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ఇక్కడ చాలా గంభీరమైన అభియోగాలున్నాయి. ఎఫ్ఐఆర్లో 302, ఇతర సెక్షన్లు నమోదయ్యాయి. ఇలాంటి కేసులన్నింటి విషయంలోనూ ఇలాగే వ్యవహరిస్తారా? మీకు నోటీసులు పంపుతున్నాం, దయచేసి హాజరుకండి అని మిగతా నిందితులనీ ఇలాగే అర్థిస్తారా?’’ అని ప్రశ్నించారు. సాల్వే బదులిస్తూ, ‘‘పోస్ట్మార్టంలో మృతునికి బుల్లెట్ గాయాలు కనిపించలేదు. అందుకే నిందితునికి 160 కింద నోటీసులిచ్చారు. బుల్లెట్ గాయముంటే పరిస్థితులు మరోలా ఉండేవి. కారును నడిపిన విధానంచూస్తే ఆరోపణలు నిజమేనని అనిపిస్తుంది. అందుకే ఇది 302 కేసు కిందికే వస్తుంది’’ అన్నారు. ఇందుకు సీజేఐ మాట్లాడుతూ- ‘‘నిందితుడి ప్రమేయం గురించి ప్రత్యక్షంగా చూసినవారు చెబుతున్నారు కదా? మేము బాధ్యతాయుత ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను, వ్యవస్థను ఆశిస్తున్నాం. 302 కింద కేసు నమోదైనప్పుడు, మృతుడి శరీరంపై తుపాకీతో కాల్చిన గాయాలున్నప్పుడు ఈ దేశంలోని మిగతా నిందితులతోనూ ఇలాగే వ్యవహరిస్తారా? నోటీసులిచ్చి దయచేసి రండి అని అడుగుతారా? పోస్ట్మార్టం నివేదికలో బుల్లెట్ గాయాలు లేవని నిందితుడితో ఇలా వ్యవహరించవచ్చా? అత్యంత తీవ్రమైన కేసులో మీరు వ్యవహరించాల్సిన తీరులో వ్యవహరించలేదు’’ అన్నారు.
విచారణను 18వ తేదీకి వాయిదా వేయాలని, ఆలోగా కేసు విషయంలో అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని అత్యున్నతస్థాయి వర్గాలు చెప్పినట్టు సాల్వే కోర్టుకు విన్నవించారు. ఈ వ్యాఖ్యలతో సీజేఐ ఏకీభవించలేదు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం మాటల్లో తప్ప చేతల్లో చర్యలు కనిపించడంలేదు. సాధారణంగా 302 కింద కేసు నమోదుచేశాక పోలీసులు ఏం చేస్తారు? తక్షణం నిందితుడిని అదుపులోకి తీసుకుంటారు. ఇక్కడ మీరు నోటీసులిచ్చి, హాజరుకావాలని అడుగుతున్నారు’’ అని హరీశ్సాల్వేని ఉద్దేశించి సీజేఐ అన్నారు. జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకుని, ‘‘ఇది 8 మంది దారుణహత్యకు సంబంధించిన కేసు. ఇందులో నిందితులు ఒకరు, ఇద్దరు, ముగ్గురు ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో చట్టం తనపని తాను చేసుకుపోయి, నిందితులందరిపై చర్యలు తీసుకొని ఉండాల్సింది’’ అని అన్నారు. అనంతరం ప్రధాన న్యాయమూర్తి విచారణను ఈనెల 20కి వాయిదా వేశారు.
సిట్లో వారు వద్దే వద్దు..
జస్టిస్ రమణ మాట్లాడుతూ- ‘‘ఘటనపై వేసిన సిట్ జాబితా చూశాం. అందులో డీఐజీ, ఎస్పీలు, సర్కిల్ ఆఫీసర్లు, ఇన్స్పెక్టర్లను నియమించారు. వీరంతా స్థానికులు కాబట్టే ఇలా జరుగుతోంది. కేసును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందా?’’ అని ప్రశ్నించారు. ఇప్పటివరకూ అలా కోరలేదని సాల్వే చెప్పారు. కేసు విచారణను దసరా సెలవుల వరకూ వాయిదా వేయాలని, కావాలంటే అప్పుడు సీబీఐకి అప్పగించాలని.. ఆలోగా ప్రస్తుత కార్యాచరణను కొనసాగనివ్వాలని.. లేకుంటే దర్యాప్తు జాప్యమవుతుందని కోర్టుకు విన్నవించారు. ఇందుకు సీజేఐ స్పందిస్తూ- ‘‘కేసు గంభీరతను బట్టి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం. అన్నింటికీ సీబీఐ విచారణే పరిష్కారం కాదు. అందుకు కారణమేంటన్నది మీకే బాగా తెలుసు. కేసుతో సంబంధమున్న వ్యక్తులను దృష్టిలో ఉంచుకొని, మేం కూడా సీబీఐ విచారణ పట్ల ఆసక్తి చూపడం లేదు. సిట్ అధికారులను కొనసాగించే ప్రశ్నే లేదు. రెండుమూడు రోజుల నుంచి వారి ప్రవర్తన చూస్తున్నాం. దర్యాప్తు సజావుగా జరుగుతుందన్న నమ్మకం లేదు. మరేదైనా ఏజెన్సీ దర్యాప్తు చేపట్టేలోగా... సాక్ష్యాధారాలను పూర్తిగా ధ్వంసంచేసే పరిస్థితి రాకూడదు. అన్ని సాక్ష్యాధారాలను కచ్చితంగా సంరక్షించాలని డీజీపీకి చెప్పండి’’ అని ఆదేశించారు. అందుకు సాల్వే అంగీకరించారు. హోంశాఖ కార్యదర్శి, డీజీపీలకు తానే ఈ విషయం చెప్పి, న్యాయస్థానం ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని కోరతానన్నారు.
వారికి కొంతైనా స్పృహ ఉండాలి
టైమ్స్నౌ ట్వీట్పై సీజేఐ స్పందన
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లఖ్నవూ వెళ్లి, లఖింపుర్ ఖేరి బాధిత కుటుంబాలను కలిశారంటూ టౌమ్స్నౌ ఛానల్ ట్విట్టర్లో పేర్కొనడం పట్ల సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రచారం చేసినవారికి కొంతైనా స్పృహ(సెన్స్) ఉండాలన్నారు. తాను కోర్టులో కూర్చొని ఉంటే, లఖ్నవూ వెళ్లి బాధితులను ఎలా కలుస్తానన్నది వారికే తెలియాలన్నారు. విచారణ సందర్భంగా ఆదిత్య అనే యువ న్యాయవాది ఈ ట్వీట్ విషయమై ప్రస్తావించారు. ఇందుకు సీజేఐ స్పందిస్తూ- ‘‘ఇలాంటి వాటి గురించి నేనేమీ మాట్లాడదలచుకోలేదు. ఇవన్నీ టీవీలు చేసే ప్రచారం. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మిస్టర్ ఆదిత్యా! ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మనం పూలు, రాళ్లు రెండూ స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి’’ అని నవ్వుతూ అన్నారు. ప్రైవేటు జీవితాలను కూడా వదిలి పెట్టడంలేదన్న వ్యాఖ్యతో ఆయన ఏకీభవించారు. జస్టిస్ సూర్యకాంత్ మాత్రం ట్వీట్పై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ‘‘ఇది చాలా దురదృష్టకరం. కొందరు భావప్రకటన స్వేచ్ఛ హద్దులను దాటడం బాధాకరం. ట్వీట్లోని అంశాలు పూర్తిగా అవాస్తవం. ఈ విషయంలో ప్రధాన న్యాయమూర్తి గౌరవప్రదంగా వ్యవహరించారు. కానీ, ఇది పూర్తిగా కోర్టు ధిక్కారం కిందికే వస్తుంది. ట్వీట్కు బాధ్యులైనవారు తప్పు ఎందుకు జరిగిందో చెబుతూ దాన్ని సరిదిద్దుకుంటారని ఆశిస్తున్నాం. లేకుంటే ఏంచేయాలన్నది తగిన సమయంలో నిర్ణయిస్తాం’’ అని పేర్కొన్నారు. మీడియా స్వతంత్రతను తాము గౌరవిస్తామని, అలాగని హద్దులు మీరడం న్యాయం కాదని జస్టిస్ హిమా కోహ్లీ వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!