కేంద్రానిది పక్షపాత ధోరణి
ఆంధ్రప్రదేశ్పై కేంద్రం ఎందుకు పక్షపాతం చూపుతోందో పార్లమెంట్లో ప్రశ్నించాలని వైకాపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ణయించారు. ‘చంద్రబాబు హయాంలో పరిమితికి మించి
పోలవరం వ్యయం రూ.55,657 కోట్లుగా ఆమోదం పొందాలి
రూ.1,000కోట్ల వరద సాయానికి పట్టుబట్టాలి
వైకాపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం జగన్ మార్గనిర్దేశం
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్పై కేంద్రం ఎందుకు పక్షపాతం చూపుతోందో పార్లమెంట్లో ప్రశ్నించాలని వైకాపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ణయించారు. ‘చంద్రబాబు హయాంలో పరిమితికి మించి అప్పులు చేస్తే కేంద్రం అప్పుడే ఎందుకు ప్రశ్నించలేదు..2018-19లోనే రుణ సేకరణకు ఎందుకు పరిమితిని విధించలేదు? అప్పుడు పరిమితికి మించి అప్పులు చేశారంటూ ఇప్పుడు రాష్ట్ర నికర రుణ పరిమితి(ఎన్డీసీ)లో కోత పెట్టి దాన్ని వచ్చే మూడేళ్లవరకూ వర్తింపజేస్తామనడం సరికాదు’అనే విషయాన్ని పార్లమెంట్ ఉభయసభల్లోనూ ప్రస్తావించాలని తీర్మానించారు. శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో వైకాపా పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించిన 13అంశాలతోపాటు ఇటీవల తిరుపతిలో సదరన్ జోనల్ సమావేశంలో ఏపీ ప్రస్తావించిన ఆరు అంశాలను పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తాలని ముఖ్యమంత్రి ఎంపీలకు మార్గదర్శనం చేశారు. వైకాపా ఎంపీలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేస్తూ ‘మన ప్రభుత్వం ఏర్పాటై రెండున్నరేళ్లయింది. మరో రెండేళ్ల తర్వాత ఎన్నికల కాలం వచ్చేస్తుంది. పార్లమెంటులో మనకంటూ సొంతబలం ఉంది..మన పార్టీకి ఉన్న ప్రతిష్ఠను నిలబెట్టేలా పోరాడాలి. మనం ఎన్డీయే, యూపీఏ కూటముల్లో లేము. పార్లమెంటులో మనం లేవనెత్తే ప్రతీ అంశమూ ప్రజల తరఫునే’ అని స్పష్టం చేశారు. ‘పోలవరం అంచనా వ్యయం రూ.55,657కోట్ల ఆమోదానికి కేంద్రాన్ని పట్టుబట్టాలి. ప్రాజెక్టుల్లో ఎప్పుడూ లేనివిధంగా తాగునీటి అంశాన్ని విడదీస్తే ఎలా? ఇప్పటివరకూ పోలవరంపై రాష్ట్రం ఖర్చు చేసిన రూ.2,104కోట్లను కేంద్రం తిరిగిచెల్లించేలా అడగాలి’ అని ఎంపీలను సీఎం కోరారు. ‘జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో హేతుబద్ధత లేదు..మన రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. దీనిని ప్రస్తావించాలి. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థకు కేంద్రం నుంచి రావాల్సిన రాయితీ బకాయి రూ.1,703 కోట్లను చెల్లించమని అడగాలి. రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద రాష్ట్రానికి ఇవ్వాల్సిన రూ.22,948కోట్ల కోసం ఎంపీలు సమష్టిగా పోరాడాలి. 2021 జనగణన సందర్భంగా బీసీ కులాలవారీగా గణన చేయాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని అడగాలి. రాష్ట్రంలో 16వైద్య కళాశాలలను తీసుకువస్తున్నాం. వీటిలో 13కళాశాలలకు అనుమతుల ఇవ్వాలని కేంద్రాన్ని కోరాలి. కనీస మద్దతు ధరకు సంబంధించి కొత్తగా చట్టం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.దానికి మద్దతు పలకాలి’ అని జగన్ సూచించారు. సమావేశ నిర్ణయాలను వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విలేకరులకు వెల్లడించారు.. ‘ఉపాధిహామీ పథకం కింద రావాల్సిన రూ.4,976కోట్లు, పేదల కోసం ఇళ్లు నిర్మిస్తున్న ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.30వేల కోట్లను అడగడంతోపాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరతామని చెప్పారు.
అమరావతి రైతుల అభిప్రాయాలను తీసుకుంటాం
3 రాజధానులపై కొత్త చట్టం తెచ్చేటపుడు అమరావతి రైతుల అభిప్రాయాలను తీసుకుంటారా అని విలేకరులు అడగ్గా..‘తీసుకుంటాం, చంద్రబాబు తీసుకున్నట్లే మేమూ తీసుకుంటాం’అని సాయిరెడ్డి చెప్పారు. భిక్షాటన చేసి వరద బాధితులకు డబ్బు ఇస్తామని భాజపా నేతలు అంటున్న విషయాన్ని ప్రస్తావించగా ‘భాజపా వాళ్లు భిక్షాటన చేయడం ఎందుకు? కేంద్రంలో వారి ప్రభుత్వమే ఉంది, కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సిందే చాలా ఉంది, అవన్నీ ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు’ అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
విద్యుత్ బకాయిల్ని వెంటనే చెల్లించకపోతే వారి ఫ్లాట్లకు కరెంట్ కట్ చేస్తామని రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తూ ఉచిత వసతి సదుపాయాన్ని వినియోగించుకుంటున్న ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. -
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
జగన్ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులపై 1,500కుపైగా కేసులు పెట్టారని, చివరికి ధర్నా చేశారంటూ 80ఏళ్ల వయసుపైబడిన పెన్షనర్లపైనా కేసులు నమోదు చేశారని అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏడాది పొడవునా బీఈడీ ప్రవేశాలా?ఉన్నత విద్యామండలిపై వెల్లువెత్తుతున్న విమర్శలు
బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) ప్రవేశాల కౌన్సెలింగ్ను ఉన్నత విద్యామండలి ఏడాది పొడవునా నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
బ్యాంకుల్లో నగదు జమకాని వారికి.. 4న ఇంటింటికీ పింఛన్ పంపిణీ
బ్యాంకు ఖాతాలు మనుగడలో లేని కారణంగా పింఛను నగదు జమకాని వారికి మే 4వ తేదీన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్కుమార్ వెల్లడించారు. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై సీఎం వెనక్కి తగ్గరు: మంత్రి పెద్దిరెడ్డి
ల్యాండ్ టైటిలింగ్ యాక్టును సీఎం జగన్ కచ్చితంగా అమలు చేసి తీరుతారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. -
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
అన్నం ముద్దపైనా అక్కసే!
అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టుగా.. విపక్షాలపైన తనకున్న ఉక్రోషాన్ని.. నిర్భాగ్యులమీద చూపారు జగన్... గత తెదేపా ప్రభుత్వం తెచ్చిన అన్న క్యాంటీన్లను వచ్చీరాగానే మూసేయించారు... రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఆ క్యాంటీన్లు.. రోజూ వేల మంది క్షుద్భాద తీర్చేవి. దీనిపై విమర్శలు పెరిగాక.. ‘ఆహా’ క్యాంటీన్లు తెచ్చినా... జగన్ పాలనలానే.. దిక్కూదివానం లేనట్లుంది వాటి పరిస్థితి. -
‘అన్నపూర్ణ’ అప్పుల కుప్ప
అద్భుత రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి... 70 శాతం పూర్తయిన పోలవరం... ఆశతో దూసుకొచ్చిన వందలాది ఐటీ పరిశ్రమలతో... ... కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన బిడ్డలా... ఐదేళ్ల కిందట జగన్ చేతికొచ్చింది ఆంధ్రావని! -
‘భీమ్లీ’ ఖల్ నాయక్!
‘‘నాయక్ నహీ.. ఖల్ నాయక్ మై హూ..!’’ అంటూ ఆయన చేసే హడావుడి అంతాఇంతా కాదు. ‘‘ఏం చేస్తున్నావ్? యూనిఫామ్ తీసేయ్..!’’ అంటూ పోలీసులపైనే రుసరుసలాడతారు. -
అంతా.. ఆ ఏడు చేపలకే!
వడ్డించే వాడు జగన్ అయితే... కేటాయింపులు ఇలాగే ఉంటాయి మరి. తన తండ్రి హయాంలోనే కంపెనీలతో రూ.లక్షల కోట్ల ‘క్విడ్ప్రోకో’ లావాదేవీలకు తెరతీసిన ఆయన... తాను గద్దెనెక్కాక ‘గంపగుత్త’ సూత్రాన్ని అనుసరించారు. -
వైకాపా హయాంలో ఎస్సీ కమిషన్ నిర్వీర్యం
వైకాపా హయాంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు ధ్వజమెత్తారు. సమతా సైనిక్దళ్ ఆధ్వర్యంలో గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
14 నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్
అత్యంత సమస్యాత్మకమైన 14 నియోజకవర్గాల పరిధిలో మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ పెడతామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
పథకాలకు గండికొట్టి.. గొంతెండబెట్టి!
ధ్వంసరచనే తప్ప దార్శనికత లేని జగన్ పాలనలో పట్టణాల్లో గుక్కెడు తాగునీళ్లూ కరవయ్యాయి. తెదేపా తెచ్చిందన్న ఏకైక కారణంతో రూ.వేల కోట్ల పథకాలను ఎండబెట్టిన ఈ నీరో చక్రవర్తి ఎండల్లో జనం గొంతెండి అలమటిస్తుంటే... తాడేపల్లి ప్యాలెస్లో ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నారు... కేవలం తన పంతం కోసం జనం సంక్షేమాన్ని వదిలేసిన ఈ ప్రభుత్వాధినేతను ఏమని పిలవాలి? -
పార్టీలకు కొమ్ముకాస్తున్న కొందరు ఐఏఎస్ అధికారులు
‘ప్రజలకు మేలు చేయాల్సిన కొందరు ఐఏఎస్లు... తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలకు కొమ్ముకాస్తున్నారు. అలాంటి వారిని రాజద్రోహులుగా ప్రకటించాలి’ అని ఆర్థిక నిపుణుడు, ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్ డిమాండ్ చేశారు. -
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887కు చేరింది. ఈ ఏడాది జనవరి 22న విడుదల చేసిన తుది జాబితాలో 4,08,07,356 మంది ఓటర్లు ఉన్నారు. -
ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
భగభగ మండే ఎండలతో రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కర్నూలు, కావలి, నంద్యాల, ఆరోగ్యవరం తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు పెరిగాయి. -
ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్పై వింత నాటకం
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేసే ఎన్నికల సంఘం.. ఉద్యోగులపై మాత్రం కక్షగట్టినట్లు వ్యవహరిస్తోంది. -
బకాయిలు చెల్లించకపోతే వైద్యం అందించలేం
బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 4 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) నగదు రహిత సేవలను నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆశా) ప్రకటించింది. -
కేజీబీవీ సిబ్బంది సేవల్లో ప్రభుత్వం కొత్త మెలిక
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల ఒప్పంద ఉపాధ్యాయినుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
-
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
-
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు
-
ఘోరం.. సెల్ఫోన్ టార్చ్లైట్ వెలుగులో ప్రసవం.. తల్లీబిడ్డ మృతి
-
ఉక్రెయిన్పై రష్యా ‘క్లోరోపిక్రిన్’ ప్రయోగం? ఏంటీ ఆయుధం?