Asani Cyclone: తీరం దాటిన అసని
భారీ వర్షాలు, ఈదురు గాలులతో రెండు రోజులుగా కలవరపెట్టిన ‘అసని’ తీవ్ర తుపాను.. వ్యవసాయ, ఉద్యాన పంటలకు పెద్ద ఎత్తున నష్టం కలిగించింది. రైతుల్ని నిలువునా ముంచేసింది. బుధవారం ఉదయానికి తుపానుగా
మచిలీపట్నం-నరసాపురం మధ్య భూమ్మీదకు
యానాం, కాకినాడ తీరం వెంబడి కదులుతూ.. మళ్లీ బంగాళాఖాతంలోకి చేరే అవకాశం
నేటి ఉదయానికి వాయుగుండంగా బలహీనపడొచ్చు
కోస్తాలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు
తుపాను ప్రభావంతో వేల ఎకరాల్లో నేలవాలిన పంటలు
వేర్వేరు ఘటనల్లో ముగ్గురి మృతి
ఈనాడు, అమరావతి: భారీ వర్షాలు, ఈదురు గాలులతో రెండు రోజులుగా కలవరపెట్టిన ‘అసని’ తీవ్ర తుపాను.. వ్యవసాయ, ఉద్యాన పంటలకు పెద్ద ఎత్తున నష్టం కలిగించింది. రైతుల్ని నిలువునా ముంచేసింది. బుధవారం ఉదయానికి తుపానుగా బలహీనపడింది. రాత్రికి తీవ్ర వాయుగుండంగా మారి.. మచిలీపట్నానికి 20 కిలోమీటర్లు, నరసాపురానికి 40 కిలోమీటర్ల మధ్య తీరాన్ని దాటింది. ఇది రాత్రికి ఉత్తర ఈశాన్య దిశగా యానాం, కాకినాడ, తుని తీరాల వెంబడి కదులుతూ వాయుగుండంగా మారి మళ్లీ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. తీవ్ర తుపాను, తుపాను ప్రభావంతో మంగళ, బుధవారాల్లో నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం, శ్రీకాకుళం, గుంటూరు, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడులో 15.5 సెం.మీ, తిరుపతి జిల్లా ఓజిలిలో 13.6 సెం.మీ గరిష్ఠ వర్షపాతం నమోదైంది.
బుధవారం ఉదయం నుంచి తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. ఉప్పాడ-కొత్తపల్లి రహదారి కెరటాల ధాటికి ధ్వంసమైంది. మంగళవారం ఉప్పాడ తీరానికి కొట్టుకొచ్చిన బార్జి ఇసుకలో కూరుకుపోయింది. కెరటాల తీవ్రతకు అది కాకినాడ బీచ్కు చేరింది. ప్రత్తిపాడు మండలం ఇ.గోకవరంలో వరదకాలువపై అప్రోచ్వంతెన కూలిపోయింది.
ముగ్గురి మరణం
అనకాపల్లి జిల్లాలో ఎస్.రాయవరం నుంచి ఉప్పరాపల్లికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఎంపీటీసీ సభ్యుడు కాసులుపై కొబ్బరి చెట్టు విరిగిపడటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. అమలాపురం మండలం కామనగరువు ప్రాంతంలోని అప్పన్నపేటలో పూరిల్లు కూలి అందులో నిద్రిస్తున్న రోజు కూలీ వాకపల్లి శ్రీనివాసరావు (43) చనిపోయారు. నెల్లూరు జిల్లా జలదంకి మండలంలో పిడుగుపాటుతో ఒకరు మరణించారు.
వేల ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం
అసని తీవ్రతతో భారీవర్షాలు, అధిక వేగంతో ఈదురుగాలులు వీచాయి. దీంతో వేల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అరటి, బొప్పాయి, కూరగాయల రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. ఆరబెట్టిన ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బాపట్ల ప్రాంతంలో ఉద్యాన పంటలు, మొక్కజొన్న దెబ్బతిన్నాయి. ఏలూరులో గాలుల ధాటికి మూడుచోట్ల విద్యుత్తు ఫీడర్లు దెబ్బతిన్నాయి. కోనసీమ జిల్లాలో ధాన్యానికి మొలకలు వస్తాయనే ఆందోళన రైతుల్లో వ్యక్తమైంది. కృష్ణా జిల్లాలో 900 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా. మామిడి పంటకు పెద్దఎత్తున నష్టం వాటిల్లింది.
కళ్లాల్లో ధాన్యానికి మొలకలు
ఈనాడు-కాకినాడ, ఈనాడు డిజిటల్-రాజమహేంద్రవరం: అసని తుపాను ప్రభావంతో కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో గాలులతోపాటు.. మోస్తరు వర్షాలు కురిశాయి. మూడు జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈదురుగాలులతో పలు మండలాల్లో రెండు రోజులుగా విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. ప్రత్తిపాడు మండలం ఈ.గోకవరంలో వరద కాలువపై అప్రోచ్ వంతెన శిథిలమైంది. ఉప్పాడ కొత్తపల్లి రోడ్డు దెబ్బతినడంతో పోలీసులు చెక్పోస్టులు ఏర్పాటుచేసి ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు. ఇప్పుటికే నూర్పిడి చేసిన 60 శాతం ధాన్యం కళ్లాల్లో ఉండిపోవడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. నీటి చెమ్మతో చాలా కళ్లాల్లో మొలకలు వచ్చాయి. కోనసీమలో అరటి, దొండ పంటలు నేలకొరిగాయి.
ఏలూరు, పశ్చిమలో అలజడి
ఈనాడు డిజిటల్, ఏలూరు: ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో గురువారం ఈదురు గాలులతో కూడిన స్వల్ప వర్షం కురిసింది. అక్కడక్కడా రహదార్లపైన, కల్లాల వద్ద ధాన్యాన్ని ఉంచిన రైతులు వాటిని కాపాడుకునేందుకు నానా తంటాలు పడ్డారు. ఈదురు గాలుల ధాటికి విద్యుత్తు స్తంభాలు అక్కడక్కడా నేలకొరిగాయి. పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. నరసాపురం నియోజకవర్గంలో సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. అలల పోటు ఎక్కువై.. పెదమైనవానిలంక, కేపీˆపాలెం సౌత్లో భూమి కోతకు గురైంది.
విమాన సర్వీసులు రద్దు
గన్నవరం గ్రామీణం, విశాఖపట్నం, న్యూస్టుడే: అసని తుపాను కారణంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా నడిచే పలు విమాన సర్వీసులు బుధవారం రద్దయ్యాయి. రాత్రికి విజయవాడ చేరుకోవాల్సిన దిల్లీ, హైదరాబాద్ సర్వీసులను రద్దుచేసింది. ఇండిగో విమానయాన సంస్థ నడిపే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తిరుపతి, విశాఖపట్నం, రాజమండ్రి, కడప లింక్ సర్వీసులను తాత్కాలికంగా రద్దుచేసింది. మొత్తంగా 16 సర్వీసులు రద్దయినట్లు అధికారవర్గాలు తెలిపాయి. మరోవైపు విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చివెళ్లే విమానాలూ రద్దయ్యాయి. 22 ఇండిగో, 4 ఎయిర్ ఏషియా, 2 ఎయిర్ ఇండియా, కోల్కతా స్పైస్జెట్ విమానం పూర్తిగా రద్దుచేశామని విమానాశ్రయ డైరెక్టర్ కె.శ్రీనివాసరావు పేర్కొన్నారు.
బలహీనపడినా.. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు
అసని బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారినా.. కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. తీరం వెంబడి గంటకు 50-60 కి.మీ వేగంతో గాలులు వీయొచ్చన్నారు. మత్స్యకారులు గురువారం వరకు సముద్రంలో వేటకు వెళ్లొద్దని విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్ అంబేడ్కర్ చెప్పారు. అత్యవసర సహాయానికి 1070, 18004250101 హెల్ప్లైన్ నంబర్లు అందుబాటులో ఉంటాయని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక