Andhra news: గర్భిణుల సాయానికీ డబ్బుల్లేవ్
పేద గర్భిణులకు ఆర్థిక సాయం అందించే ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన (పీఎంఎంవీవై) అమలుకు రాష్ట్ర ప్రభుత్వం మోకాలడ్డుతోంది. దీంతో సుమారు రెండు లక్షల మంది ఆర్థిక సాయం కోసం నెలల
2 లక్షల మంది గర్భిణులకు అందని చేయూత
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కేంద్రం అసహనం
మీ వాటా పెండింగ్ సొమ్ము
చెల్లిస్తేనే నిధులిస్తామని స్పష్టీకరణ
ఈనాడు - అమరావతి
పేద గర్భిణులకు ఆర్థిక సాయం అందించే ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన (పీఎంఎంవీవై) అమలుకు రాష్ట్ర ప్రభుత్వం మోకాలడ్డుతోంది. దీంతో సుమారు రెండు లక్షల మంది ఆర్థిక సాయం కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. ఈ పథకం కింద ఒక్కో గర్భిణికి మూడు దఫాలుగా మొత్తం రూ.5,000 అందిస్తారు. పీఎంఎంవీవై కింద ఏడాదికయ్యే మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో భరించాలి. కేంద్రం నిధులిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా సొమ్ములు చెల్లించడానికి మీనమేషాలు లెక్కిస్తోంది. పెండింగ్లో ఉన్న మీ వాటా సొమ్మంతా చెల్లించండి.. ఆ తర్వాత మా నిధులిచ్చే సంగతి చూస్తామని చెబుతోంది. మరో నెలలో రెండో త్రైమాసికం కూడా ముగియబోతున్నా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడం గమనార్హం.
శ్రద్ధ పెడితే కదా!
తల్లీబిడ్డల సంరక్షణ నిమిత్తం గర్భిణులకు ఆర్థిక సాయం చేసేందుకు కేంద్రం 2016 నుంచి పీఎంఎంవీవై అమలు చేస్తోంది. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి దీనిలో సమస్యలు మొదలయ్యాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరాల్లోని గర్భిణులకూ ఈ పథకం ప్రయోజనం కల్పిస్తామని కేంద్రం ప్రకటించడంతో 2019-20లో లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఆ ఏడాది తొలి మూడు త్రైమాసికాలకు కేంద్రం మొత్తం రూ.101.25 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా రూ.67 కోట్లను ఆ సంవత్సరం ఇవ్వకపోవడంతో కేంద్రం నాలుగో విడత నిధులు విడుదల చేయలేదు. 2021-22లో కొత్త నిబంధనల ప్రకారం దాదాపు 1.91 లక్షల మంది గర్భిణులకు సాయం అందుతుందని అంచనా వేశారు. తొలి త్రైమాసికంలో కేంద్రం రూ.14 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.9 కోట్లు జమ చేయాల్సి ఉంది. రాష్ట్రం ఇవ్వాల్సింది రూ.70 కోట్లకు చేరింది. అవి ఎప్పటికప్పుడు ఇవ్వకపోవడంతో సమస్యలు మొదలయ్యాయి. రాష్ట్రం వాటా సొమ్ములు ఇస్తేనే తాము నిధులు విడుదల చేస్తామంటూ కేంద్రం షరతు విధించింది. ఎట్టకేలకు 2022 మార్చి చివర్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.70 కోట్లు చెల్లించింది. వెంటనే మిగిలిన మొత్తం ఇవ్వాలంటూ కేంద్రానికి లేఖ రాసింది. అప్పటికే ఆర్థిక సంవత్సరం ముగియడంతో కేంద్రం చివర్లో కేవలం రూ.5 కోట్లు మాత్రమే ఇచ్చింది. దాంతో 2021-22 ఆర్థిక సంవత్సరంలో కేంద్రంనుంచి రావాల్సిన మొత్తం నిధులు అందలేదు. 2021-22లో తన వాటాగా చెల్లించాల్సిన రూ.4 కోట్లపై ప్రభుత్వం స్పందించడం లేదు.
కోల్పోయింది రూ. 85 కోట్లు
2019-20 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రం దాదాపు రూ.85 కోట్లు నష్టపోయినట్లు కేంద్ర, రాష్ట్ర ఆర్థిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2019-20లో రూ.37.75 కోట్లు, 2020-21లో రూ.38.30 కోట్లు కేంద్రం నుంచి రాలేదు. ప్రస్తుత (2022-23) ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.14 కోట్లు రావాల్సి ఉండగా ఇప్పటి వరకూ విడుదల కాలేదు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.4 కోట్లు చెల్లించలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరును రెండేళ్లుగా గమనిస్తున్న కేంద్రం ఈ ఏడాది తొలి త్రైమాసికం నిధులు కూడా ఇవ్వను పొమ్మంటోంది.
* ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో కలిపి 15 వేల మంది లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.
* కొందరికి ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాల నిర్వహణ, ఇతర సమస్యల కారణంగా పంపిణీ సకాలంలో జరగడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం