పెట్టుబడుల కోసం ఫిబ్రవరిలో విశాఖలో సదస్సు

రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు మూడేళ్లుగా ఆశించిన స్థాయిలో పెట్టుబడులు రావడం లేదు. దేశవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడులకు సంబంధించి డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌

Published : 09 Aug 2022 04:17 IST

ఈనాడు-అమరావతి: రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు మూడేళ్లుగా ఆశించిన స్థాయిలో పెట్టుబడులు రావడం లేదు. దేశవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడులకు సంబంధించి డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ) నివేదిక దీన్ని స్పష్టం చేస్తోంది. ఈ నివేదిక జూన్‌లో విడుదలైంది. 2020లో దేశవ్యాప్తంగా 1,432 పెట్టుబడుల ఒప్పందాలు కుదరగా.. ఇందులో రాష్ట్రానికి వచ్చింది కేవలం 59 మాత్రమే. అలాగే 2021లో 1,489 పెట్టుబడి ఒప్పందాల్లో రాష్ట్రానికి 47 మాత్రమే వచ్చాయి. 2022 మే వరకు వివిధ సంస్థలతో 475 పెట్టుబడి ఒప్పందాలు కుదిరితే రాష్ట్రానికి దక్కింది 20 మాత్రమే. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడుల సదస్సు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సదస్సును వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశాఖలో నిర్వహించాలని భావిస్తోంది. సదస్సు నిర్వహణతోపాటు ఇందులో పారిశ్రామికవేత్తలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనేలా సహకరించాలని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఇన్వెస్ట్‌ ఇండియా సీఈవోను కలిసి అధికారులు కోరారు. బయటినుంచి వచ్చే పెట్టుబడుల లీడ్స్‌ సమాచారం ఇన్వెస్ట్‌ ఇండియాకు ముందుగా తెలుస్తుంది. ఇక్కడున్న అవకాశాలపై పెట్టుబడిదారులకు వివరించాలని ఇన్వెస్ట్‌ ఇండియాను రాష్ట్రం కోరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని