ఇతర జిల్లాల్లో స్లాట్లు.. దివ్యాంగులకు పాట్లు
దివ్యాంగ ధ్రువీకరణ పత్రం కోసం ప్రత్యేక అవసరాలుగల బాధితులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. పత్రాలు అవసరమైన వారు ముందుగా మీ సేవా కేంద్రాలు లేదా స్థానిక గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి.
ధ్రువీకరణ పత్రాలకు ఎన్ని కష్టాలో..
పర్చూరు, న్యూస్టుడే: దివ్యాంగ ధ్రువీకరణ పత్రం కోసం ప్రత్యేక అవసరాలుగల బాధితులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. పత్రాలు అవసరమైన వారు ముందుగా మీ సేవా కేంద్రాలు లేదా స్థానిక గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇలా అర్జీ చేసుకున్న వారికి గతంలో సమీపంలోని ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకునేలా స్లాట్లు కేటాయించే వారు. కొద్ది కాలంగా ఈ విధానంలో మార్పు చేయడం దివ్యాంగుల పాలిట శాపంగా మారింది. ఆన్లైన్లో రాష్ట్రంలో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ స్లాటు కేటాయిస్తున్నారు. దీనివల్ల దివ్యాంగ ధ్రువీకరణ పత్రం, వైద్య పరీక్షల కోసం జిల్లాలు దాటి ప్రయాణించాల్సి వస్తోంది. మరొకరి సాయం లేనిదే బయటకు రాలేనివారు పత్రాల కోసం మైళ్ల కొద్దీ ప్రయాణించడం ఎంత కష్టమో ఆలోచించకుండా దూర ప్రాంతాల్లో స్లాట్లు కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాపట్ల జిల్లా పర్చూరు సామాజిక ఆసుపత్రిలో బుధవారం నిర్వహించిన సదరం శిబిరానికి 15 మందిని కేటాయించారు. వీరిలో అత్యధికులు ఇతర జిల్లాలకు చెందినవారే కావడం గమనార్హం.
కాళ్లు పనిచేయడంలేదు
ఐదేళ్లుగా కాళ్లు పనిచేయడంలేదు. వీల్ఛైర్ సాయంతో బయటకు వస్తున్నాను. దివ్యాంగ ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోగా పర్చూరు ఆసుపత్రిలో స్లాటు కేటాయించారు. చిలకలూరిపేటలో ప్రభుత్వాసుపత్రి ఉన్నా ఇంత దూరం ఎందుకు కేటాయిస్తున్నారో అర్థం కావడంలేదు.
కరీముల్లా, పురుషోత్తమపట్నం, పల్నాడు జిల్లా
దగ్గరలో ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నా..
పక్షవాతం వచ్చి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. ఆహారం తీసుకోవడం కష్టంగా ఉంది. వీల్ఛైర్లో ఇతరుల సాయంతోనే బయటకు రాగలను. మందులకు డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్నాను. ధ్రువీకరణ పత్రం ఉంటే దివ్యాంగ పింఛను వస్తుందనే ఆశతో దరఖాస్తు చేసుకున్నాను. మా గ్రామానికి దగ్గరలో ప్రభుత్వాసుపత్రులు ఉన్నా పర్చూరులో స్లాటు కేటాయించారు. కుటుంబ సభ్యుల సాయంతో ఇక్కడకు వచ్చాను. నాలాంటి వాళ్లు ఇంతదూరం రావడం ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆలోచించకపోవడం బాధాకరం.
వేల్పూరి వరదమ్మ, వట్టిచెరుకూరు గ్రామం, గుంటూరు జిల్లా
వంద కిలోమీటర్లు ప్రయాణించి
చిన్నతనం నుంచి కాలు, చెయ్యి పనిచేయడంలేదు. దివ్యాంగ ధ్రువీకరణ పత్రం కోసం ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం దక్కలేదు. ఇటీవల మీసేవా కేంద్రం ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోగా బాపట్ల జిల్లా పర్చూరు సామాజిక ఆసుపత్రిలో కేటాయించారు. వంద కిలోమీటర్లు ప్రయాణించి వచ్చాను. నడవలేని స్థితిలో ఉన్న నాకు ఇంత దూరం రావడం ఎంత కష్టంగా ఉందో చెప్పలేను.
పి.శ్రీనివాసరావు, ఓగూరు, కందుకూరు మండలం, నెల్లూరు జిల్లా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది.
తాజా వార్తలు (Latest News)
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక