వరద బాధితులకు నెలలో ఇళ్ల నిర్మాణం
అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాన్ని నెలలో పూర్తి చేసి గుడారాల్లోని వరద బాధితులకు సత్వర ఉపశమనం కలిగిస్తామని అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష హామీనిచ్చారు.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష హామీ
‘ఈనాడు, ఈటీవీ’ కథనాలకు స్పందన
ఈనాడు డిజిటల్, కడప, న్యూస్టుడే, రాజంపేట గ్రామీణ: అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాన్ని నెలలో పూర్తి చేసి గుడారాల్లోని వరద బాధితులకు సత్వర ఉపశమనం కలిగిస్తామని అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష హామీనిచ్చారు. ఇతర మౌలిక సదుపాయాలను యుద్ధప్రాతిపదికన కల్పిస్తామని భరోసానిచ్చారు. శనివారం ‘ఈనాడు, ఈటీవీ’లలో ‘హామీల గట్టుపై కన్నీటి వేదన’ శీర్షికన ప్రచురితమైన, ప్రసారమైన కథనాలపై కలెక్టర్ స్పందించారు. వివిధ ప్రభుత్వ విభాగాధిపతులను వెంటబెట్టుకుని అన్నమయ్య ప్రాజెక్టు వరద బాధిత ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించారు. ముందుగా పులపుత్తూరు గ్రామంలో గుడారాల్లో నివసిస్తున్న బాధితులను పలకరించారు. వారికి అత్యవసరంగా ఇళ్లను నిర్మించి అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందుకు నెల రోజుల గడువునిచ్చారు. బాధితులకు తాగునీటి కోసం మూడు రోజుల్లో వేర్వేరుచోట్ల రెండు నీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. ఇంటింటికి నీటి సౌకర్యం కల్పనకు పైపులైన్ల పనులు వారంలో పూర్తి చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న 58 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలివ్వాలని, విద్యుత్తు లైన్లు, వీధిదీపాల ఏర్పాటు, రెండు శ్మశానవాటికల నిర్మాణం, ఆటస్థలానికి భూకేటాయింపు, ఆలయాల నిర్మాణానికి స్థల గుర్తింపు పనులు వారంలో పూర్తి చేయాలని, వచ్చే శనివారం తాను మరోసారి స్వయంగా పరిశీలిస్తానని అన్నారు. ఇళ్ల నిర్మాణంలో నిర్లక్ష్యం, గుత్తేదారు పనులు నిలిపివేయడంపై గృహనిర్మాణ శాఖ అధికారులపై మండిపడ్డారు. పొలాల్లో పూర్తి స్థాయిలో ఇసుక మేటలు తొలగించి రైతులకు సాగు సౌలభ్యం కల్పించాలని ఆదేశించారు. నిలిచిన రక్షణ గోడల పనులపై అధికారులను నివేదిక కోరారు. పనులన్నీ పూర్తయ్యేవరకు ప్రతివారం వరద బాధిత గ్రామాలను సందర్శిస్తానని కలెక్టరు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గడువిస్తే అధికారులు నిద్రపోతారు
ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణకు 2023 మార్చి 23న జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన తీర్పులోని అంశాలను క్షేత్రస్థాయిలో ఎంత మేరకు అమలు చేశారన్న దానిపై కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జైప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థలు మే 9వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
పింఛన్లపై సర్కారు మరో కుట్ర!
ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ససేమిరా అంది. మండుటెండల్లో పింఛనుదారుల్ని గ్రామ, వార్డు సచివాలయాలకు బలవంతంగా రప్పించేలా గత నెలలో ఎత్తుగడ వేసింది. -
సర్వాధికారాలు ఉన్నా.. నోరు విప్పని జగన్
ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్రానికి ఇప్పటికీ ఆయనే సుప్రీం. పరిపాలన యంత్రాంగం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుని కనుసైగలతో నడిపిస్తున్నారు. -
వడ్డీకాసుల వాడికి ‘వంచన సేవ!’
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా భక్తుల నీరాజనాలందుకునే శ్రీనివాసుడు కొలువైన తిరుమల.. దేశ, విదేశాల్లోని కోట్లాది హిందువులకు పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం..! -
మీ నాన్న విగ్రహ పనులూ నాసిరకమేనా జగన్!
పనుల్లో తన, మన భేదం లేదు.. అంతా నాసిరకంగా చేయడమే ఈ ప్రభుత్వ మార్కు అని నేలకొరిగిన రాజశేఖరరెడ్డి విగ్రహం వెక్కిరిస్తోంది. -
సంక్షిప్త వార్తలు
జీతాలు ఎప్పుడు పడతాయో తెలియట్లేదని చెప్పినందుకు నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కరణం హరికృష్ణను సస్పెండ్ చేయడం సరికాదని రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంకాల కొండయ్య మండిపడ్డారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!