టోకెన్ల కోసం శ్రీవారి భక్తుల నిరసన

శ్రీవారి మెట్టు మార్గంలో దివ్యదర్శనం టోకెన్లు కోటా మేరకు ఇవ్వాలని శనివారం భక్తులు నిరసనకు దిగారు. ఉదయం 10.30 గంటలకు కొందరు భక్తులు శ్రీవారి మెట్టుమార్గంలోని 1240 మెట్టు వద్ద ఉన్న దివ్యదర్శనం టోకెన్ల జారీ కేంద్రానికి చేరుకున్నారు.

Updated : 04 Jun 2023 05:54 IST

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి మెట్టు మార్గంలో దివ్యదర్శనం టోకెన్లు కోటా మేరకు ఇవ్వాలని శనివారం భక్తులు నిరసనకు దిగారు. ఉదయం 10.30 గంటలకు కొందరు భక్తులు శ్రీవారి మెట్టుమార్గంలోని 1240 మెట్టు వద్ద ఉన్న దివ్యదర్శనం టోకెన్ల జారీ కేంద్రానికి చేరుకున్నారు. అప్పటికే శనివారం  టోకెన్ల జారీ పూర్తవడంతో భక్తులు నిరసనకు దిగారు. సాధారణంగా శ్రీవారి మెట్టు మార్గంలో రోజుకు 5 వేల టోకెన్లు జారీ చేస్తారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఇందులో మార్పులు చేస్తుంటారు. అందులో భాగంగా శనివారం శ్రీవారి మెట్టు మార్గంలోని కోటాను 4 వేలకు కుదించారు.

 * శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య భారీగా ఉంది. శనివారం సాయంత్రానికి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా క్యూ లైన్‌ల్లో వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2లోని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. వీరికి దాదాపు 24 గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుందని తితిదే తెలిపింది. శ్రీవారిని శుక్రవారం 76,963 మంది దర్శించుకున్నారు. రూ.2.97 కోట్లు హుండీ కానుకలు లభించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని