రైతుపై బూటకం.. అంతా జగన్నాటకం
వ్యవసాయంపై అపారమైన ప్రేమ ఉన్న ప్రభుత్వం మాది... రైతులపై మమకారం, బాధ్యతతో పథకాలను అమలు చేస్తున్నాం.
ఉచితంగా సూక్ష్మ పోషకాల పంపిణీకి స్వస్తి
అన్నదాతల అభ్యున్నతికి భారీగా నిధులు వెచ్చిస్తున్నామంటూ ఆర్భాట ప్రకటనలు
తెదేపా ప్రభుత్వంలో 100% రాయితీపై అందజేత
వ్యవసాయంపై అపారమైన ప్రేమ ఉన్న ప్రభుత్వం మాది... రైతులపై మమకారం, బాధ్యతతో పథకాలను అమలు చేస్తున్నాం...
ఈ ఏడాది జూన్ 1న కర్నూలు జిల్లా పత్తికొండలో రైతు భరోసా నిధులు విడుదల సందర్భంగా సీఎం జగన్..
మాది రైతుల అభ్యున్నతికి పాటుపడే ప్రభుత్వం అంటూ ముఖ్యమంత్రి జగన్ నుంచి మంత్రులు, అధికార పార్టీకి చెందిన ఇతర ప్రజాప్రతినిధులు తరచూ ప్రకటనలు గుప్పిస్తున్నా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటోంది. భూసార పరీక్షల నుంచి ఇతర అన్ని అంశాల్లోనూ అన్నదాతలకు దన్నుగా నిలవాల్సిన ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టడం లేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతోంది. భూసార పరీక్షలతో పాటు సూక్ష్మ పోషకాల ఉచిత పంపిణీకి కూడా.. జగన్ సర్కారు మంగళం పాడింది. నేలల్లో పోషకాల లోపాన్ని నివారించి నాణ్యమైన పంట దిగుబడులు వచ్చేలా రైతులకు తోడ్పడేందుకు ఏడాదికి రూ.80 కోట్లు కూడా ఇవ్వలేమంటూ ప్రభుత్వం చేతులెత్తేసింది. వివిధ పద్దుల కింద ( రైతుల నుంచి ధాన్యాన్ని కొన్నందుకు ఇచ్చే సొమ్మునూ కలిపేసి) వెచ్చించిన సొమ్మును కలిపేసి తాము అధికారంలోకి వచ్చాక రూ.1.61 లక్షల కోట్లు రైతుల కోసం ఖర్చు చేశామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. రైతుల అవసరాలేమిటి..? వారికి ఎలాంటి సాయం సమకూర్చాలన్న విషయాన్ని మాత్రం జగన్ సర్కారు గుర్తించడం లేదు.
- భూసార పరీక్షల ద్వారా నేలల్లో పోషకాల లోపం తెలుస్తుంది. అందుకు అనుగుణంగా మొక్కలకు సూక్ష్మ పోషకాలను అందిస్తే నాణ్యమైన పంట దిగుబడులు లభిస్తాయి. పంట ఉత్పత్తి కూడా పెరుగుతుంది. రాష్ట్రంలో అధిక శాతం నేలల్లో పోషకాల లోపం ఉందని గతంలో నిర్వహించిన భూసార పరీక్షల్లో వెల్లడైంది. 35-40% నేలల్లో జింకు, 24% నేలల్లో ఇనుము, 5% భూముల్లో మాంగనీసు, 5% నేలల్లో కాపర్, 20% పొలాల్లో బొరాన్, 18-22% నేలల్లో సల్ఫర్ లోపం ఉందని భూసార పరీక్షల్లో గుర్తించారు.
- జిప్సం పంపిణీ ద్వారా వేరుసెనగ ఉత్పత్తి ఎకరాకు 2.20 క్వింటాళ్ల నుంచి 3.46 క్వింటాళ్ల వరకు అధికంగా వచ్చిందని.. వరి, కంది, పొద్దుతిరుగుడులోనూ దిగుబడులు పెరిగాయని ప్రాథమిక అంచనాల్లో గుర్తించినట్లు 2015-16లో వ్యవసాయ శాఖ డైరెక్టర్గా పనిచేసిన కె.ధనుంజయరెడ్డి కేంద్రానికి ఇచ్చిన నివేదికలే వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం ధనుంజయరెడ్డి ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నారు. ఈ హోదాలో ఆయన నాలుగేళ్లుగా ఉన్నా ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి నిలిపేలా చర్యలు చేపట్టలేదు.
- సూక్ష్మ పోషకాల వినియోగం ద్వారా పంట దిగుబడి 8% నుంచి 15% పెరిగిందని 2018-19లో పంట కోత ప్రయోగాల ద్వారా వెల్లడైంది.
తెదేపా హయాంలో 100% రాయితీపై రైతులకు సూక్ష్మ పోషకాలను అందజేశారు. రాష్ట్రంలోని నేలల్లో పోషక లోపాల నివారణకు.. 2014-15 నుంచి మూడేళ్ల పాటు 50% రాయితీపై సూక్ష్మ పోషకాలను పంపిణీ చేశారు. 2017-18 నుంచి ఉచితంగా అందించాలని నిర్ణయించిన అప్పటి తెదేపా ప్రభుత్వం ఈ మేరకు రాయితీని 100% చేసింది. భూసార పరీక్ష కార్డుల ఆధారంగా వీటిని ఉచితంగా అందించారు. దీంతో రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గాయి. అధిక దిగుబడులు లభించాయని నివేదికలు వెల్లడించాయి. సగటున ఒక్కో రైతుకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ప్రయోజనం కలిగింది. చౌడు నేలల పునరుద్ధరణకు రైతులకు హెక్టారుకు రూ.10 వేల నుంచి రూ.17 వేల వరకు ఖర్చు కాగా భూసార పరీక్ష కార్డుల ఆధారంగా ఈ మొత్తాన్ని తెదేపా ప్రభుత్వం ఉచితంగా అందించింది. మొత్తంగా అయిదేళ్లలో సూక్ష్మ పోషకాల పంపిణీకి సుమారు రూ. 400 కోట్లకు పైగా ఖర్చు చేశారు.
రాయితీ కోత.. పంపిణీ నిలిపివేత
రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక 2019-20లో సూక్ష్మ పోషకాల రాయితీని సగానికి తగ్గించారు. అప్పటి వరకు 100% రాయితీపై ఉచితంగా ఇచ్చే సూక్ష్మ పోషకాలను 50% రాయితీపై ఇవ్వాలని నిర్ణయించింది. 2018-19లో మిగిలిన నిల్వలను మాత్రమే అందించారు. మొత్తం 21 వేల టన్నుల పంపిణీకి రూ.8 కోట్ల రాయితీ మాత్రమే ఇచ్చారు. మరుసటి ఏడాది నుంచి ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది.
ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతకు కలెక్టర్ల కమిటీలు
ఎన్జీటీ, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
జూన్ తొలి వారంలో రాష్ట్రానికి ‘నైరుతి’
నైరుతి రుతుపవనాలు జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మే 31 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే ప్రకటించింది. -
సెకితో ‘మిగులు’ భారం రూ.8,291 కోట్లు!
సెకి నుంచి విద్యుత్ కొనుగోలు వల్ల వినియోగదారులపై భారం పడదు. ఆ విద్యుత్తు వ్యవసాయం కోసమే. దీని ఖర్చు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. -
ఫాగింగ్ దూరం.. జ్వరాల జోరు
గ్రామాల్లో దోమల బెడద తీవ్రమై ఏటా ప్రజలు పెద్ద సంఖ్యలో జ్వరాల బారిన పడుతున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 13,716 మలేరియా జ్వరాల కేసులు నమోదయ్యాయి. -
మెరుగుపడని పట్టణ వైద్యం!
రాష్ట్రంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేంద్రాలు పనిచేస్తున్నట్లు చెబుతున్నా.. మధ్యాహ్నం తరువాత చాలాచోట్ల వైద్యులు అందుబాటులో ఉండటంలేదు. -
జగన్మాత సేవలో హైకోర్టు న్యాయమూర్తి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం దర్శించుకున్నారు. -
సీసీఎల్ఏలో అవినీతి ఆరోపణలున్న అధికారులకు అప్రాధాన్య పోస్టులు
రాష్ట్ర భూ పరిపాలనశాఖ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు ఉన్న పలువురు అధికారులను అప్రాధాన్య పోస్టులకు మార్చారు. -
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కార్యాచరణ ప్రణాళిక!
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇటీవల వాతావరణంలో వస్తున్న మార్పులు.. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. -
బీసీ నేతల్ని వైకాపా అణగదొక్కే ప్రయత్నం
జరిగిన ఎన్నికల్లో బీసీలు వైకాపాకు ఓటేయలేదనే అనుమానంతోనే కక్షతో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేశారని.. ఇది బీసీ నేతల్ని రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జి నూకానమ్మ మండిపడ్డారు. -
24న డీఈడీ ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలోని డీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షను ఈనెల 24న నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. -
రోడ్డుపైనే సీపీఆర్.. వందనమమ్మా డాక్టర్ రవళి
చలాకీగా ఆడుతున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలాడు. కన్నా లేవరా అని తల్లిదండ్రులు ఎంతగా పిలిచినా ఉలుకూ పలుకూ లేదు. -
కొల్హాపుర్, శిర్డీల్లో చంద్రబాబు దంపతుల పూజలు
మహారాష్ట్రలోని కొల్హాపుర్లో కొలువైన శ్రీమహాలక్ష్మి, శిర్డీలోని సాయిబాబా ఆలయాలను తెదేపా అధినేత చంద్రబాబు.. సతీమణి భువనేశ్వరితో కలసి గురువారం సందర్శించారు. -
అక్రమ తవ్వకాలు నిజం
ఎన్జీటీ తీర్పునకు విరుద్ధంగా ఆంధప్రదేశ్లో యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. -
మీడియాపై బెదిరింపులు తగవు
మీడియాలో వచ్చే వార్తలపై అభ్యంతరాలుంటే ఖండిచవచ్చని, పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించాయని భావిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని.. ఈ విషయాలు విస్మరించి పాత్రికేయుల పేర్లు చెప్పి మరీ తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం తగదని ప్రజాసంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. -
అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం విఫలం
ఎన్నికల అనంతరం రాష్ట్రంలోని చంద్రగిరి, మాచర్ల, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరుగుతున్న అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ(సీఎఫ్డీ) సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. -
రామతీర్థంలో అతిసారం.. యువతి మృతి
నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం రామతీర్థం గ్రామానికి చెందిన విజయమ్మ (30) వాంతులు, విరేచనాలతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. -
మన చరిత్రేంటో లోకమంతా చూసింది
ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలు రాష్ట్ర ప్రజలకే కాదు.. మన చరిత్ర ఏంటో ప్రపంచానికే చూపామని హైకోర్టు వ్యాఖ్యానించింది. -
కొనకళ్లకు స్వల్ప గుండెపోటు
మాజీ ఎంపీ, కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. గురువారం తెల్లవారు జామున గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ
-
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,365