CM Jagan: సీఎం నోట.. మళ్లీ అదే మాట!
‘‘గోదావరిలో కలిసిపోతున్న లంక భూములను కాపాడడానికి నిధులు మంజూరు చేశాం. ఐ.పోలవరం మండలం ఎదుర్లంక వద్ద లంక భూముల రక్షణకు రూ.79.76 కోట్లతో చేపట్టనున్న రాతి కట్టడం పనులకు శిలాఫలకాన్ని ఆవిష్కరించాం.
గోదావరి లంక భూముల రక్షణకు 44 నెలల క్రితమే హామీ
నేటికీ ప్రారంభంకాని పనులు
రూ.150 కోట్లతో రక్షణ గోడ నిర్మిస్తామంటూ తాజాగా ప్రకటన
మూడున్నరేళ్లు దాటినా పనుల ఊసేలేదు..
‘‘గోదావరిలో కలిసిపోతున్న లంక భూములను కాపాడడానికి నిధులు మంజూరు చేశాం. ఐ.పోలవరం మండలం ఎదుర్లంక వద్ద లంక భూముల రక్షణకు రూ.79.76 కోట్లతో చేపట్టనున్న రాతి కట్టడం పనులకు శిలాఫలకాన్ని ఆవిష్కరించాం...’’
2019 నవంబరు 21న ముమ్మిడివరం మండలం కొమానపల్లిలో నిర్వహించిన జాతీయ మత్స్యకార దినోత్సవ సభలో సీఎం జగన్ వ్యాఖ్యలివి.
- నదీ కోత నివారణకు పోలవరం ఐలాండ్ ప్రాజెక్టు(పీఐపీ) ఏటిగట్టు 9వ కిలోమీటరు నుంచి 11వ కిలోమీటరు మధ్య రూ.79.76 కోట్లతో పిచ్చింగ్ ప్లాట్ఫామ్ల నిర్మాణ పనులకు 44 నెలల క్రితం ఈ సభా ప్రాంగణం నుంచే సీఎం శిలాఫలకం ఆవిష్కరించారు. పనులు మంజూరై టెండర్లు ఖరారైనా నేటికీ ప్రారంభం కాలేదు.
రెండు నెలల్లో పనులు సాధ్యమేనా..?
‘‘గోదావరి పరీవాహక పొట్టింక, రాణేలంక, కూనాలంక, గురజాపులంక, వివేకానంద వారధి ప్రాంతాల్లో కోత నివారణకు 3.5 కి.మీ మేర రక్షణ గోడ నిర్మాణానికి రూ.150 కోట్లు మంజూరు చేస్తున్నా. మరికొన్ని లంక గ్రామాలకు రక్షణ గోడ నిర్మించాల్సి వస్తే అదనంగా మరో రూ.50 కోట్లు అవసరమైనా మంజూరు చేస్తా. పది రోజుల్లో అంచనాలు రూపొందించి.. నెల రోజుల్లో టెండర్లు పిలిచి.. తర్వాత నెలలో పనులు మొదలయ్యేలా చూస్తా...’’
2023 ఆగస్టు 8న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వరద పీడిత ప్రాంతాల పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి హామీ ఇది.
గోదావరి ఉగ్రరూపం దాల్చిన ప్రతిసారీ కళ్లెదుటే భూములు, అందులోని విలువైన పంటలు నదీ గర్భంలో కలిసిపోతుంటే.. నిస్సహాయంగా చూడడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఆ ప్రాంత రైతులది. కోత నివారణ చర్యలపై సర్కారు కాలక్షేపం చేస్తోందని.. మూడున్నరేళ్ల క్రితం ఇచ్చిన హామీకే దిక్కులేదు.. ఇప్పుడు కొత్త హామీని రెండు నెలల్లో ఎలా నిలబెట్టుకుంటారో చూద్దామనే చర్చ కోనసీమ ప్రాంతంలో నడుస్తోంది.
ఈనాడు, కాకినాడ- ముమ్మిడివరం, న్యూస్టుడే: లక్షల ఎకరాలు సస్యశ్యామలం చేస్తున్న.. లక్షల మంది దాహార్తి తీరుస్తున్న గోదారమ్మకు ఆగ్రహం వస్తే వరదల రూపంలో అన్నదాతల కాళ్ల కింద భూమి కరిగిపోతోంది. వరద ఉద్ధృతి పెరిగినప్పుడల్లా లంక భూములు కోతకు గురవుతున్నాయి. మరోవైపు నదిలో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలతో గోదావరి గమనం మారి రైతుల పాలిట శాపంగా మారుతోంది. ఎన్నో ఏళ్లుగా సమస్యను ఎదుర్కొంటున్నా..వేల ఎకరాలు నదీ గర్భంలో కలిసిపోతున్నా పాలకులు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవడం లేదు. వరదల వేళ ఉత్తుత్తి హడావుడి తప్ప.. శాశ్వత పరిష్కారం చూపుతామన్న హామీలు అమలు కావడం లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి లంక గ్రామాల్లో పర్యటన సందర్భంగా అడపాదడపా హామీలిస్తున్నా సమస్యకు పరిష్కారం దొరకడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో లంకా ఆఫ్ ఠాణేలంక, కూనాలంక, గురజాపులంక, సలాదివారిపాలెం, అయినాపురం, కొండుకుదురులంక, పొట్టిలంక, ఎరకల్లంక, కె.గంగవరం, కూళ్ల, శేరులంక, సుందరపల్లి, పి.గన్నవరం, లంకల గన్నవరం, మొండెపులంక, మానేపల్లి, కె.దొడ్డవరం, అప్పనపల్లి, కె.ముంజివరం, ముగ్గళ్ల, కటార్లంక, బొబ్బిల్లంక, వై.కొత్తపల్లి, రామరాజులంక, మేకలవారిపాలెం, ఎదుర్లంక, గుత్తెనదీవి, బూరుగులంక, బెల్లంపూడిలంక, రఘుదేవపురం తదితర ప్రాంతాలను నదీ కోత వేధిస్తోంది. విలువైన లంక భూములు కోతకు గురై రైతులు నష్టపోతున్నారు. ముమ్మిడివరం మండలం కమిని పంచాయతీ పరిధిలోని సలాదివారిపాలెంలో ప్రాథమిక పాఠశాల నదీగర్భంలో కలిసిపోతే పంచాయతీ కార్యాలయంలో తరగతులు నిర్వహిస్తున్నారు. గతంలో ఇక్కడి రామాలయం సైతం గోదావరిలో కలిసిపోయింది.
లంక భూముల్లోని నదీ కోత ప్రాంతాలను 2016లో కేంద్ర బృందం పరిశీలించింది. నివారణ చర్యలకు రూ.811 కోట్లు అవసరమని జలవనరుల శాఖ ప్రతిపాదనలు సమర్పించింది. ఈ పనులకు నేటికీ మోక్షంలేదు. 2020లో గోదావరి నదీకోత పరిశీలనకు ప్రభుత్వం సాంకేతిక సలహా మండలి(టీఏసీ) ఏర్పాటు చేసింది. ఈ కమిటీ లంకల్లో పర్యటించి తక్షణం చేపట్టాల్సిన పనులను గుర్తించి రూ.500 కోట్లకు పైగా ప్రతిపాదనలు పంపింది. వీటిలోనూ కదలిక లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతకు కలెక్టర్ల కమిటీలు
ఎన్జీటీ, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
జూన్ తొలి వారంలో రాష్ట్రానికి ‘నైరుతి’
నైరుతి రుతుపవనాలు జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మే 31 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే ప్రకటించింది. -
సెకితో ‘మిగులు’ భారం రూ.8,291 కోట్లు!
సెకి నుంచి విద్యుత్ కొనుగోలు వల్ల వినియోగదారులపై భారం పడదు. ఆ విద్యుత్తు వ్యవసాయం కోసమే. దీని ఖర్చు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. -
ఫాగింగ్ దూరం.. జ్వరాల జోరు
గ్రామాల్లో దోమల బెడద తీవ్రమై ఏటా ప్రజలు పెద్ద సంఖ్యలో జ్వరాల బారిన పడుతున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 13,716 మలేరియా జ్వరాల కేసులు నమోదయ్యాయి. -
మెరుగుపడని పట్టణ వైద్యం!
రాష్ట్రంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేంద్రాలు పనిచేస్తున్నట్లు చెబుతున్నా.. మధ్యాహ్నం తరువాత చాలాచోట్ల వైద్యులు అందుబాటులో ఉండటంలేదు. -
జగన్మాత సేవలో హైకోర్టు న్యాయమూర్తి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం దర్శించుకున్నారు. -
సీసీఎల్ఏలో అవినీతి ఆరోపణలున్న అధికారులకు అప్రాధాన్య పోస్టులు
రాష్ట్ర భూ పరిపాలనశాఖ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు ఉన్న పలువురు అధికారులను అప్రాధాన్య పోస్టులకు మార్చారు. -
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కార్యాచరణ ప్రణాళిక!
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇటీవల వాతావరణంలో వస్తున్న మార్పులు.. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. -
బీసీ నేతల్ని వైకాపా అణగదొక్కే ప్రయత్నం
జరిగిన ఎన్నికల్లో బీసీలు వైకాపాకు ఓటేయలేదనే అనుమానంతోనే కక్షతో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేశారని.. ఇది బీసీ నేతల్ని రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జి నూకానమ్మ మండిపడ్డారు. -
24న డీఈడీ ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలోని డీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షను ఈనెల 24న నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. -
రోడ్డుపైనే సీపీఆర్.. వందనమమ్మా డాక్టర్ రవళి
చలాకీగా ఆడుతున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలాడు. కన్నా లేవరా అని తల్లిదండ్రులు ఎంతగా పిలిచినా ఉలుకూ పలుకూ లేదు. -
కొల్హాపుర్, శిర్డీల్లో చంద్రబాబు దంపతుల పూజలు
మహారాష్ట్రలోని కొల్హాపుర్లో కొలువైన శ్రీమహాలక్ష్మి, శిర్డీలోని సాయిబాబా ఆలయాలను తెదేపా అధినేత చంద్రబాబు.. సతీమణి భువనేశ్వరితో కలసి గురువారం సందర్శించారు. -
అక్రమ తవ్వకాలు నిజం
ఎన్జీటీ తీర్పునకు విరుద్ధంగా ఆంధప్రదేశ్లో యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. -
మీడియాపై బెదిరింపులు తగవు
మీడియాలో వచ్చే వార్తలపై అభ్యంతరాలుంటే ఖండిచవచ్చని, పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించాయని భావిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని.. ఈ విషయాలు విస్మరించి పాత్రికేయుల పేర్లు చెప్పి మరీ తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం తగదని ప్రజాసంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. -
అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం విఫలం
ఎన్నికల అనంతరం రాష్ట్రంలోని చంద్రగిరి, మాచర్ల, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరుగుతున్న అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ(సీఎఫ్డీ) సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. -
రామతీర్థంలో అతిసారం.. యువతి మృతి
నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం రామతీర్థం గ్రామానికి చెందిన విజయమ్మ (30) వాంతులు, విరేచనాలతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. -
మన చరిత్రేంటో లోకమంతా చూసింది
ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలు రాష్ట్ర ప్రజలకే కాదు.. మన చరిత్ర ఏంటో ప్రపంచానికే చూపామని హైకోర్టు వ్యాఖ్యానించింది. -
కొనకళ్లకు స్వల్ప గుండెపోటు
మాజీ ఎంపీ, కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. గురువారం తెల్లవారు జామున గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ
-
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,365