ఆశ.. దోశ.. క్రమబద్ధీకరణ!
అధికారంలోకి రాగానే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానని ప్రతిపక్ష నేతగా జగన్ హామీ ఇవ్వడంతో వారంతా ఆశపడ్డారు.
ఒప్పంద ఉద్యోగుల విషయంలో మాట తప్పిన జగన్
నిబంధనల పేరుతో 10 వేల మందికే అవకాశం
40 వేల మందికి మొండిచేయి
అప్పుడు అలా..
మేం అధికారంలోకి రాగానే అన్ని ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు, విద్యార్హతలను పరిగణనలోకి తీసుకుంటాం. వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇస్తున్నా.
ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా జగన్
ఇప్పుడు ఇలా..
అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమబద్ధీకరించే కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, ప్రాజెక్టులు, విశ్వవిద్యాలయాల్లో కలిపి 50 వేల వరకు ఒప్పంద ఉద్యోగులు ఉండగా, కేవలం 10,117 మందిని మాత్రమే రెగ్యులరైజ్ చేసేందుకు పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఎన్నికలకు ముందు ప్రతి సభలోనూ హామీలతో ఊదరగొట్టిన జగన్ ఇప్పుడు గడువులు విధిస్తున్నారు. క్రమబద్ధీకరణలోకి ఆ విభాగం రాదు.. ఈ ప్రాజెక్టు రాదంటూ సంఖ్యను కుదించేస్తున్నారు. ఏకంగా 40 వేల ఒప్పంద ఉద్యోగులకు మొండిచేయి చూపేందుకు సిద్ధమయ్యారు.
ఈనాడు, అమరావతి: అధికారంలోకి రాగానే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానని ప్రతిపక్ష నేతగా జగన్ హామీ ఇవ్వడంతో వారంతా ఆశపడ్డారు. ఆ సమయంలో ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, ప్రాజెక్టులు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ శాఖలని విడివిడిగా చెప్పలేదు. ఇప్పుడు ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న వారినే క్రమబద్ధీకరిస్తామంటూ జగన్ మాట మార్చి, మడమ తిప్పేశారు. ప్రస్తుతం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అనేక నిబంధనలు పెడుతూ.. సగం మందికి కూడా న్యాయం చేయడం లేదు. మంత్రివర్గం మొదట తీసుకున్న నిర్ణయం ప్రకారం 2014 జూన్ 2 నాటికి అయిదేళ్లు పూర్తి చేస్తున్న వారు 6,666 మంది ఉన్నారు. అయిదేళ్ల నిబంధనను ఎత్తివేయడంతో మరో 3,451 మంది మాత్రమే అదనంగా వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల ముందు జగన్ హామీ ఇచ్చినట్లుగా అందరినీ క్రమబద్ధీకరించాలని ఒప్పంద ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, ప్రాజెక్టులు, విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న వారినీ రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నారు. వర్సిటీల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులు ఇప్పటికే ఆందోళనకు సిద్ధమయ్యారు. వీరికి ఉద్యోగ భద్రత కల్పించకుండా వర్సిటీల్లో నియామకాలు చేపట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
అందరిలో కొందరికేనా?
ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనల కారణంగా 10,117 మంది కాంట్రాక్టు ఉద్యోగులు మాత్రమే క్రమబద్ధీకరణకు అర్హత పొందుతారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్, రిజర్వేషన్ రోస్టర్లను అమలు చేస్తే ఈ సంఖ్య మరింత తగ్గిపోతుంది. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులు మొత్తం 20,079 మంది ఉన్నారు. వీరిని సైతం పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఆర్థిక శాఖ అనుమతి పొంది, మంజూరైన పోస్టుల్లో పనిచేస్తూ ఉండాలని, ప్రకటన ద్వారా నియమితులై ఉండాలని నిబంధనలు తీసుకొచ్చారు. ఎన్నికల ముందు ఇవేవీ చెప్పనప్పుడు.. ఇప్పుడు ఈ నిబంధనలు ఎందుకు? ఓట్ల కోసం హామీలు గుప్పించి ఇప్పుడు కొంతమందినే క్రమబద్ధీకరించి.. దాన్నే గొప్పగా చెప్పేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో హామీ ప్రకారం 50 వేల మందిని క్రమబద్ధీకరించాలని ఒప్పంద ఉద్యోగులు కోరుతున్నారు.
- సమగ్ర శిక్ష అభియాన్ పరిధి కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లోనే సుమారు 4,594 మంది పని చేస్తున్నారు. వీరు కాకుండా ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్లు, సీఆర్టీలు, ప్రత్యేక విద్య టీచర్లు, బోధనేతర సిబ్బంది కలిపి మరో 6 వేల మంది వరకు ఉన్నారు.
- జాతీయ ఆరోగ్య మిషన్లో 15 వేలు, కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాల్లో కలిపి సుమారు 18 వేల మంది వరకు ఉన్నారు. విశ్వవిద్యాలయాల్లో ఒప్పంద అధ్యాపక పోస్టులను క్రమబద్ధీకరిస్తామని సీఎం జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఇప్పుడు వీరి ప్రస్తావన లేకుండా పోయింది.
- ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న ఒప్పంద అధ్యాపకులు రాష్ట్ర వ్యాప్తంగా 3,618 మంది ఉన్నారు. వీరు కాకుండా మినిమం టైం స్కేల్తో పని చేస్తున్న వారు 264 మంది ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతకు కలెక్టర్ల కమిటీలు
ఎన్జీటీ, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
జూన్ తొలి వారంలో రాష్ట్రానికి ‘నైరుతి’
నైరుతి రుతుపవనాలు జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మే 31 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే ప్రకటించింది. -
సెకితో ‘మిగులు’ భారం రూ.8,291 కోట్లు!
సెకి నుంచి విద్యుత్ కొనుగోలు వల్ల వినియోగదారులపై భారం పడదు. ఆ విద్యుత్తు వ్యవసాయం కోసమే. దీని ఖర్చు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. -
ఫాగింగ్ దూరం.. జ్వరాల జోరు
గ్రామాల్లో దోమల బెడద తీవ్రమై ఏటా ప్రజలు పెద్ద సంఖ్యలో జ్వరాల బారిన పడుతున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 13,716 మలేరియా జ్వరాల కేసులు నమోదయ్యాయి. -
మెరుగుపడని పట్టణ వైద్యం!
రాష్ట్రంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేంద్రాలు పనిచేస్తున్నట్లు చెబుతున్నా.. మధ్యాహ్నం తరువాత చాలాచోట్ల వైద్యులు అందుబాటులో ఉండటంలేదు. -
జగన్మాత సేవలో హైకోర్టు న్యాయమూర్తి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం దర్శించుకున్నారు. -
సీసీఎల్ఏలో అవినీతి ఆరోపణలున్న అధికారులకు అప్రాధాన్య పోస్టులు
రాష్ట్ర భూ పరిపాలనశాఖ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు ఉన్న పలువురు అధికారులను అప్రాధాన్య పోస్టులకు మార్చారు. -
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కార్యాచరణ ప్రణాళిక!
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇటీవల వాతావరణంలో వస్తున్న మార్పులు.. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. -
బీసీ నేతల్ని వైకాపా అణగదొక్కే ప్రయత్నం
జరిగిన ఎన్నికల్లో బీసీలు వైకాపాకు ఓటేయలేదనే అనుమానంతోనే కక్షతో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేశారని.. ఇది బీసీ నేతల్ని రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జి నూకానమ్మ మండిపడ్డారు. -
24న డీఈడీ ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలోని డీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షను ఈనెల 24న నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. -
రోడ్డుపైనే సీపీఆర్.. వందనమమ్మా డాక్టర్ రవళి
చలాకీగా ఆడుతున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలాడు. కన్నా లేవరా అని తల్లిదండ్రులు ఎంతగా పిలిచినా ఉలుకూ పలుకూ లేదు. -
కొల్హాపుర్, శిర్డీల్లో చంద్రబాబు దంపతుల పూజలు
మహారాష్ట్రలోని కొల్హాపుర్లో కొలువైన శ్రీమహాలక్ష్మి, శిర్డీలోని సాయిబాబా ఆలయాలను తెదేపా అధినేత చంద్రబాబు.. సతీమణి భువనేశ్వరితో కలసి గురువారం సందర్శించారు. -
అక్రమ తవ్వకాలు నిజం
ఎన్జీటీ తీర్పునకు విరుద్ధంగా ఆంధప్రదేశ్లో యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. -
మీడియాపై బెదిరింపులు తగవు
మీడియాలో వచ్చే వార్తలపై అభ్యంతరాలుంటే ఖండిచవచ్చని, పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించాయని భావిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని.. ఈ విషయాలు విస్మరించి పాత్రికేయుల పేర్లు చెప్పి మరీ తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం తగదని ప్రజాసంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. -
అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం విఫలం
ఎన్నికల అనంతరం రాష్ట్రంలోని చంద్రగిరి, మాచర్ల, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరుగుతున్న అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ(సీఎఫ్డీ) సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. -
రామతీర్థంలో అతిసారం.. యువతి మృతి
నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం రామతీర్థం గ్రామానికి చెందిన విజయమ్మ (30) వాంతులు, విరేచనాలతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. -
మన చరిత్రేంటో లోకమంతా చూసింది
ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలు రాష్ట్ర ప్రజలకే కాదు.. మన చరిత్ర ఏంటో ప్రపంచానికే చూపామని హైకోర్టు వ్యాఖ్యానించింది. -
కొనకళ్లకు స్వల్ప గుండెపోటు
మాజీ ఎంపీ, కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. గురువారం తెల్లవారు జామున గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ
-
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,365