YSRCP: సచివాలయమా? వైకాపా కార్యాలయమా?

వైకాపా ప్రభుత్వంలో పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు తేడా ఏమీ ఉండటం లేదు. ముఖ్యంగా ఇటీవల చేపట్టిన ‘ఏపీకి జగన్‌ ఎందుకు కావాలి’ అనే కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులూ పాల్గొంటున్నారు.

Updated : 23 Nov 2023 07:40 IST

పెనుకొండ పట్టణం, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వంలో పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు తేడా ఏమీ ఉండటం లేదు. ముఖ్యంగా ఇటీవల చేపట్టిన ‘ఏపీకి జగన్‌ ఎందుకు కావాలి’ అనే కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులూ పాల్గొంటున్నారు. బుధవారం శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండలోని అయిదో వార్డు సచివాలయంలో ఒక అడుగు ముందుకేసి ఏకంగా సచివాలయ ఆవరణలో పార్టీ జెండా ఎగురవేశారు. నగర పంచాయతీ ఛైర్మన్‌ ఉమర్‌ఫరూక్‌ఖాన్‌ జెండా ఎగురవేసి, అదే భవనంలో సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రచార బోర్డులు ఆవిష్కరించారు. ఇందులో వాలంటీర్లూ పాల్గొన్నారు. ఇది చూసిన స్థానికులు అసలు అది ప్రభుత్వ కార్యాలయమా..? వైకాపా ఆఫీసా అని చర్చించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని