Viveka Murder Case: ‘వేధించేందుకే కృష్ణారెడ్డి తప్పుడు ఫిర్యాదు’
పులివెందుల పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ దివంగత మాజీమంత్రి వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పులివెందుల పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయండి
హైకోర్టును ఆశ్రయించిన వివేకా కుమార్తె, అల్లుడు
ఈనాడు, అమరావతి: పులివెందుల పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ దివంగత మాజీమంత్రి వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసులో తదుపరి చర్యలను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. వివేకా పీఏ ఎం.వెంకటకృష్ణారెడ్డి, హైకోర్టు పీపీని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో కొందరు తనను బెదిరిస్తున్నారనే ఆరోపణతో మృతుని పీఏ కృష్ణారెడ్డి 2021 డిసెంబర్లో పులివెందుల కోర్టులో పిటిషన్ వేశారు. పులివెందులకు చెందిన కొందరు నాయకుల ప్రమేయం ఉన్నట్టు సాక్ష్యం చెప్పాలని సీబీఐ ఎస్పీ రాంసింగ్.. సీబీఐ అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి ఒత్తిడి చేశారని ఆయన ఆరోపించారు. 2023 డిసెంబర్ 8న కృష్ణారెడ్డి ఫిర్యాదుపై పులివెందుల కోర్టు విచారణ జరిపింది. కేసు నమోదు చేసి జనవరి 4న తుది నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. దీంతో పులివెందుల పోలీసులు సునీత, రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రాంసింగ్పై కేసు నమోదు చేశారు. తాజాగా అభియోగ పత్రం దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఒత్తిడి చేయలేదు..
తాము ఎలాంటి నేరానికి పాల్పడలేదని, తమను వేధించడానికే తప్పుడు కేసు నమోదు చేశారని పిటిషనర్లు పేర్కొన్నారు. కృష్ణారెడ్డి ఆరోపిస్తున్నట్లు సీబీఐ కోరిన విధంగా సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి చేయలేదన్నారు. ఫిర్యాదుదారుడి నుంచి ప్రమాణపూర్వక వాంగ్మూలం నమోదు చేయకుండానే పులివెందుల కోర్టు.. ఫిర్యాదును పోలీసులకు పంపిందన్నారు. సంబంధిత మెజిస్ట్రేట్ యాంత్రికంగా ఉత్తర్వులు జారీచేశారన్నారు. ఫిర్యాదును పోలీసులకు పంపడం చెల్లుబాటు కాదన్నారు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ఆరోపణలు తమకు వర్తించవన్నారు. కోర్టులో వేసిన ప్రైవేట్ కంప్లైంట్, ఎస్పీ ముందు ఫిర్యాదుదారుడు పేర్కొన్న విషయాలేవీ తాము నేరానికి పాల్పడినట్లు కనిపించడం లేదన్నారు. తాము నేరానికి పాల్పడ్డామనేందుకు ఏవిధమైన కారణాలను పేర్కొనకుండా ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని పోలీసులకు ఫిర్యాదును పంపడం చట్టవిరుద్ధమన్నారు.
వివేకా హత్యకు గురైనప్పుడు ఫిర్యాదుదారు అక్కడ ఉన్నారన్నారు. సీబీఐ దాఖలు చేసిన తుది అభియోగపత్రంలో.. హత్య విషయంలో కృష్ణారెడ్డి జోక్యం ఉన్నట్లు స్పష్టంగా సందేహం వ్యక్తం చేసిందన్నారు. తమపై పగతో స్థానికుల ప్రమేయంతో తప్పుడు ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారన్నారు. దర్యాప్తు సంస్థను, మృతుడి కుటుంబ సభ్యులను వేధించాలన్న లక్ష్యంతో గజ్జెల ఉదయ్కుమార్రెడ్డి, తులశమ్మ(అయిదవ నిందితుడు శివశంకర్రెడ్డి భార్య) స్థానిక కోర్టులలో ప్రైవేటు ఫిర్యాదులు దాఖలు చేశారని గుర్తుచేశారు. సీబీఐ దర్యాప్తు అధికారిపై గతంలో ఓ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా వివేకా హత్య కేసు విచారణను ఏపీ కోర్టు పరిధి నుంచి.. సుప్రీంకోర్టు తెలంగాణకు బదిలీ చేయడానికి ఓ కారణం అన్నారు. 2023 జూన్ 30న సీబీఐ దాఖలు చేసిన అభియోగపత్రంలో ప్రస్తుత ఫిర్యాదుదారుడు ఎం. కృష్ణారెడ్డిని అనుమానితుడిగా పేర్కొంటూ కారణాలను వెల్లడించిందన్నారు. వివేకా హత్య కేసులో నిష్పాక్షిక విచారణ కోసం కేసును ఏపీ నుంచి తెలంగాణకు సుప్రీంకోర్టు బదిలీ చేసిందనే విషయాన్ని పులివెందుల కోర్టు పరిగణనలోకి తీసుకొని ఉండాల్సిందన్నారు. తమ విషయంలో ఎలాంటి ఆరోపణలు లేనందున పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు చెల్లుబాటుకావన్నారు. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్తో పాటు తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని కోరారు.
జమ్మలమడుగు కోర్టుకు సీబీఐ అధికారులు
జమ్మలమడుగు, న్యూస్టుడే: మాజీమంత్రి వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు శనివారం వైయస్ఆర్ జిల్లా జమ్మలమడుగు కోర్టుకు వచ్చారు. గతంలో పనిచేసిన సీబీఐ ఎస్పీ రాంసింగ్, వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డిపై ఈ నెల 28న పులివెందుల పోలీసులు ఛార్జిషీట్ నమోదు చేశారు. ఆయన హత్య కేసుకు సంబంధించి విచారణ సక్రమంగా జరపలేదని.. ఆయన కుమార్తె, అల్లుడు చెప్పినట్టే సీబీఐ అధికారి వ్యవహరించారని వివేకా పీఏ కృష్ణారెడ్డి గతంలో పులివెందుల కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఛార్జిషీట్ నమోదు చేయగా.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఆయా కాపీలను మెమో ద్వారా జమ్మలమడుగు జూనియర్ సివిల్ జడ్జి భార్గవికి న్యాయవాదిచే సీబీఐ అధికారి ఖాలిబాబు సమర్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ నేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా