Vizag: ఫ్లోటింగ్ బ్రిడ్జి.. ఎత్తిపోయినట్లేనా..!
పర్యాటక పరంగా విశాఖలో ఏదో ఒకటి ఏర్పాటు చేస్తామని వైకాపా నేతలు కొన్ని రోజులుగా నగర ప్రజలను ఊరించారు.
విశాఖ తీరంలో ముప్పుతిప్పలు పెడుతున్న తేలియాడే వంతెన
తరచూ విడిపోతున్న డబ్బాలు
అధికారులు, నేతల అత్యుత్సాహంపై విమర్శలు
ఈనాడు, విశాఖపట్నం: పర్యాటక పరంగా విశాఖలో ఏదో ఒకటి ఏర్పాటు చేస్తామని వైకాపా నేతలు కొన్ని రోజులుగా నగర ప్రజలను ఊరించారు. తీరా ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఏమీ చేయాలో తెలియక.. హడావుడి చేశారు. ఈ పరిస్థితిలోనే ‘ఫ్లోటింగ్ వంతెన’ను తెరమీదికి తెచ్చారు. కడలి పరిస్థితి తెలుసుకోకుండా, కనీస ఆలోచన చేయకుండా సముద్రంలో ‘టీ’ ఆకారంలో తేలియాడే వంతెనను ఏర్పాటు చేశారు. గత నెల 25న బ్రిడ్జి ప్రారంభిస్తే.. ఒక్క రోజులోనే రెండు ముక్కలైంది. ఇది చూసి పర్యాటకులు ఆందోళనకు గురయ్యారు. అప్పటి నుంచి పాలకులు, అధికారులు వంతెనను తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు యత్నించి, విఫలమవుతూనే ఉన్నారు. వంతెన గురించి వైకాపా నేతలు ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో డప్పు కొట్టుకోవడంతో.. అదేంటో చూడాలని పర్యాటకులు నిత్యం వస్తున్నారు. కానీ, అక్కడున్న అలల తీవ్రత, అంతెత్తున ఎగిసిపడుతున్న వంతెనను చూసి భయపడి వెనుదిరుగుతున్నారు. వారం రోజుల్లోనే పలుమార్లు తెగిపోవడంతో ఇప్పటికీ పూర్తిస్థాయిలో అనుసంధానం, పరిశీలన చేయలేకపోయారు. దీంతో ఒక్కరినీ దానిపైకి అనుమతించలేదు. వైకాపా నేతలను ప్రసన్నం చేసుకోవడానికే కెరటాల తీవ్రతపై ఓ అంచనాకు రాకుండా అధికారులు వంతెన ఏర్పాటు చేశారని విమర్శలొస్తున్నాయి.
వసూళ్ల లెక్కలేశారు.. అధ్యయనం మరిచారు
ఈ ప్రాజెక్టును ఓ సంస్థకు వీఎంఆర్డీఏ అప్పగించింది. రూ.1.60 కోట్ల పెట్టుబడి ఆ సంస్థ పెట్టుకోగా... ఏటా వీఎంఆర్డీఏకు రూ.15 లక్షలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ప్రాజెక్టు ప్రారంభమైతే పెద్దలకు రూ.100, పిల్లలకు రూ.70 వసూలు చేయాలనుకున్నారు. ఒకే సమయంలో 200 మంది సందర్శించేలా ప్రణాళిక వేశారు. వసూళ్లు, లెక్కలపై ముందే ఓ నిర్ణయానికి వచ్చిన అధికారులు.. అక్కడి కడలి పరిస్థితిపై ఎందుకు అధ్యయనం చేయలేదని పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు. ఆదిలోనే చుక్కలు చూపిస్తున్న వంతెన అసలు అందుబాటులోకి వస్తుందా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
వైఫల్యం 1: ఫ్లోటింగ్ బ్రిడ్జిని తొలుత తెన్నేటి పార్క్ వద్ద వీఎంఆర్డీఏ నిర్వహించాలనుకుంది. కొన్ని ఏర్పాట్లూ చేసింది. ఇంతలో అటవీశాఖ నిబంధనలు పాటించాలనడంతో అక్కడ విరమించుకుంది. రుషికొండ సమీపంలో పరిశీలించింది. ఆ బీచ్కూ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఉంది. ఏవైనా ప్రమాదాలు జరిగితే ఆ గుర్తింపూ రద్దవుతుందని భావించి అక్కడా వద్దనుకుంది. ఇంతలో వైకాపా నేతల హడావుడి చూసి ఆర్కే బీచ్ సరైందని ఎంపిక చేసింది. అక్కడ ఈత ప్రమాదకరమని జీవీఎంసీ హెచ్చరిక బోర్డులు పెట్టినా పట్టించుకోలేదు.
వైఫల్యం 2: గోవా, ముంబయి, కేరళలో అరేబియా సముద్రం మే, జూన్, జులై, ఆగస్టులో ప్రమాదకరంగా, మిగిలిన రోజుల్లో ప్రశాంతంగా ఉంటుంది. తూర్పు తీరంలో మాత్రం ఏడాదంతా ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. సముద్ర అధ్యయనవేత్తల పరిశీలనతోనే ఈ స్థలం ఎంపిక చేశామంటున్నప్పటికీ జాతీయ సముద్ర పరిశోధన సంస్థ నిపుణులు మాత్రం ఈ ప్రాంతం నిత్యం అలజడితో ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
అన్నం ముద్దపైనా అక్కసే!
అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టుగా.. విపక్షాలపైన తనకున్న ఉక్రోషాన్ని.. నిర్భాగ్యులమీద చూపారు జగన్... గత తెదేపా ప్రభుత్వం తెచ్చిన అన్న క్యాంటీన్లను వచ్చీరాగానే మూసేయించారు... రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఆ క్యాంటీన్లు.. రోజూ వేల మంది క్షుద్భాద తీర్చేవి. దీనిపై విమర్శలు పెరిగాక.. ‘ఆహా’ క్యాంటీన్లు తెచ్చినా... జగన్ పాలనలానే.. దిక్కూదివానం లేనట్లుంది వాటి పరిస్థితి. -
‘అన్నపూర్ణ’ అప్పుల కుప్ప
అద్భుత రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి... 70 శాతం పూర్తయిన పోలవరం... ఆశతో దూసుకొచ్చిన వందలాది ఐటీ పరిశ్రమలతో... ... కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన బిడ్డలా... ఐదేళ్ల కిందట జగన్ చేతికొచ్చింది ఆంధ్రావని! -
‘భీమ్లీ’ ఖల్ నాయక్!
‘‘నాయక్ నహీ.. ఖల్ నాయక్ మై హూ..!’’ అంటూ ఆయన చేసే హడావుడి అంతాఇంతా కాదు. ‘‘ఏం చేస్తున్నావ్? యూనిఫామ్ తీసేయ్..!’’ అంటూ పోలీసులపైనే రుసరుసలాడతారు. -
అంతా.. ఆ ఏడు చేపలకే!
వడ్డించే వాడు జగన్ అయితే... కేటాయింపులు ఇలాగే ఉంటాయి మరి. తన తండ్రి హయాంలోనే కంపెనీలతో రూ.లక్షల కోట్ల ‘క్విడ్ప్రోకో’ లావాదేవీలకు తెరతీసిన ఆయన... తాను గద్దెనెక్కాక ‘గంపగుత్త’ సూత్రాన్ని అనుసరించారు. -
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
జగన్ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులపై 1,500కుపైగా కేసులు పెట్టారని, చివరికి ధర్నా చేశారంటూ 80ఏళ్ల వయసుపైబడిన పెన్షనర్లపైనా కేసులు నమోదు చేశారని అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
నూతన నేర న్యాయ చట్టాలపై పరిజ్ఞానం పెంచుకోవాలి
ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో వాటిపై పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి, ఏపీ జ్యుడిషియల్ అకాడమీ అధ్యక్షుడు జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్