Ukraine Crisis: రష్యాకు ఇప్పటికీ గగనమే!
ఆధునిక యుద్ధంలో శత్రు గగనతలాన్ని త్వరగా నియంత్రణలోకి తెచ్చుకోవడం చాలా కీలకం. లేకుంటే పైచేయి సాధించడం కష్టం. గగనతల దాడుల విషయంలో రష్యా వ్యూహం అనుకున్న స్థాయిలో సఫలం
ఉక్రెయిన్ నింగిపై పట్టు సాధించలేక ఆపసోపాలు
యుద్ధ మందగమనానికి ఇదే కారణం?
ఆధునిక యుద్ధంలో శత్రు గగనతలాన్ని త్వరగా నియంత్రణలోకి తెచ్చుకోవడం చాలా కీలకం. లేకుంటే పైచేయి సాధించడం కష్టం. గగనతల దాడుల విషయంలో రష్యా వ్యూహం అనుకున్న స్థాయిలో సఫలం కాలేదని, ఉక్రెయిన్పై వైమానిక దాడుల్లో ఊహించినంత పురోగతి లేదని విశ్లేషకులు చెబుతున్నారు.
ఒక దేశంపైకి దండెత్తే సైన్యం.. మొదట అక్కడి వైమానిక, క్షిపణి రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తుంది. దీనివల్ల శత్రు గగనతలంపై వారికి పూర్తి పట్టువస్తుంది. భూతల బలగాలు మరింత సమర్థంగా పోరాటం సాగించడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఉక్రెయిన్ యుద్ధం మొదలుకాగానే రష్యా తన ఎలక్ట్రానిక్ వార్ఫేర్, సైబర్ యుద్ధ సామర్థ్యాన్ని ప్రయోగించి ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థ, సైనిక కమ్యూనికేషన్లను నిర్వీర్యం చేస్తుందని అమెరికా సైనికాధికారులు భావించారు. కానీ, అది జరగలేదు.
ఎందుకు?
ఉక్రెయిన్ సైన్యం త్వరగా చేతులెత్తేస్తుందని, రాజధాని కీవ్ వేగంగా తమ వశమవుతుందని, అదే ఊపుతో తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో ఉక్రెయిన్ బలగాలను మట్టి కరిపించొచ్చని పుతిన్ భావించి ఉంటారని సైనిక నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ప్రత్యర్థి గగనతలంపై ఆధిపత్యం సాధించాల్సిన అవసరం ఉండదని ఆయన లెక్కలు కట్టినట్లు వారు విశ్లేషిస్తున్నారు. ఈ అంచనాలతోనే ఆయన యుద్ధ వ్యూహాన్ని రచించినట్లు చెబుతున్నారు. అయితే ఆచరణలో అది విఫలమైంది. రష్యా సైనిక చర్య మొదలై ఆరు రోజులు గడిచింది. అయినా ఉక్రెయిన్లో ఒక్క ప్రధాన నగరాన్ని కూడా పుతిన్ సేన స్వాధీనం చేసుకోలేకపోయింది.
ఉక్రెయిన్ యుక్తి
ఉక్రెయిన్ ఆక్రమణకు పుతిన్ ఆదేశాలివ్వగానే క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో రష్యా సైన్యం విరుచుకుపడింది. అనేక రాడార్లు, వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే ఎస్-300 పి వంటి వ్యవస్థలనూ నాశనం చేసింది. అయితే ఉక్రెయిన్ తెలివిగా వ్యవహరిస్తూ తన వైమానిక శక్తిని, క్షిపణి రక్షణ వ్యవస్థలను రక్షించుకుంది. ఫలితంగా అలాగే ఆ దేశ యుద్ధవిమానాలు, హెలికాప్టర్లలో అనేకం ఇప్పటికీ వినియోగ స్థితిలోనే ఉన్నాయి.
ఆధునిక యుద్ధవిమానాలెక్కడ?
ఉక్రెయిన్ వైమానిక స్థావరాలపై తొలుత క్షిపణులతో దాడి చేసిన రష్యా.. ఆ తర్వాత సుఖోయ్-34 వంటి ఆధునిక యుద్ధవిమానాలను పెద్ద సంఖ్యలో రంగంలోకి దించుతుందని అందరూ అంచనావేశారు. అవి ప్రత్యర్థి వాయుసేనకు మరింత నష్టం కలిగించి,
అక్కడి గగనతలంపై పుతిన్ సేనకు పూర్తి ఆధిపత్యాన్ని సంపాదించిపెడతాయని భావించారు. కానీ అలా జరగలేదు.
రష్యా వద్ద దాదాపు 300 వరకూ అత్యాధునిక యుద్ధవిమానాలు ఉన్నాయి. అవి ఉక్రెయిన్ సరిహద్దులకు చేరువలోనే మోహరించి ఉన్నాయి. అయితే వాటిని పుతిన్ రంగంలోకి దించలేదు.
ఫలితమిదీ..
* ఉక్రెయిన్ గగనతలంపై పూర్తిస్థాయిలో పట్టు సాధించలేకపోవడం రష్యాకు ప్రతికూలంగా మారింది. ఫలితంగా ఉక్రెయిన్ యుద్ధవిమానాలు స్వేచ్ఛగా ప్రతిదాడులకు దిగుతున్నాయి. తక్కువ ఎత్తులో ఎగురుతూ రష్యా పోరాట హెలికాప్టర్లను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఉక్రెయిన్ సైన్యం కూడా వాటిని స్టింగర్ క్షిపణులతో నేలకూలుస్తోంది. భూతలంపై పోరాడుతున్న ఉక్రెయిన్ సైనికుల నైతిక స్థయిర్యాన్ని ఇది పెంచుతోంది.
* గగనతలం నుంచి సరైన రక్షణ కల్పించకుండానే ట్యాంకు దళాలను యుద్ధరంగంలోకి రష్యా పంపుతోంది. శత్రు యుద్ధవిమానాలను కూల్చే క్షిపణి వ్యవస్థలను కొన్నిసార్లు రంగంలోకి దించుతున్నప్పటికీ సమన్వయ లేమి వల్ల అవి సైనిక ట్రాఫిక్లో చిక్కుకుపోయి, అవసరమైన సాయాన్ని అందించలేకపోతున్నాయి.
* దీంతో ఉక్రెయిన్కు చెందిన ‘బేరక్తియార్ టిబి62’ వంటి సాయుధ డ్రోన్లు రంగంలోకి దిగి రష్యా ట్యాంకులకు గణనీయ స్థాయిలో నష్టం కలిగిస్తున్నాయి.
చాలినన్ని బాంబులు లేవా?
రష్యా తన అధునాతన యుద్ధవిమానాలను పూర్తిస్థాయిలో రంగంలోకి దించకపోవడానికి పలు అంశాలు కారణమవుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
* యుద్ధవిమానాల ద్వారా జారవిడిచే ‘ప్రిసిషన్ గైడెడ్ మ్యునిషన్’ (పీజీఎం) బాంబులు సరిపడా లేకపోవడం. లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించడంలో వీటికి తిరుగులేదు. వీటితోపాటు సాధారణ బాంబులు, రాకెట్లుకూ కొరత తలెత్తి ఉండొచ్చు.
* ఉక్రెయిన్లో పెద్ద సంఖ్యలో రష్యా బలగాలు విమాన విధ్వంసక క్షిపణులతో రంగంలోకి దిగిన నేపథ్యంలో వాటి నుంచి సొంత యుద్ధవిమానాలకు ప్రమాదం పొంచి ఉంటుంది. దీన్ని నివారించాలంటే రెండు విభాగాల మధ్య గరిష్ఠ స్థాయిలో సమన్వయం ఉండాలి. అలాంటి యంత్రాంగం రష్యా సైనిక బలగాల్లో అంతంతమాత్రంగానే ఉంది.
* పశ్చిమ దేశాలతో పోలిస్తే రష్యా యుద్ధవిమాన పైలట్ల శిక్షణ స్థాయి తక్కువగా ఉంది. రష్యా పైలట్ల సరాసరి గగనవిహార సమయం ఏడాదికి 100 గంటల మేర ఉంటోంది. అమెరికా పైలట్ల విషయంలో అది 180 నుంచి 240 గంటలుగా ఉంది.
ఇక మరింత ముమ్మర దాడులు?
గగనతలంపై పట్టు సాధించలేపోవడంపై రష్యా కమాండర్లు అసహనంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారు కీవ్పై మరింత దురుసుగా దాడులు చేయడంతోపాటు ఉక్రెయిన్లో మిగిలిన గగనతల రక్షణ వ్యవస్థలపై విరుచుకుపడొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఇందుకోసం మరిన్ని యుద్ధవిమానాలు, బాంబర్లను రంగంలోకి దించొచ్చు. మరోవైపు ఉక్రెయిన్ కూడా పశ్చిమ దేశాల నుంచి స్టింగర్ క్షిపణులు, ఇతర గగనతల రక్షణ ఆయుధాలను సమకూర్చుకుంటోంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో పోరు తీవ్రం కావొచ్చని భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
విద్యుత్ బకాయిల్ని వెంటనే చెల్లించకపోతే వారి ఫ్లాట్లకు కరెంట్ కట్ చేస్తామని రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తూ ఉచిత వసతి సదుపాయాన్ని వినియోగించుకుంటున్న ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. -
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
జగన్ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులపై 1,500కుపైగా కేసులు పెట్టారని, చివరికి ధర్నా చేశారంటూ 80ఏళ్ల వయసుపైబడిన పెన్షనర్లపైనా కేసులు నమోదు చేశారని అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏడాది పొడవునా బీఈడీ ప్రవేశాలా?ఉన్నత విద్యామండలిపై వెల్లువెత్తుతున్న విమర్శలు
బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) ప్రవేశాల కౌన్సెలింగ్ను ఉన్నత విద్యామండలి ఏడాది పొడవునా నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
బ్యాంకుల్లో నగదు జమకాని వారికి.. 4న ఇంటింటికీ పింఛన్ పంపిణీ
బ్యాంకు ఖాతాలు మనుగడలో లేని కారణంగా పింఛను నగదు జమకాని వారికి మే 4వ తేదీన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్కుమార్ వెల్లడించారు. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై సీఎం వెనక్కి తగ్గరు: మంత్రి పెద్దిరెడ్డి
ల్యాండ్ టైటిలింగ్ యాక్టును సీఎం జగన్ కచ్చితంగా అమలు చేసి తీరుతారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. -
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
అన్నం ముద్దపైనా అక్కసే!
అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టుగా.. విపక్షాలపైన తనకున్న ఉక్రోషాన్ని.. నిర్భాగ్యులమీద చూపారు జగన్... గత తెదేపా ప్రభుత్వం తెచ్చిన అన్న క్యాంటీన్లను వచ్చీరాగానే మూసేయించారు... రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఆ క్యాంటీన్లు.. రోజూ వేల మంది క్షుద్భాద తీర్చేవి. దీనిపై విమర్శలు పెరిగాక.. ‘ఆహా’ క్యాంటీన్లు తెచ్చినా... జగన్ పాలనలానే.. దిక్కూదివానం లేనట్లుంది వాటి పరిస్థితి. -
‘అన్నపూర్ణ’ అప్పుల కుప్ప
అద్భుత రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి... 70 శాతం పూర్తయిన పోలవరం... ఆశతో దూసుకొచ్చిన వందలాది ఐటీ పరిశ్రమలతో... ... కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన బిడ్డలా... ఐదేళ్ల కిందట జగన్ చేతికొచ్చింది ఆంధ్రావని! -
‘భీమ్లీ’ ఖల్ నాయక్!
‘‘నాయక్ నహీ.. ఖల్ నాయక్ మై హూ..!’’ అంటూ ఆయన చేసే హడావుడి అంతాఇంతా కాదు. ‘‘ఏం చేస్తున్నావ్? యూనిఫామ్ తీసేయ్..!’’ అంటూ పోలీసులపైనే రుసరుసలాడతారు. -
అంతా.. ఆ ఏడు చేపలకే!
వడ్డించే వాడు జగన్ అయితే... కేటాయింపులు ఇలాగే ఉంటాయి మరి. తన తండ్రి హయాంలోనే కంపెనీలతో రూ.లక్షల కోట్ల ‘క్విడ్ప్రోకో’ లావాదేవీలకు తెరతీసిన ఆయన... తాను గద్దెనెక్కాక ‘గంపగుత్త’ సూత్రాన్ని అనుసరించారు. -
వైకాపా హయాంలో ఎస్సీ కమిషన్ నిర్వీర్యం
వైకాపా హయాంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు ధ్వజమెత్తారు. సమతా సైనిక్దళ్ ఆధ్వర్యంలో గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
14 నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్
అత్యంత సమస్యాత్మకమైన 14 నియోజకవర్గాల పరిధిలో మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ పెడతామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
పథకాలకు గండికొట్టి.. గొంతెండబెట్టి!
ధ్వంసరచనే తప్ప దార్శనికత లేని జగన్ పాలనలో పట్టణాల్లో గుక్కెడు తాగునీళ్లూ కరవయ్యాయి. తెదేపా తెచ్చిందన్న ఏకైక కారణంతో రూ.వేల కోట్ల పథకాలను ఎండబెట్టిన ఈ నీరో చక్రవర్తి ఎండల్లో జనం గొంతెండి అలమటిస్తుంటే... తాడేపల్లి ప్యాలెస్లో ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నారు... కేవలం తన పంతం కోసం జనం సంక్షేమాన్ని వదిలేసిన ఈ ప్రభుత్వాధినేతను ఏమని పిలవాలి? -
పార్టీలకు కొమ్ముకాస్తున్న కొందరు ఐఏఎస్ అధికారులు
‘ప్రజలకు మేలు చేయాల్సిన కొందరు ఐఏఎస్లు... తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలకు కొమ్ముకాస్తున్నారు. అలాంటి వారిని రాజద్రోహులుగా ప్రకటించాలి’ అని ఆర్థిక నిపుణుడు, ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్ డిమాండ్ చేశారు. -
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887కు చేరింది. ఈ ఏడాది జనవరి 22న విడుదల చేసిన తుది జాబితాలో 4,08,07,356 మంది ఓటర్లు ఉన్నారు. -
ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
భగభగ మండే ఎండలతో రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కర్నూలు, కావలి, నంద్యాల, ఆరోగ్యవరం తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు పెరిగాయి. -
ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్పై వింత నాటకం
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేసే ఎన్నికల సంఘం.. ఉద్యోగులపై మాత్రం కక్షగట్టినట్లు వ్యవహరిస్తోంది. -
బకాయిలు చెల్లించకపోతే వైద్యం అందించలేం
బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 4 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) నగదు రహిత సేవలను నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆశా) ప్రకటించింది. -
కేజీబీవీ సిబ్బంది సేవల్లో ప్రభుత్వం కొత్త మెలిక
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల ఒప్పంద ఉపాధ్యాయినుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
-
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ
-
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM