Maruti Suzuki: సోనిపత్‌లో మారుతీ కొత్తప్లాంట్‌కు గ్రీన్‌సిగ్నల్‌

హరియాణలోని సోనిపట్‌ వద్ద మారుతీసుజుకీ కొత్త ప్లాంట్‌ ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ పేర్కొన్నారు

Published : 14 Nov 2021 14:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: హరియాణలోని సోనిపత్‌ వద్ద మారుతీసుజుకీ కొత్త ప్లాంట్‌ ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ పేర్కొన్నారు. ఖర్‌కొండ ప్రాంతంలోని 900 ఎకరాల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేయనున్నారు.  ఈ ప్లాంట్‌కు సంబంధించిన అన్ని క్లియర్సెన్‌లను ఇచ్చినట్లు ఖట్టర్‌ వెల్లడించారు. భారత్‌లో ఆటో మొబైల్‌ రంగం వేగంగా ఎదిగేందుకు మారుతీ కొత్త ప్లాంట్‌ దోహదం చేస్తుందని పేర్కొన్నారు. స్టేట్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ 15ఏళ్లపాటు రీఎంబర్స్‌మెంట్‌ చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. 

పానిపట్‌లో గ్రాసిమ్‌ ప్లాంట్‌

హరియాణలోని పానిపత్‌లో గ్రాసిమ్‌ పెయింట్స్‌ సరికొత్త ప్లాంట్‌ ఏర్పాటు చేయనుంది. తొలుత ఈ ప్లాంట్‌ను రోహ్‌తక్‌లో ఏర్పాటు చేయాలని భావించినా.. అనివార్య కారణాలతో పానిపత్‌కు మళ్లించారు. మొత్తం 70 ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు