EPFO: నేటి నుంచి మారబోతున్న ‘పీఎఫ్’ నియమాలు!
ఈపీఎఫ్ ఖాతాకు వారి ఆధార్తో లింక్ చేయబడని ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలో యజమాని వాటా (కంట్రీబ్యూషన్) నిలిపివేయబడుతుంది.
ఇంటర్నెట్ డెస్క్: వివిధ సంస్థల్లో పనిచేసే వారికి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) గురించి తెలిసే ఉంటుంది. దీనికి ఎంప్లాయ్ కంట్రిబ్యూషన్ (వాటా)తో పాటు సంస్థ కూడా అంతే మొత్తంలో జమచేస్తుంది. ఏ ఇతర పొదుపులతో పోలిస్తే అత్యధికంగా 8.5% వడ్డీ రేటు ఉండటం ఉద్యోగులకు లాభదాయకం.
నేటి (సెప్టెంబర్ 1) నుంచి ఈపీఎఫ్ నియమాలు మారబోతున్నాయి. ఉద్యోగులు తమ ఈపీఎఫ్ ఖాతాను ఆధార్తో లింక్ చేయని పక్షంలో కంపెనీ (యజమాని) వాటా జమ కాదు. దీనికి సంబంధించి కొన్ని నెలల క్రితమే ఈపీఎఫ్ఓ సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. యూఏఎన్-ఆధార్ అనుసంధానం కాకపోతే.. ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్ (ఈసీఆర్) భర్తీ కాదు. అంటే ఉద్యోగులు వారి సొంత పీఎఫ్ ఖాతాను చూడగలిగినప్పటికీ, కంపెనీ వాటాను మాత్రం పొందలేరు. ప్రావిడెంట్ ఫండ్ రెగ్యులేటర్ కూడా అన్ని ఈపీఎఫ్ ఖాతాదారుల యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)- ఆధార్ అనుసంధానించాలని యాజమాన్య సంస్థలను ఆదేశించింది. ఇంతకు ముందు ఈపీఎఫ్ - ఆధార్ లింక్ కోసం 30 మే 2021 వరకు గడువు ఉంది. కానీ తర్వాత, ఈపీఎప్ఓ - ఆధార్ లింక్ చివరి తేదీని 2021 ఆగస్టు 31 వరకు పొడిగించింది.
ఈపీఎఫ్లో ఉద్యోగికి కొవిడ్ - 19 అడ్వాన్స్ తీసుకోవడం, పీఎఫ్ బీమా, ఇతర పొదుపు పథకాల కన్నా అధిక వడ్డీ రేటు పొందడం వంటి అనేక ప్రయోజనాలు, ఉపయోగాలున్నాయి.
ఈపీఎఫ్ - ఆధార్ లింక్ ఆన్లైన్ ఎలా చేయాలంటే..
* పీఎఫ్ పోర్టల్లో మీ ఈపీఎఫ్ ఖాతాకు లాగిన్ అవ్వండి.
* మీ `యూఏఎన్`, ఆధార్లో నమోదు చేసుకున్న మోబైల్ నంబర్ను నమోదు చేయండి.
* `జనరేట్ ఓటీపీ` ఎంపికపై క్లిక్ చేయండి.
* ఓటిపీని పూర్తిచేసి జెండర్ను (లింగాన్ని) ఎంచుకోండి.
* ఆధార్ నంబర్ ఎంటర్ చేసి `ఆధార్ వెరిఫికేషన్`ను ఎంచుకోండి.
* మొబైల్, ఈ-మెయిల్ ఆధారిత ధృవీకరణ ఎంపికను ఎంచుకోండి.
* మీ మొబైల్ నంబర్కు మరో `ఓటీపీ` వస్తుంది.
* 2వ `ఓటీపీ`ని నమోదు చేయండి.
* మీ ఈపీఎఫ్, యూఏఎన్ ఆధార్ సీడింగ్ ప్రక్రియను పూర్తి చేయండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్