అధునాతనంగా యూబీఐ డిజిటల్ సేవలు
ఖాతాదారులకు మరింతగా చేరువయ్యేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) మెగా అవుట్రీచ్ కార్యక్రమాన్ని గురువారం చేపట్టింది.
ఈనాడు, హైదరాబాద్: ఖాతాదారులకు మరింతగా చేరువయ్యేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) మెగా అవుట్రీచ్ కార్యక్రమాన్ని గురువారం చేపట్టింది. కోఠి రీజియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చీఫ్ జనరల్ మేనేజర్ ఎస్.కె.మహాపాత్ర ప్రసంగించారు. డిజిటల్ సేవలను మెరుగుపరుస్తున్నామని, ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత పథకాల్లో మార్పులు చేస్తున్నామని మహాపాత్ర తెలిపారు. తద్వారా కొత్త ఖాతాదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. విద్యా రుణాలు అందించడంలో యూబీఐ ముందంజలో ఉందని హైదరాబాద్ జోనల్ మేనేజర్ కె.భాస్కరరావు చెప్పారు. ప్రతిభ గల విద్యార్థులకు అతి తక్కువ వడ్డీ రేట్లకు సులభతర షరతులతో రూ.40 లక్షల వరకు రుణాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఎంఎస్ఎంఈ రుణాలు అతి తక్కువ వ్యవధిలో మంజూరు చేస్తున్నట్టు కోఠి రీజనల్ హెడ్ కల్యాణ్ చెప్పారు. అనంతరం సుమారు రూ.103 కోట్ల విలువైన ఎంఎస్ఎంఈ, గృహ-విద్యారుణాలు, తనఖా రుణాల పత్రాలను ఖాతాదారులకు అందించారు. కార్యక్రమంలో ఏజీఎంలు విశ్వేశ్వర్, రఘునాథ్, పలు శాఖల మేనేజర్లు, 120 మంది ఖాతాదారులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి..
సీఎం రేవంత్రెడ్డిని రోహిత్ వేముల తల్లి రాధిక కలిశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఎల్పీయూ సత్తా.. వర్సిటీ విద్యార్థికి ₹3 కోట్ల ప్యాకేజీ (ADVT)
ఉన్నత విద్యలో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సటీ (LPU) తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ప్రాంగణ నియామకాల్లో కొత్త రికార్డులను నెలకొల్పుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
అఫ్గాన్ దౌత్యవేత్త బంగారం స్మగ్లింగ్.. కేసు నమోదు
-
డేవిడ్ వార్నర్.. 70 శాతం ఇండియన్ - 30 శాతం ఆస్ట్రేలియన్: జేక్ ఫ్రేజర్
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం