హైసియా నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్‌ నందెళ్ల

 హైసియా (హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌) నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్‌ నందెళ్ల ఎన్నియ్యారు.

Published : 30 Apr 2024 02:05 IST

ఈనాడు, హైదరాబాద్‌:  హైసియా (హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌) నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్‌ నందెళ్ల ఎన్నియ్యారు. హైసియా 32వ వార్షిక సమావేశంలో ఈ ఎన్నిక నిర్వహించారు. ప్రస్తుత అధ్యక్షురాలు మనీషా సాబూ నుంచి ప్రశాంత్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.  రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. ప్రస్తుతం ఆయన ఫస్ట్‌సోర్స్‌ అనే ఐటీ కంపెనీకి సీఓఓగా పనిచేస్తున్నారు. హైసియా ఉపాధ్యక్షుడిగా బిపిన్‌ పెండ్యాల, కోశాధికారిగా ఐ.రాజ్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణ లింగారెడ్డి, సహాయ కార్యదర్శిగా వినయ్‌ అగర్వాల్‌ను ఎన్నుకున్నారు. హరి భరధ్వాజ్‌, జితేంద్ర చక్రవర్తి, ఎన్‌.జయరామ్‌, కిషోర్‌ బొర్రా, మనమాస రామమోహన్‌, ఫణి పట్టమట్ట, రఘు బొడ్డుపల్లి, సాయిరాం ప్రభు వేదం, స్రవంతి లంక మేనేజింగ్‌ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని