Stock market: అంతర్జాతీయ మార్కెట్ల ఎఫెక్ట్‌.. ఫ్లాట్‌గా మన సూచీలు

Stock market: స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ 27 పాయింట్లు, నిఫ్టీ 18 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.

Published : 03 Apr 2024 16:03 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీ ఫ్లాట్‌గా ముగిశాయి. అమెరికాలో వెలువడిన తాజా గణాంకాల ప్రభావంతో వడ్డీ రేట్ల తగ్గింపు తాత్సారం కావొచ్చన్న అంచనాలతో ప్రపంచ మార్కెట్లు నష్టాలు చవిచూశాయి. దీని ప్రభావం మన మార్కెట్లపైనా పడింది. దీంతో సూచీలు రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి.

ఉదయం సెన్సెక్స్‌ 73,757.23 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 73,540.27 - 74,151.21 మధ్య చలించింది. చివరికి 27.09 పాయింట్ల నష్టంతో వద్ద 73,876.82 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 18.65 పాయింట్లు నష్టంతో 22,434.65 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.43గా ఉంది. సెన్సెక్స్‌లో ఎన్టీపీసీ, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు ప్రధానంగా లాభపడగా.. నెస్లే ఇండియా, కోటక్‌ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టైటాన్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 89.12 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు 2,291 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు