వారసత్వ ఆస్తి పై ఆదాయ పన్ను ఉంటుందా?

మరణించిన వ్యక్తి తరఫున ఆదాయ పన్ను రిటర్న్స్ ని దాఖలు చేయడానికి ఈ-ఫైలింగ్ వెబ్ సైట్ లో చట్టపరమైన వారసుడిగా నమోదు చేయాలి  

Published : 18 Dec 2020 19:05 IST

జీవితంలో ఖచ్చితమైన రెండు విషయాలు మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటి మరణం, ఇంకొకటి పన్నులు అని బెంజమిన్ ఫ్రాంక్లిన్ చెప్పారు. కానీ ఈ ప్రపంచంలో, మరణం కూడా పన్ను చెల్లింపుల నుంచి వ్యక్తిని రక్షించలేదు. ఒక వ్యక్తిని కోల్పోవడం అనేది నిజంగా చాలా కష్టమైన విషయం. ఒక వ్యక్తి మరణం తరువాత, అతనికి సంబంధించిన చట్టపరమైన వారసులు ఆస్తి పై వారసత్వం, మరణించిన వారి తరపున ఆదాయ పన్ను రిటర్న్స్ ను దాఖలు చేయడం మొదలైన చట్టపరమైన సమ్మతి ద్వారా వెళ్ళవలసి ఉంటుంది. ఒకవేళ మరణించిన వారికి కొన్ని క్యాపిటల్ ఆస్తులు ఉన్నట్లయితే, అవి చట్టపరమైన వారసుల పర్యవేక్షణలో ఉంటారు. ఏదేమైనప్పటికీ, మరణించిన వ్యక్తి తరఫున చట్టపరమైన వారసులు దాఖలు చేసే ఆదాయ పన్ను రిటర్న్స్ లో క్యాపిటల్ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయం లేదా చనిపోయిన వ్యక్తి ఇతర మార్గాల ద్వారా సంపాదించిన ఆదాయాన్ని నివేదించాలి. ఈ ఆర్టికల్ ద్వారా ఒక వ్యక్తి మరణం తరువాత తలెత్తే అన్ని పన్ను సమ్మతిల గురించి వివరించడం జరిగింది.

  1. మరణించిన వ్యక్తి తరపున పన్ను చెల్లింపు

పెట్టుబడిదారుడు మరణించిన సందర్భంలో, ఆదాయ పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 159 ప్రకారం, అతని చట్టపరమైన ప్రతినిధి పెట్టుబడిదారుడిగా పరిగణించబడతాడు, మరణించిన పెట్టుబడిదారుడు చెల్లించాల్సిన ఎలాంటి మొత్తాలనైనా చట్టపరమైన ప్రతినిధి చెల్లించవలసి ఉంటుంది. ఏదేమైనప్పటికీ, వారసత్వంగా సంక్రమించిన ఆస్తుల విలువకు మాత్రమే ఆదాయ పన్ను చెల్లించడం చట్టపరమైన వారసుల బాధ్యత.

  1. మరణించిన వ్యక్తి ఆదాయం లెక్కించడం

మరణించిన వ్యక్తి సంపాదించిన ఆదాయాన్ని రెండు భాగాలుగా విభజించాలి - అందులో ఒకటి మరణించిన తేదీకి ముందు సంపాదించిన ఆదాయం, రెండవది మరణించిన తేదీ తర్వాత సంపాదించిన ఆదాయం. మరణించిన వ్యక్తి తరపున చట్టపరమైన వారసుడు అతను మరణించిన తేదీ వరకు సంపాదించిన ఆదాయం కోసం రిటర్న్ ను దాఖలు చేయవలసి ఉంటుంది. అలాగే వారసత్వంగా పొందిన ఆస్తి పై వచ్చే ఆదాయం చట్టపరమైన వారసుడి సొంత ఆదాయంగా పరిగణించబడుతుంది.

ఏప్రిల్ 1 నుంచి మరణించిన తేదీ మధ్య కాలంలో సంపాదించిన ఆదాయం మరణించిన వ్యక్తి సొంత ఆదాయంగా పరిగణించబడుతుంది. అయితే, చట్టపరమైన వారసుడు మరణించిన వారి తరపున ఆదాయ పన్ను రిటర్న్స్ ను దాఖలు చేసి దానికి అనుగుణంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

మరణించిన తేదీ నుంచి ఆర్థిక సంవత్సరం చివరి వరకు సంపాదించిన ఆదాయం చట్టపరమైన వారసుడికి చెందుతుంది. అలాగే అతని వ్యక్తిగత ఆదాయ పన్ను రిటర్న్స్ లో దీనిని వెల్లడించవలసి ఉంటుంది.

  1. చట్టపరమైన వారసుడి ద్వారా ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు

మరణించిన వ్యక్తి తరఫున ఆదాయ పన్ను రిటర్న్స్ ని దాఖలు చేయడానికి, మొదటగా ఈ - ఫైలింగ్ వెబ్ సైట్ www.incometaxindiaefiling.gov.in లో చట్టపరమైన వారసుడిగా నమోదు చేసుకోవలసి ఉంటుంది.

స్టెప్ 1: https://incometaxindiaefiling.gov.in వెబ్ సైట్ ను సందర్శించి, చట్టపరమైన వారసుడి ఖాతాలోకి లాగిన్ అవ్వండి.

స్టెప్ 2: మెయిన్ మెనూ నుంచి మై అకౌంట్ లోకి వెళ్ళి> ప్రతినిధిగా నమోదు చేయండి.

స్టెప్ 3: ల్యాండింగ్ పేజీలో, మీరు క్రింద ఇచ్చన డ్రాప్-డౌన్ బాక్సుల నుంచి సంబంధిత ఆప్షన్ ను ఎంచుకోవాలి.

  • అభ్యర్థన రకం : క్రొత్త అభ్యర్థన

  • ప్రతినిధిగా నమోదు చేయండి: మరొక వ్యక్తి తరపున మిమ్మల్ని నమోదు చేసుకోండి

  • నమోదు చేసే వర్గం: లీగల్ హెయిర్

స్టెప్ 4: ప్రొసీడ్ పై క్లిక్ చేసి ల్యాండింగ్ పేజీలో కింది సమాచారాన్ని పూర్తి చేయండి:

  • మరణించిన వ్యక్తి పేరు

  • మరణించిన వ్యక్తి పాన్

  • మరణించిన వ్యక్తి పుట్టిన తేదీ

  • మరణించిన వ్యక్తి, చట్టబద్దమైన వారసుడి పాన్ కార్డు, మరణ ధ్రువీకరణ సర్టిఫికేట్ కాపీ, చట్టపరమైన వారసుల సర్టిఫికేట్ లేదా రిజిస్టర్డ్ వీలునామా లేదా కుటుంబ పెన్షన్ సర్టిఫికేట్ కాపీ లేదా బ్యాంక్ ఖాతాకు నామినీని నిర్ధారిస్తున్నట్లు బ్యాంకు జారీ చేసిన లేఖ సాఫ్ట్ కాపీలను అప్లోడ్ చేయండి.

ఈ పత్రాలన్నిటినీ జిప్ చేసి ఫోల్డర్లో అప్లోడ్ చేయాలి. జిప్ చేసిన ఫోల్డర్ గరిష్ట పరిమాణం 1 ఎంబీని మించకూడదు.

స్టెప్ 5: సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. సబ్మిట్ చేసిన తరువాత, మీరు డిపార్ట్మెంట్ నుంచి లావాదేవీ ఐడితో ఒక రసీదుని పొందుతారు

పైన తెలిపిన ప్రక్రియను పూర్తి చేసిన తరువాత, మీ అభ్యర్థనను డిపార్ట్మెంట్ ధృవీకరించి ఆమోదించిన తర్వాత, చట్టపరమైన వారసుడు తన సొంత ఈ - ఫైలింగ్ ఖాతా ద్వారా మరణించిన వ్యక్తి కి సంబంధించిన అన్ని సర్వీసులను ఉపయోగించగలడు.

రిజిస్ట్రేషన్ పూర్తైన తరువాత, చట్టపరమైన వారసుడు మరణించిన వ్యక్తి తరఫున రిటర్న్స్ ను నమోదు చేయవలసి ఉంటుంది. మరణించిన వ్యక్తి ఐటీఆర్ ను అప్లోడ్ చేయడానికి చట్టపరమైన వారసుడు తన సొంత లాగిన్ వివరాలను ఉపయోగించి ఈ - ఫైలింగ్ పోర్టల్ లో లాగిన్ అవ్వాలి. ఐటిఆర్ దాఖలు చేసే సమయంలో, మరణించిన వ్యక్తి ఐటీఆర్ ను అప్లోడ్ చేయడానికి మరణించిన వ్యక్తి పాన్ ను డ్రాప్ - డౌన్ జాబితా ద్వారా ఎంపిక చేయటానికి ఒక ఆప్షన్ ఇవ్వబడుతుంది.

  1. వారసత్వ ఆస్తిపై పన్ను

1986 సంవత్సరంలో వారసత్వ పన్ను రద్దు చేయబడింది. కావున, చట్టపరంగా వచ్చిన ఆస్తిపై చట్టపరమైన వారసులు వారసత్వ పన్నును చెల్లించాల్సిన అవసరం లేదు.

వారసత్వ పన్ను లేనప్పటికీ, బహుమతులు లేదా వారసత్వ ఆస్తిపై పన్ను విధింపును తెలుసుకోడానికి కొన్ని రకాల ఆదాయ పన్ను నిబంధనలు ఉన్నాయి.

ఒక వ్యక్తి ఎలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకోకుండా డబ్బు లేదా ఆస్తులను స్వీకరించినప్పుడు, అది ఆ వ్యక్తి అవశేష ఆదాయంగా పరిగణించబడుతుంది. ఈ నిబంధన ఏదైనా మొత్తం డబ్బు లేదా వీలునామా ద్వారా పొందిన ఆస్తికి వర్తించదు. అందువలన, చట్టపరమైన వారసుడికి సంక్రమించిన డబ్బు లేదా ఆస్తులపై ఆదాయ పన్ను చెల్లించవలసిన అవసరం ఉండదు.

అంతేకాక, బహుమతి లేదా వీలునామా లేదా ట్రస్ట్ కింద క్యాప్టిటల్ ఆస్తి బదిలీ, క్యాపిటల్ గైన్ పన్ను కోసం బదిలీగా పరిగణించబడదు. అందువలన, వారసత్వం కింద బదిలీ చేసిన క్యాపిటల్ ఆస్తికి పన్ను విధించబడదు.

  1. ఆదాయ పన్ను రిటర్న్స్ లో నివేదించడం

మరణించిన వ్యక్తి తరపున ఆదాయ పన్ను రిటర్న్స్ ను దాఖలు చేసే వారు కింద తెలిపిన పాయింట్ల ప్రకారం నమోదు చేయాలి :

  • మరణించిన వ్యక్తి ఏప్రిల్ 1 నుంచి చనిపోయే తేదీ వరకు సంపాదించిన ఆదాయాన్ని మాత్రమే మరణించిన వ్యక్తి ఆదాయంగా నమోదు చేయాలి.

  • వారసత్వ చట్ట ప్రకారం, చట్టపరమైన వారసుడికి బదిలీ చేసిన ఆస్తిని చనిపోయిన వ్యక్తి ఆదాయ పన్ను రిటర్న్స్ లో దాఖలు చేయకూడదు. ఎందుకంటే, ఈ లావాదేవీ మూలధన లాభం ప్రయోజనం కోసం చేసిన బదిలీగా పరిగణించబడదు .

  • వారసత్వ చట్టం ప్రకారం, చట్టబద్దమైన వారసులు పొందిన డబ్బు లేదా ఆస్తులను ఆదాయ పన్ను రిటర్న్స్ లో దాఖలు చేయకూడదు. ఎందుకంటే సెక్షన్ 56 (2) (ఎక్స్) వారసత్వంగా పొందిన డబ్బు లేదా ఆస్తికి వర్తించదు.

  • వ్యక్తి మరణించిన తేదీ తరువాత చట్టపరమైన వారసులు మరణించిన వ్యక్తి ద్వారా పొందిన ఆదాయాన్ని వారి సొంత ఆదాయంగా పరిగణించవచ్చు. దీనిని చట్టపరమైన వారసుడి వ్యక్తిగత రిటర్న్స్ లో దాఖలు చేయాల్సి ఉంటుంది.

  • వ్యక్తి మరణం తరువాత మరణించిన వ్యక్తి ఆదాయంతో సహా, చట్టపరమైన వారసుడి మొత్తం ఆదాయం రూ. 50 లక్షలు మించినట్లయితే, షెడ్యూల్ ఏఎల్ లోని నిబంధనల ప్రకారం, ఆర్థిక సంవత్సర చివరినాటికి చట్టపరమైన వారసుడు కలిగి ఉన్న మొత్తం ఆస్తులు, రుణాల వివరాలను అందించవలసి ఉంటుంది. ఇందులో వారసత్వంగా పొందిన ఆస్తులతో సహా మొత్తం ఆస్తులు, రుణాలకు సంబంధించిన వివరాలు కలిగి ఉంటాయి.

  • చట్టపరమైన వారసుడి ద్వారా వారసత్వ ఆస్తిని అమ్మినట్లైతే, చట్టబద్ధమైన వారసుడికి క్యాపిటల్ గెయిన్ కింద పన్ను విధిస్తారు. దాని ప్రకారం ఐటీఆర్ ఫారంలో షెడ్యూల్ క్యాపిటల్ గెయిన్స్ కింద నివేదించాల్సి ఉంటుంది.

మరణించిన వ్యక్తి కి సంబంధించిన ఆదాయ పన్ను రిటర్న్ లో పన్ను రిఫండ్ ఏమైనా ఉన్నట్లయితే, రిఫండ్ మొత్తాన్ని స్వీకరించడానికి ఉమ్మడి బ్యాంకు ఖాతా వివరాలను పూరించడం మంచిది. ఒకవేళ ఉమ్మడి ఖాతా లేనట్లయితే, చట్టపరమైన వారసుడు అతని బ్యాంకు ఖాతా వివరాలను అందించినట్లైతే, అతని వివరాలను ధృవీకరించడానికి మరణించిన వ్యక్తి కి సంబంధించిన చట్టపరమైన అసెస్మెంట్ ఆఫీసర్ ను సీపీసీ అడుగుతుంది. ధృవీకరణ పూర్తైన తర్వాత, చట్టపరమైన వారసుడి పేరుతో సీపీసీ రిఫండ్ ను జారీ చేస్తుంది.

  1. పాన్ కార్డును సరెండర్ చేయడం

చనిపోయిన వ్యక్తి చివరి ఆదాయ పన్ను రిటర్న్ ను దాఖలు చేసిన అనంతరం, అతని పాన్ కార్డును సరెండర్ చేయండి. అలాగే చెల్లించవలసిన పన్ను చెల్లింపులు లేదా రిఫండ్ అయిన మొత్తానికి సంబంధించిన రసీదులు ఏవైనా ఉంటే వాటిని కూడా అప్పగించటం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని