తండ్రి పోటీలో ఉండొద్దని కుమార్తెపై అత్యాచారం!
లఖ్నవూ: ఉత్తర్ప్రదేశ్లోని బారాబంకిలో అమానుషం చోటు చేసుకుంది. రానున్న పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా ఓ వ్యక్తిని నిలువరించేందుకు ఆయన కుమార్తెపై నలుగురు దారుణానికి ఒడిగట్టారు. తొలుత కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారానికి పాల్పడ్డారు. మంగళవారం జరిగిన ఈ ఘటనపై బాలిక ..
లఖ్నవూ: ఉత్తర్ప్రదేశ్లోని బారాబంకి జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. రానున్న పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా ఓ వ్యక్తిని నిలువరించేందుకు ఆయన కుమార్తెపై నలుగురు దారుణానికి ఒడిగట్టారు. తొలుత కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారానికి పాల్పడ్డారు. మంగళవారం జరిగిన ఈ ఘటనపై బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా ఉండేందుకు తొలుత పలుమార్లు ప్రత్యర్థులు తనపై ఒత్తిళ్లు తెచ్చారని, డబ్బునూ ఆశ చూపారని బాధితురాలి తండ్రి పేర్కొన్నారు. వీటన్నింటినీ నిరాకరించడంతో పాఠశాల నుంచి తిరిగొస్తున్న తన కూతురిని ప్రత్యర్థులు (ఆకాశ్ వర్మ, లాల్జీ వర్మ, సచిన్ వర్మ, శివమ్ వర్మ) అపహరించి అఘాయిత్యానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్పీ మనోజ్పాండే తెలిపారు. నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈత సరదా మిగిల్చిన విషాదం
వేసవి సెలవుల్లో సరదాగా ఈత కోసం వెళ్లిన ముగ్గురు బాలురు ప్రమాదవశాత్తు మున్నేరులో మునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని గుదిమళ్ల సమీపంలో గురువారం చోటుచేసుకుంది. -
ఉద్యోగాల క్రమబద్ధీకరణ పేరుతో లంచాలు
తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెబుతూ లంచాలు వసూలు చేయడంపై హైదరాబాద్ సీబీఐ విభాగం తపాలాశాఖ ఉద్యోగులపై కేసు నమోదు చేసింది. -
బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు
బాణసంచా పరిశ్రమలో చోటుచేసుకున్న భారీ పేలుడు ధాటికి 10 మంది మృత్యువాత పడ్డారు. మరో 11 మంది గాయపడ్డారు. -
లారీ క్యాబిన్ ప్రత్యేక అరలో రూ.8.36 కోట్లు
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్టు వద్ద జాతీయ రహదారిపై పైపుల లారీలో తరలిస్తున్న రూ.8.36 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
సజ్జల భార్గవ్రెడ్డిపై సీఐడీ కేసు నమోదు
వైకాపా సామాజిక మాధ్యమ విభాగం ఇన్ఛార్జి సజ్జల భార్గవ్రెడ్డిపై సీఐడీ గురువారం కేసు నమోదు చేసింది. 171-ఎఫ్, 171-జీ, 505(2) రెడ్విత్ 120-బీ సెక్షన్ల కింద కేసు పెట్టింది. -
కదులుతున్న మెట్రోలో బాలుడిపై లైంగిక వేధింపులు
కదులుతున్న మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై 28 ఏళ్ల వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు. తనకు ఎదురైన ఘటనపై బాలుడు ఎక్స్ వేదికగా పోస్టులు చేయడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం జగన్ వస్తున్నారని కరెంటు ఆపారు.. ప్రాణం తీశారు!
-
భార్య ఉండగా సహజీవనం చేసేందుకు ఇస్లాం అనుమతించదు
-
విశాఖలో సీఎస్ జవహర్రెడ్డి రహస్య పర్యటన?
-
భారత లోక్సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం.. రష్యా సంచలన ఆరోపణలు
-
కదులుతున్న మెట్రోలో బాలుడిపై లైంగిక వేధింపులు
-
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు